జనసేన పార్టీ అధ్యక్షుడు, తెలుగు సినీ హీరో పవన్ కళ్యాణ్ కు ఏపి రాజధాని అమరావతి శంఖుస్థాపన కార్యక్రమంలో అపశృతి చోటుచేసుకుంది. ఆహ్వాన పత్రికను అందించేందుకు మంత్రులు కామినేని శ్రీనివాస్, అయ్యన్నపాత్రుడు చేరుకున్నారు. అయితే ఆ వార్తను కవర్ చెయ్యడానికి మీడియా సిబ్బంది అక్కడికి చేరుకున్నారు. అయితే మీడియా సిబ్బంది మీద పవన్ కళ్యాణ్ భద్రతా సిబ్బంది దాడికి దిగారు. మీడియా జర్నలిస్ట్ మీద దాడికి దిగడంతో పాటు.. కెమెరా కూడా ధ్వంసమైంది. అయితే అన్ని మీడియా చానల్స్ లో పవన్ బౌన్సర్ల ఓవరాక్షన్ అని వార్తలు వచ్చాయి. కాగా జరిగిన దాని ఘటన మీద పవన్ కళ్యాణ్ క్షమాపణలు చెప్పారు. అనుకోకుండా జరిగిన తప్పు అని.. ఎంతో మంది షూటింగ్ సమయంలో వస్తుంటారని.. అలా ఇబ్బంది కలుగుతుందనే ఉద్దేశంతో బౌన్సర్ లు కాస్త దురుసుగా ప్రవర్తిస్తారని అన్నారు. కానీ మీడియా ఛానల్స్ లో మాత్రం పవన్ కళ్యాణ్ బౌన్సర్ల దాడి గురించి ప్రధానంగా వార్తలు వేశాయి.. కానీ నిజానికి అక్కడ ఏం జరిగింది అన్నది మాత్రం వెయ్యలేదు. మరి నిజంగా అక్కడ ఏం జరిగింది.
పవన్ కళ్యాణ్ అంటేనే అదిరిపోయే ఫాలోయింగ్ ఉన్న తెలుగు సినిమా స్టార్. అలాగే ప్రస్తుతం తెలుగు రాష్ట్రాల్లో క్రేజ్ ఉన్న పొలిటీషియన్ కూడా. అయితే అమరావతి శంఖుస్థాపనకు సంబందించిన ఆహ్వాన పత్రికను అందించేందుకు మంత్రులు కామినేని శ్రీనివాస్, అయ్యన్నపాత్రుడు హైదరాబాద్ లోని రామానాయుడు స్టూడియోకు చేరుకున్నారు. అయితే అమరావతి శంఖుస్థాపన ఆహ్వాన పత్రికను రామానాయుడు స్టూడియోలో మంత్రులు అందిస్తున్నట్లు ముందుగానే మీడియాలో వార్తలు వచ్చాయి. దాంతో చాలా మందికి ముందే సమాచారం ఉండటంతో రామానాయుడు స్టూడియోకు చేరుకున్నారు. మంత్రులు అక్కడికి చేరుకోగానే కొంత మంది బయటి వ్యక్తులు కూడా అక్కడికి చేరుకున్నారు. అయితే అలా బయటి వ్యక్తులు అనుకొని.. మీడియా జర్నలిస్ట్ మీద అనుకోకుండా దాడి జరిగింది. అయితే దీనికి పవన్ కళ్యాణ్ క్షమాపణలు చెప్పారు. దాడికి సంబందించిన వీడియోను కూడా పవన్ పరిశీలించారు. దాడికి కారకుల మీద తను యాక్షన్ తీసుకుంటానని కూడా అన్నారు. గతంలో ఎన్నడూ ఇలాంటి ఘటన జరగలేదని పవన్ కళ్యాణ్ వివరించారు. మీడియాతో కానీ మరెవరితోనైనా పవన్ కళ్యాణ్ చాలా గౌరవంగా మాట్లాడతారు. కానీ మీడియాలో పవన్ కళ్యాణ్ క్షమాపణలు చెప్పిన దాని కన్నా.. దాడి ఘటనకు ఎక్కువ స్కోప్ ఇస్తున్నారు. మీడియాలో వస్తున్న కథనాలు నిజానికి వాస్తవమే కానీ వన్ సైడ్ అంటే కేవలం దాడి గురించి మాత్రమే వార్తలు రాయడం కరెక్ట్ కాదు. బౌన్సర్లు ఎందుకు దాడికి దిగారు.. అక్కడి పరిస్థితి ఏంటీ అన్న అంశాలను కూడా మీడియా చర్చిస్తే బాగుంటుంది.
*అభినవచారి*
(And get your daily news straight to your inbox)
Aug 22 | అమెరికా అందరికీ ఒక డ్రీమ్. మరీ ముఖ్యంగా ఇంజనీరింగ్ పూర్తి చేసిన మన దేశవాసులకు అందులోనూ తెలుగువారికి అగ్రరాజ్యంలోకి అడుగుపెట్టి.. అక్కడ ఉద్యోగం సంపాదించి, స్థిరపడాలన్నది చాలామంది అభిలాష. ఇప్పటికే ఈ ఆశలు ఉన్నవారు... Read more
Oct 08 | అసలే నవరాత్రి వేడుకలు.. అంతా ఉత్సాహంగా ఉన్నారు.. వీధి మధ్యలో గర్భా నృత్యం చేయడానికి ఏర్పాట్లు చేశారు. యువతులు, మహిళలతోపాటు పురుషులూ బాగా రెడీ అయి వచ్చేశారు. కానీ డ్యాన్స్ మొదలుపెట్టగానే కరెంటు పోయింది.... Read more
Oct 08 | తిరుమలలో భక్త జన సందోహం పెరిగింది. దసరా పండగ తరువాత పండగ సెలవులు ముగింపు దశకు చేరకుంటున్న తరుణంలో శ్రీవారి దర్శనం కోసం భక్తులో పోటెత్తారు. సెలవులతో కూడిన వారాంతం కావడంతో భక్తులు పెద్ద... Read more
Oct 08 | దేశవ్యాప్తంగా వాహనాల రిజిస్ట్రేషన్ కు ఒకటే సిరీస్ అయిన బీహెచ్ విషయంలో కేంద్ర రవాణా శాఖ నిబంధనలను సడలించనుంది. దేశవ్యాప్తంగా ప్రతీ రాష్ట్రానికి విడిగా ఒక రిజిస్ట్రేషన్ విధానం నడుస్తోంది. తెలంగాణ అయితే టీఎస్... Read more
Oct 07 | ప్రముఖ ప్రవచనకర్త గరికపాటి నరసింహరావు ఇటీవల మెగాస్టార్ చిరంజీవిపై చేసిన వ్యాఖ్యలు దుమారాన్ని రేపుతున్నాయి. మెగాఫాన్స్ మహాపండితుడు గరికపాటిపై నెట్టింట్లో ట్రోల్ చేస్తున్నారు. ఇక దీనికి మెగాబ్రదర్ నాగబాబు చేసిన ట్వీట్ కూడా తోడు... Read more