పటేళ్లకు రిజర్వేషన్ల కోసం పోరాటం చేస్తున్న యువ కెరటం హార్థిక్ పటేల్ కస్టడీని అహ్మదాబాద్ కోర్టు మరో రెండు రోజులు పొడిగించింది. దీంతో ఆయన నవంబర్ 3 వరకు పోలీసుల అదుపులో ఉండనున్నారు. మరో వారం రోజులపాటు తమ కస్టడీలో ఉంచేందుకు అనుమతించాలంటూ క్రైం బ్రాంచ్ పోలీసులు ఆదివారం మెట్రోపాలిటన్ కోర్టును ఆశ్రయించగా రెండు రోజులు అనుమతించారు. అంతకుముందు వారం రోజుల గడువుతో హార్థిక్ ను కస్టడీలోకి తీసుకున్న పోలీసులు ఆ గడువు అయిపోవడంతో కోర్టు ముందు ప్రవేశపెట్టి మరో వారం గడువు కోరారు.
హార్ధిక్ పటేల్ తమకు విచారణకు సహకరించడం లేదని, మొత్తం 452 గ్రూపులు వాట్సాప్ వంటి సామాజిక మాధ్యమాల ద్వారా తమ ఉద్యమాన్ని వ్యాప్తి చేస్తున్నారని గుర్తించామని కోర్టుకు తెలిపారు. ఆగస్టు 25న నిర్వహించిన ర్యాలీ తర్వాత రాష్ట్ర వ్యాప్తంగా ఆందోళనలు ఉదృతం చేయాలని, శాంతిభద్రతలకు భంగం కలిగించాలని ప్లాన్ వేశారని ఆరోపించారు. వీరి ఆందోళనకు విదేశీ హస్తం కూడా ఉందని, అక్కడి నుంచి వీరికి నిధులు సమకూరుతున్నాయనే అనుమానం కూడా ఉండటంతో అతడిని అదుపులోకి తీసుకొని విచారించడం అత్యవసరం అని తాము భావిస్తున్నామని క్రైం బ్రాంచ్ కోర్టుకు వివరించింది.
దేశద్రోహం, సమాజంలో అలజడులు సృష్టించడం వంటి తీవ్ర ఆరోపణలతో గతవారం హార్థిక్ పటేల్ను పోలీసులు అదుపులోకి తీసుకొని విచారిస్తున్న సంగతి తెలిసిందే. పటేళ్లకు రిజర్వేషన్లకోసం పోరాడుతున్న హార్దిక్ పటేల్.. దేశద్రోహి అని నిరూపించేలా ప్రాథమిక ఆధారాలున్నాయని గుజరాత్ హైకోర్టు కూడా ఇప్పటికే స్పష్టం చేసింది. పోలీసులను చంపాలనటం దేశద్రోహం కిందకే వస్తుందని.. అందువల్ల సూరత్ పోలీసులు హార్దిక్ పటేల్పై నమోదు చేసిన కేసు కొట్టేసేది లేదని జస్టిస్ జేబీ పార్దివాలా అంతకుముందు తీర్పునిచ్చిన విషయం విధితమే.
జి. మనోహర్
(And get your daily news straight to your inbox)
Aug 22 | అమెరికా అందరికీ ఒక డ్రీమ్. మరీ ముఖ్యంగా ఇంజనీరింగ్ పూర్తి చేసిన మన దేశవాసులకు అందులోనూ తెలుగువారికి అగ్రరాజ్యంలోకి అడుగుపెట్టి.. అక్కడ ఉద్యోగం సంపాదించి, స్థిరపడాలన్నది చాలామంది అభిలాష. ఇప్పటికే ఈ ఆశలు ఉన్నవారు... Read more
Oct 08 | అసలే నవరాత్రి వేడుకలు.. అంతా ఉత్సాహంగా ఉన్నారు.. వీధి మధ్యలో గర్భా నృత్యం చేయడానికి ఏర్పాట్లు చేశారు. యువతులు, మహిళలతోపాటు పురుషులూ బాగా రెడీ అయి వచ్చేశారు. కానీ డ్యాన్స్ మొదలుపెట్టగానే కరెంటు పోయింది.... Read more
Oct 08 | తిరుమలలో భక్త జన సందోహం పెరిగింది. దసరా పండగ తరువాత పండగ సెలవులు ముగింపు దశకు చేరకుంటున్న తరుణంలో శ్రీవారి దర్శనం కోసం భక్తులో పోటెత్తారు. సెలవులతో కూడిన వారాంతం కావడంతో భక్తులు పెద్ద... Read more
Oct 08 | దేశవ్యాప్తంగా వాహనాల రిజిస్ట్రేషన్ కు ఒకటే సిరీస్ అయిన బీహెచ్ విషయంలో కేంద్ర రవాణా శాఖ నిబంధనలను సడలించనుంది. దేశవ్యాప్తంగా ప్రతీ రాష్ట్రానికి విడిగా ఒక రిజిస్ట్రేషన్ విధానం నడుస్తోంది. తెలంగాణ అయితే టీఎస్... Read more
Oct 07 | ప్రముఖ ప్రవచనకర్త గరికపాటి నరసింహరావు ఇటీవల మెగాస్టార్ చిరంజీవిపై చేసిన వ్యాఖ్యలు దుమారాన్ని రేపుతున్నాయి. మెగాఫాన్స్ మహాపండితుడు గరికపాటిపై నెట్టింట్లో ట్రోల్ చేస్తున్నారు. ఇక దీనికి మెగాబ్రదర్ నాగబాబు చేసిన ట్వీట్ కూడా తోడు... Read more