ఏపి కాంగ్రెస్ నాయకులకు ఏఐసిసి వైస్ ప్రెసిడెంట్ రాహుల్ గాంధీ ఉపదేశాలు ఇస్తున్నారు. కాంగ్రెస్ పార్టీ ఏపి విభజన తర్వాత పూర్తిగా దెబ్బతింది. ఉమ్మడి రాష్ట్రాన్ని ముక్కలు చేసిందన్న అపవాదుతో కనీసం ఎలక్షన్ లో కూడా నిలిచేందుకు అభ్యర్థులు కూడా దొరకలేదు. అయితే తాజాగా రాహుల్ గాంధీ ఏపి కాంగ్రెస్ నాయకులకు క్లాస్ తీసుకున్నారు. రాహుల్ గాంధీ ఆంద్రప్రదేశ్ రాజకీయాల పై ప్రత్యేక దృష్టి పెట్టారు. రాష్ట్ర విభజన తరువాత ఏపీ లో కాంగ్రెస్ పార్టీ పూర్తిగా ఖాళీ అయిపోవడంతో నీరు కారిపోయిన నేతలను ఉత్సాహ పరచడానికి రాహుల్ గాంధీ తీవ్ర ప్రయత్నాలు చేస్తున్నారు. ఏపిలో తిరిగి పార్టీకి బూస్టింగ్ ఇవ్వడానికి రాహుల్ గాంధీ అన్ని ప్రయత్నాలు చేస్తున్నారు. అందులో బాగంగానే కాంగ్రెస్ నాయకులకు వీలైనంత వరకు ఉత్సాహాన్ని నింపేందుకు ప్రయత్నాలు చేశారు.
రాహుల్ గాంధీ కాంగ్రెస్ నాయకులకు దైర్ఘ్య వచనాలు చెప్పారు. అందులో భాగంగానే ఏపీకి ప్రత్యేక హోదా ఇవ్వాలన్న ఆలోచన మనదే, పోరాడి దానిని అమలు చేయించాల్సిందీ మనమే, ఇది మన బాధ్యత, మీరు పోరాటాన్ని మరింత తీవ్రం చేయండి, మీకు అండగా నేను ఉంటా అని ఏపీసీసీ అధ్యక్షుడు రఘువీరారెడ్డికి కాంగ్రెస్ పార్టీ ఉపాధ్యక్షుడు రాహుల్గాంధీ చెప్పారు. రాహుల్ ను ఆయన నివాసంలో రఘువీరా రెడ్డి, పార్టీ రాష్ట్ర వ్యవహారాల ఇన్ ఛార్జ్ దిగ్విజయ్ కలిశారు. ప్రత్యేక హోదా, ఏపీకి ఇచ్చిన ఇతర హామీల అమలు, అమరావతి శంకుస్థాపన, ప్రధాని పర్యటన తదితర అంశాలపై చర్చించారు. పార్టీ అంతర్గత వ్యవహారాలపైనా సమాలోచనలు జరిపారు. ఈ సందర్భంగా ప్రత్యేక హోదా చాంపియన్ కాంగ్రెస్ పార్టీయేనని నాయకులు తీర్మానించారు.మరి రాహుల్ ఇచ్చిన అభయంతో అయినా కాంగ్రెస్ పార్టీ నేతలు చెలరేగిపోతారో లేదో చూడాలి.
*అభినవచారి*
(And get your daily news straight to your inbox)
Aug 22 | అమెరికా అందరికీ ఒక డ్రీమ్. మరీ ముఖ్యంగా ఇంజనీరింగ్ పూర్తి చేసిన మన దేశవాసులకు అందులోనూ తెలుగువారికి అగ్రరాజ్యంలోకి అడుగుపెట్టి.. అక్కడ ఉద్యోగం సంపాదించి, స్థిరపడాలన్నది చాలామంది అభిలాష. ఇప్పటికే ఈ ఆశలు ఉన్నవారు... Read more
Oct 08 | అసలే నవరాత్రి వేడుకలు.. అంతా ఉత్సాహంగా ఉన్నారు.. వీధి మధ్యలో గర్భా నృత్యం చేయడానికి ఏర్పాట్లు చేశారు. యువతులు, మహిళలతోపాటు పురుషులూ బాగా రెడీ అయి వచ్చేశారు. కానీ డ్యాన్స్ మొదలుపెట్టగానే కరెంటు పోయింది.... Read more
Oct 08 | తిరుమలలో భక్త జన సందోహం పెరిగింది. దసరా పండగ తరువాత పండగ సెలవులు ముగింపు దశకు చేరకుంటున్న తరుణంలో శ్రీవారి దర్శనం కోసం భక్తులో పోటెత్తారు. సెలవులతో కూడిన వారాంతం కావడంతో భక్తులు పెద్ద... Read more
Oct 08 | దేశవ్యాప్తంగా వాహనాల రిజిస్ట్రేషన్ కు ఒకటే సిరీస్ అయిన బీహెచ్ విషయంలో కేంద్ర రవాణా శాఖ నిబంధనలను సడలించనుంది. దేశవ్యాప్తంగా ప్రతీ రాష్ట్రానికి విడిగా ఒక రిజిస్ట్రేషన్ విధానం నడుస్తోంది. తెలంగాణ అయితే టీఎస్... Read more
Oct 07 | ప్రముఖ ప్రవచనకర్త గరికపాటి నరసింహరావు ఇటీవల మెగాస్టార్ చిరంజీవిపై చేసిన వ్యాఖ్యలు దుమారాన్ని రేపుతున్నాయి. మెగాఫాన్స్ మహాపండితుడు గరికపాటిపై నెట్టింట్లో ట్రోల్ చేస్తున్నారు. ఇక దీనికి మెగాబ్రదర్ నాగబాబు చేసిన ట్వీట్ కూడా తోడు... Read more