తెలంగాణ ముఖ్యమంత్రి కె.చంద్రశేఖరరావును సిబిఐ విచారించిందా..? అవినీతి రహిత పాలనను అందిస్తామన్న కేసీఆర్ అధికారంలోకి రాగానే అవినీతికి పాల్పడ్డారా..? మరెందుకు ఆయనను సిబిఐ విచారించిందన్న ప్రశ్నలు తెలంగాణ ప్రజలను ఉత్కంఠకు గురిచేస్తున్నాయి. అవును సిబిఐ కేసీఆర్ ను ప్రశ్నించింది. తెలంగాణ ముఖ్యమంత్రిగా దూకుడుగా వ్యవహరిస్తున్న ఆయనకు కేంద్రం కళ్లాలు వేసిందన్న ఆరోపణలు గుప్పమంటున్నాయి. ఇందుకోసమే పాత కేసులను తిరగదోడి.. విచారణను ముమ్మరం చేస్తు ఇరకాటంలో పెట్టేందుకు ప్రయత్నాలు సాగిస్తున్నాయన్న వార్తలు వినబడుతున్నాయి.
ఇటీవలి కాలంలో ముఖ్యమంత్రి కేసీఆర్ సహా ఆయన పార్టీకి చెందిన ఎంపీలు, కేంద్ర ప్రభుత్వంపై విమర్శలు గుప్పిస్తున్న తరుణంలో పాత కేసులో సిబిఐ ఆయనను విచారించడమే ఇందుకు కారణంగా ఆ పార్టీకి చెందిన పలువురు రాజకీయ నేతలు విమర్శలు గుప్పిస్తున్నారు. అయితే అది ఆయన ముఖ్యమంత్రిగా చేసిన కార్యక్రమాలపై కాదు. కెసిఆర్ కేంద్ర మంత్రిగా ఉన్నప్పుడు తీసుకున్న నిర్ణయాలపై సిబిఐ ఆయనను విచారించింది. ఈ మేరకు ఆంగ్ల జాతీయ దినపత్రిక ఓ సంచలన వార్తను ప్రచురించింది. అది తెలంగాణలో పెను సంచలనంగా మారింది.
ఒక కాంట్రాక్టుకు సంబందించి విషయంలో ఆయనను ప్రశ్నించినట్లు ఆ పత్రిక తెలిపింది.2006లో కెసిఆర్ కేంద్ర కార్మిక, ఉపాది,శిక్షణ శాఖల మంత్రిగా ఉన్నారు.ఆ సమయంలో ఉమ్మడి ఎపిలో ఇఎస్ ఐ ఆస్పత్రుల భవనాల నిర్మాణ కాంట్రాక్టును నేషనల్ బిల్డింగ్ నిర్మాణ సంస్థకు కాకుండా ఎపి ఫిషరీస్ ఎక్జిక్యూటివ్ ఇంజనీర్ కు ఇవ్వడంపై వచ్చిన ఆరోపణల నేపధ్యంలో కెసిఆర్ ను ప్రశ్నించారు.సోమవారం నాడు సిబిఐ హైదరాబాద్ లోని కెసిఆర్ క్యాంప్ ఆఫీస్ కు వెళ్లి ప్రశ్నించినట్లు ఈ పత్రిక తెలిపింది.
ఈ నిర్మాణ పనులు నాసిరకంగా ఉన్నాయని భావించిన ఇఎస్ ఐ కార్పొరేషన్ 2007 -08 లోనే విచారణకు చర్యలు తీసుకుంది. దీనిపై వచ్చిన సమాచారం ఆధారంగా 2011 లో ఒక కేసును సిబిఐ నమోదు చేసింది.ఈ భవనాలను పరిశీలించిన ఐఐటి నిపుణులు అవి ప్రమాణికంగా లేవని, ఐదు కోట్ల నష్టం వాటిల్లిందని నివేదిక ఆదారంగా ఈ కేసు నమోదు అయింది.దీనిపై సంబందిత శాఖ ఉన్నతాధికారులను ,కెసిఆర్ కు ఆనాడు వ్యక్తిగత అదికారులుగా పనిచేసినవారిని విచారించిన తర్వాత ఇప్పుడు కెసిఆర్ ను ఈ కేసులో ప్రశ్నించినట్లు వచ్చిన సమాచారం సంచలనంగా మారింది
జి. మనోహర్
(And get your daily news straight to your inbox)
Aug 22 | అమెరికా అందరికీ ఒక డ్రీమ్. మరీ ముఖ్యంగా ఇంజనీరింగ్ పూర్తి చేసిన మన దేశవాసులకు అందులోనూ తెలుగువారికి అగ్రరాజ్యంలోకి అడుగుపెట్టి.. అక్కడ ఉద్యోగం సంపాదించి, స్థిరపడాలన్నది చాలామంది అభిలాష. ఇప్పటికే ఈ ఆశలు ఉన్నవారు... Read more
Oct 08 | అసలే నవరాత్రి వేడుకలు.. అంతా ఉత్సాహంగా ఉన్నారు.. వీధి మధ్యలో గర్భా నృత్యం చేయడానికి ఏర్పాట్లు చేశారు. యువతులు, మహిళలతోపాటు పురుషులూ బాగా రెడీ అయి వచ్చేశారు. కానీ డ్యాన్స్ మొదలుపెట్టగానే కరెంటు పోయింది.... Read more
Oct 08 | తిరుమలలో భక్త జన సందోహం పెరిగింది. దసరా పండగ తరువాత పండగ సెలవులు ముగింపు దశకు చేరకుంటున్న తరుణంలో శ్రీవారి దర్శనం కోసం భక్తులో పోటెత్తారు. సెలవులతో కూడిన వారాంతం కావడంతో భక్తులు పెద్ద... Read more
Oct 08 | దేశవ్యాప్తంగా వాహనాల రిజిస్ట్రేషన్ కు ఒకటే సిరీస్ అయిన బీహెచ్ విషయంలో కేంద్ర రవాణా శాఖ నిబంధనలను సడలించనుంది. దేశవ్యాప్తంగా ప్రతీ రాష్ట్రానికి విడిగా ఒక రిజిస్ట్రేషన్ విధానం నడుస్తోంది. తెలంగాణ అయితే టీఎస్... Read more
Oct 07 | ప్రముఖ ప్రవచనకర్త గరికపాటి నరసింహరావు ఇటీవల మెగాస్టార్ చిరంజీవిపై చేసిన వ్యాఖ్యలు దుమారాన్ని రేపుతున్నాయి. మెగాఫాన్స్ మహాపండితుడు గరికపాటిపై నెట్టింట్లో ట్రోల్ చేస్తున్నారు. ఇక దీనికి మెగాబ్రదర్ నాగబాబు చేసిన ట్వీట్ కూడా తోడు... Read more