కర్ణాటకలో అప్పుల ఊబిలో చిక్కుకున్న రైతు కుటుంబాలు, అన్నదాతలను కోల్పయి అనాధగా మారి కడు దు:ఖంలో వున్న బాధిత కుటుంబాలకు కాంగ్రెస్ యువనేత రాహుల్ గాంధీ పర్యటన కన్నీళ్లను తుడిచింది. రాహుల్ కర్ణాటకలో నిర్వహిచిన పాదయాత్ర నేపథ్యంలో కర్ణాటక ప్రభుత్వం రైతులను కనుకరిస్తూ.. వారికి ఉపశమనం కలిగించేలా చర్యలను తీసుకుంది. రాష్ట్రంలో 541 మంది రైతులు ఆత్మహత్య చేసుకున్న నేపథ్యంలో అన్నదాతపై ప్రభుత్వం అనుగ్రహం కురిపించింది. రాహుల్గాంధీ సూచన మేరకు ముఖ్యమంత్రి సిద్దరామయ్య రైతులకు పలు వరాలు ప్రకటించారు.
ఆత్మహత్య చేసుకున్న రైతుల కుటుంబాలకు పరిహారాన్ని రూ.2 లక్షల నుంచి రూ.5 లక్షలకు పెంచుతున్నామని, ఉచిత బీమా వర్తింపజేస్తామని తెలిపారు. రైతుల పిల్లలకు పీజీదాకా ప్రభుత్వ ఖర్చుతో విద్యనందిస్తామన్నారు. రైతు వితంతువులకు నెలకు రూ.2వేలు పింఛన్ ఇస్తామన్నారు. భూమిలేని వ్యవసాయ కూలీల ఆత్మహత్యకూ పరిహారం వర్తిస్తుందని చెప్పారు. అలాగే సహకార బ్యాంకులు ఇచ్చిన పంటరుణాలపై ఈ ఏడాది వడ్డీ, అపరాధ వడ్డీలను మాఫీ చేస్తున్నామని, ఆ మొత్తాన్ని తామే చెల్లిస్తామని చెప్పారు. రుణాల రీ-షెడ్యూల్తోపాటు వసూళ్లను ఏడాదిపాటు వాయిదా వేయాలని బ్యాంకులను కోరామన్నారు. రైతులను పీల్చిపిప్పిచేస్తున్న 568 మంది వడ్డీ వ్యాపారులను అరెస్ట్ చేసి, 1300 కేసులు నమోదు చేశామని, వారిచ్చిన రుణాలనూ మాఫీచేసేందుకు యత్నిస్తామని చెప్పారు.
ఆత్మహత్యల్లో రైతులు.. సెల్ఫీ మోజులో ప్రధాని: రాహుల్
కాంగ్రెస్ పార్టీ, రాష్ట్ర ప్రభుత్వం రైతులకు అండ నిలుస్తాయని, ఆత్మహత్య వంటి తీవ్ర నిర్ణయాలు వద్దని రాహుల్గాంధీ భరోసా ఇచ్చారు. రాణిబెణ్ణూరు నుంచి గుడుగూర్ వరకు పాదయాత్రగా సాగిన ఆయన, మైదూరులో ఆత్మహత్య చేసుకున్న అశోక్ మడివాళ ఇంటికి వెళ్లి అతడి కుటుంబీకులను పరామర్శించారు. అశోక్ కుమారుడు కిరణ్కు ప్రభుత్వోద్యోగం ఇప్పించాలని సీఎంకు సూచించారు. కేపీసీసీ తరఫున వారికి రూ.2 లక్షల చెక్కును అందజేశారు. గుడుగూర్ బహిరంగసభలో మాట్లాడుతూ- రాష్ట్రంలో రైతులు ఆత్మహత్య చేసుకుంటుంటే ప్రధాని మోదీ ఏ మాత్రం బాధ్యత లేకుండా ఏదో ఒక దేశానికి వెళ్లి, బడా పారిశ్రామిక వేత్తలతో సెల్ఫీలు తీసుకుంటున్నారని దుయ్యబట్టారు. రైతులతో ఒక్కటంటే ఒక్క ఫొటో తీసుకున్న సందర్భమే లేదన్నారు. కూలీలు, కార్మికులు, రైతులంటే మోదీకి కంపరం కాబట్టే ప్రభుత్వం అన్యాయం చేస్తోందన్నారు. తన ‘మన్ కీ బాత్’ వినిపించడం కాకుండా రైతులు, కూలీల మన్ కీ బాత్ను కొద్దిసేపయినా వినాలన్నారు.
జి. మనోహర్
(And get your daily news straight to your inbox)
Aug 22 | అమెరికా అందరికీ ఒక డ్రీమ్. మరీ ముఖ్యంగా ఇంజనీరింగ్ పూర్తి చేసిన మన దేశవాసులకు అందులోనూ తెలుగువారికి అగ్రరాజ్యంలోకి అడుగుపెట్టి.. అక్కడ ఉద్యోగం సంపాదించి, స్థిరపడాలన్నది చాలామంది అభిలాష. ఇప్పటికే ఈ ఆశలు ఉన్నవారు... Read more
Oct 08 | అసలే నవరాత్రి వేడుకలు.. అంతా ఉత్సాహంగా ఉన్నారు.. వీధి మధ్యలో గర్భా నృత్యం చేయడానికి ఏర్పాట్లు చేశారు. యువతులు, మహిళలతోపాటు పురుషులూ బాగా రెడీ అయి వచ్చేశారు. కానీ డ్యాన్స్ మొదలుపెట్టగానే కరెంటు పోయింది.... Read more
Oct 08 | తిరుమలలో భక్త జన సందోహం పెరిగింది. దసరా పండగ తరువాత పండగ సెలవులు ముగింపు దశకు చేరకుంటున్న తరుణంలో శ్రీవారి దర్శనం కోసం భక్తులో పోటెత్తారు. సెలవులతో కూడిన వారాంతం కావడంతో భక్తులు పెద్ద... Read more
Oct 08 | దేశవ్యాప్తంగా వాహనాల రిజిస్ట్రేషన్ కు ఒకటే సిరీస్ అయిన బీహెచ్ విషయంలో కేంద్ర రవాణా శాఖ నిబంధనలను సడలించనుంది. దేశవ్యాప్తంగా ప్రతీ రాష్ట్రానికి విడిగా ఒక రిజిస్ట్రేషన్ విధానం నడుస్తోంది. తెలంగాణ అయితే టీఎస్... Read more
Oct 07 | ప్రముఖ ప్రవచనకర్త గరికపాటి నరసింహరావు ఇటీవల మెగాస్టార్ చిరంజీవిపై చేసిన వ్యాఖ్యలు దుమారాన్ని రేపుతున్నాయి. మెగాఫాన్స్ మహాపండితుడు గరికపాటిపై నెట్టింట్లో ట్రోల్ చేస్తున్నారు. ఇక దీనికి మెగాబ్రదర్ నాగబాబు చేసిన ట్వీట్ కూడా తోడు... Read more