బిహార్ ఓటర్లు మరోమారు తమ ముఖ్యమంత్రిగా నితీష్ కుమార్ నే కోరుకుంటున్నారా..? అందకనే మహాకూటమికే పట్టంగట్టనున్నారా..? అంటే అవుననే సమాధానాలే వినబడుతున్నాయి. ఎన్నికల అనంతరం వెలువరించిన పోస్ట్ పోల్ సర్వేలు..ఎగ్జిట్ పోల్స్ అంచనాలు కూడా ఇదే విషయాన్ని స్పష్టం చేస్తున్నాయి. అయితే, వివిధ వార్తాసంస్థలు ఇచ్చిన అంచనాలలో వేర్వేరుగా ఫలితాలు వస్తున్నాయి. టైమ్స్ నౌ వర్గాలు జేడీయూ 112-132 స్థానాలతో మహాకూటమి అధికారం చేపట్టే అవకాశం ఉందని స్పష్టం చేయగా, ఇండియాటుడే - సిసెరో సంస్థలు నిర్వహించిన సర్వేలో మాత్రం ఎన్డీయేకు 120, మహాకూటమికి 117 స్థానాలు రావొచ్చని అంచనా వేశారు.
బిహార్లోని మొత్తం 243 అసెంబ్లీ స్థానాలకు ఐదు దశల్లో ఎన్నికలు జరిగిన విషయం తెలిసిందే. ఈ ఎన్నికల్లో ప్రధాని నరేంద్ర మోదీ, మహాకూటమి తరఫున నితీష్ కుమార్, లాలుప్రసాద్ లాంటి నాయకులు ముమ్మరంగా ప్రచారం చేశారు. తొలుత మహాకూటమిలో సమాజ్ వాదీ పార్టీ కూడా ఉన్నా.. తర్వాత మాత్రం ములాయం సింగ్ యాదవ్ మాత్రం దాన్నుంచి తప్పుకొన్నారు. ప్రచార పర్వం హోరాహోరీగా జరిగింది. బిహార్ రాష్ట్రంలో ప్రధానంగా విద్యుత్, తాగునీరు, రోడ్లు, పేదరికం లాంటి సమస్యలు రాజ్యమేలుతున్నాయి. వాటికి కారణం మీరంటే.. మీరంటూ ప్రధాన పక్షాలు దుమ్మెత్తిపోసుకున్నాయి. ఈ ఎన్నికల్లో ఏ కూటమికి ఎన్ని సీట్లు వస్తాయన్న విషయమై వివిధ జాతీయ వార్తా చానళ్లు ఎగ్జిట్ పోల్స్ నిర్వహించాయి. వాటి ప్రకారం అంచనాలు ఇలా ఉన్నాయి..
మొత్తం అసెంబ్లీ నియోజకవర్గాలు: 243
వార్తా ఛానల్ ఎన్డీయే మహాకూటమి ఇతరులు
టైమ్స్ నౌ 111 122 10
ఎన్డీటీవీ 116 120 7
న్యూస్ ఎక్స్ 90-100 130-140 13-23
ఇండియా టుడే 112-123 113-127 6
ఇండియా టీవీ 101-121 112-132 6-14
ఆజ్ తక్, ఏబీపీ 108 130
న్యూస్ నేషన్ 115-119 120-124 3-5
సీఎన్ఎక్స్ 95 135 18
జి. మనోహర్
(And get your daily news straight to your inbox)
Aug 22 | అమెరికా అందరికీ ఒక డ్రీమ్. మరీ ముఖ్యంగా ఇంజనీరింగ్ పూర్తి చేసిన మన దేశవాసులకు అందులోనూ తెలుగువారికి అగ్రరాజ్యంలోకి అడుగుపెట్టి.. అక్కడ ఉద్యోగం సంపాదించి, స్థిరపడాలన్నది చాలామంది అభిలాష. ఇప్పటికే ఈ ఆశలు ఉన్నవారు... Read more
Oct 08 | అసలే నవరాత్రి వేడుకలు.. అంతా ఉత్సాహంగా ఉన్నారు.. వీధి మధ్యలో గర్భా నృత్యం చేయడానికి ఏర్పాట్లు చేశారు. యువతులు, మహిళలతోపాటు పురుషులూ బాగా రెడీ అయి వచ్చేశారు. కానీ డ్యాన్స్ మొదలుపెట్టగానే కరెంటు పోయింది.... Read more
Oct 08 | తిరుమలలో భక్త జన సందోహం పెరిగింది. దసరా పండగ తరువాత పండగ సెలవులు ముగింపు దశకు చేరకుంటున్న తరుణంలో శ్రీవారి దర్శనం కోసం భక్తులో పోటెత్తారు. సెలవులతో కూడిన వారాంతం కావడంతో భక్తులు పెద్ద... Read more
Oct 08 | దేశవ్యాప్తంగా వాహనాల రిజిస్ట్రేషన్ కు ఒకటే సిరీస్ అయిన బీహెచ్ విషయంలో కేంద్ర రవాణా శాఖ నిబంధనలను సడలించనుంది. దేశవ్యాప్తంగా ప్రతీ రాష్ట్రానికి విడిగా ఒక రిజిస్ట్రేషన్ విధానం నడుస్తోంది. తెలంగాణ అయితే టీఎస్... Read more
Oct 07 | ప్రముఖ ప్రవచనకర్త గరికపాటి నరసింహరావు ఇటీవల మెగాస్టార్ చిరంజీవిపై చేసిన వ్యాఖ్యలు దుమారాన్ని రేపుతున్నాయి. మెగాఫాన్స్ మహాపండితుడు గరికపాటిపై నెట్టింట్లో ట్రోల్ చేస్తున్నారు. ఇక దీనికి మెగాబ్రదర్ నాగబాబు చేసిన ట్వీట్ కూడా తోడు... Read more