నరేంద్రమోదీ ప్రభుత్వానికి వ్యతిరేకంగా రచయితలు తాము గెలుచుకున్న అవార్డులు వెనక్కి ఇచ్చేయటం కొనసాగుతోంది. తాజాగా నాటకరంగ కళాకారిణి మాయా కృష్ణారావు అదే బాట పట్టారు. 2010లో సంగీత నాటక అకాడమీ తనకు ఇచ్చిన పురస్కారాన్ని ఆమె వెనక్కి ఇచ్చేశారు. సాహిత్య అకాడమీపై ధిక్కార స్వరం వినిపిస్తున్న రచయితలకు బుకర్ ప్రైజ్ విజేత సాల్మన్ రష్టీ మద్దతు పలికారు. రయితలు, కళాకారులు తమ నిరసన వ్యక్తం చేయడానికి ఇది సరైన పద్ధతి కాదని కేంద్ర సాంస్కృతిక శాఖ మంత్రి మహేష్ శర్మ అన్నారు.
మోదీ పరిపాలనలో భావ వ్యక్తీకరణ స్వేచ్ఛ నశించిపోతుందంటూ పలువురు రచయితలు తాము గెలుచుకున్న సాహిత్య అకాడమీ పురస్కారాలను వెనక్కి ఇచ్చేస్తున్నారు. ఇప్పుడు మొదటిసారి ఒర రంగస్థల కళాకారిణి వారికి జత కలిసారు. ఢిల్లీకి చెందిన మాయా కృష్ణారావు తాను 2010లో స్వీకరించిన సంగీత నాటక అకాడమీ అవార్డును వెనక్కి ఇచ్చేశారు. మాయా కృష్ణారావు ఎన్నో వీఽథినాటకాలు, ఏకాంత్కల్లో నటించడం ద్వారా సామాజిక అంశాలపై పోరాడుతున్నారు. ప్రస్తుతం దేశంలో కళాకారులకు నోరు విప్పే స్వేచ్ఛ లేకుండా పోయిందని ఆమె ఆవేదన వ్యక్తం చేశారు. రాష్ట్రపతి చెప్పిన మాటలను ఆచరించాలని, మోదీ ప్రజలకు పిలుపు ఇవ్వడం సరిపోదని ఆమె వ్యాఖ్యానించారు.
ఈ సందర్భంగా మాయా కృష్ణారావు మీడియాతో మాట్లాడుతూ అందరినీ రక్షించడం ప్రభుత్వంలో ఉన్నవారి బాధ్యత అని, అయితే అది జరుగుతోందని నాకు ఏమాత్రం అనిపించడంలేదని అన్నారు. ప్రభుత్వంపై విశ్వాసం భగ్నమైపోతోందని, ప్రతి రోజూ ఓ కొత్త షాక్ తగులుతోందని ఓ కొత్త ఉద్రేకం, ఆగ్రహం బైటపడుతోందని ఆమె ఆవేదన వ్యక్తం చేశారు. కొత్త కొత్త పేర్లతో ఏవేవో సంస్థలు వస్తున్నాయని, విశృంఖలంగా స్వైర విహారం చేస్తున్నాయని ఆమె అన్నారు. ఎప్పుడు ఎక్కడ ఏం జరిగినా వారిని అడిగేవారు, ఆపే వారు లేకుండా పోయారని మాయా కృష్ణారావు వ్యాఖ్యానించారు. హెచ్చరికలకు, బెదిరింపులకు గురవుతున్న ఇలాంటి పరిస్థితిని నేనెప్పుడూ చూడలేదని, మార్నింగ్ వాక్కు వెళ్లిన వ్యక్తినే చంపేసారని ఆమె ఆవేదన వ్యక్తం చేశారు.
జి. మనోహర్
(And get your daily news straight to your inbox)
Aug 22 | అమెరికా అందరికీ ఒక డ్రీమ్. మరీ ముఖ్యంగా ఇంజనీరింగ్ పూర్తి చేసిన మన దేశవాసులకు అందులోనూ తెలుగువారికి అగ్రరాజ్యంలోకి అడుగుపెట్టి.. అక్కడ ఉద్యోగం సంపాదించి, స్థిరపడాలన్నది చాలామంది అభిలాష. ఇప్పటికే ఈ ఆశలు ఉన్నవారు... Read more
Oct 08 | అసలే నవరాత్రి వేడుకలు.. అంతా ఉత్సాహంగా ఉన్నారు.. వీధి మధ్యలో గర్భా నృత్యం చేయడానికి ఏర్పాట్లు చేశారు. యువతులు, మహిళలతోపాటు పురుషులూ బాగా రెడీ అయి వచ్చేశారు. కానీ డ్యాన్స్ మొదలుపెట్టగానే కరెంటు పోయింది.... Read more
Oct 08 | తిరుమలలో భక్త జన సందోహం పెరిగింది. దసరా పండగ తరువాత పండగ సెలవులు ముగింపు దశకు చేరకుంటున్న తరుణంలో శ్రీవారి దర్శనం కోసం భక్తులో పోటెత్తారు. సెలవులతో కూడిన వారాంతం కావడంతో భక్తులు పెద్ద... Read more
Oct 08 | దేశవ్యాప్తంగా వాహనాల రిజిస్ట్రేషన్ కు ఒకటే సిరీస్ అయిన బీహెచ్ విషయంలో కేంద్ర రవాణా శాఖ నిబంధనలను సడలించనుంది. దేశవ్యాప్తంగా ప్రతీ రాష్ట్రానికి విడిగా ఒక రిజిస్ట్రేషన్ విధానం నడుస్తోంది. తెలంగాణ అయితే టీఎస్... Read more
Oct 07 | ప్రముఖ ప్రవచనకర్త గరికపాటి నరసింహరావు ఇటీవల మెగాస్టార్ చిరంజీవిపై చేసిన వ్యాఖ్యలు దుమారాన్ని రేపుతున్నాయి. మెగాఫాన్స్ మహాపండితుడు గరికపాటిపై నెట్టింట్లో ట్రోల్ చేస్తున్నారు. ఇక దీనికి మెగాబ్రదర్ నాగబాబు చేసిన ట్వీట్ కూడా తోడు... Read more