షీనాబోరా కేసులో ప్రధాన నిందితురాలు, ఆమె తల్లి ఇంద్రాణి ముఖర్జియా మొదటి నుంచి రకరకాల వాదనలు, కథనాలు వినిపిస్తూ వస్తోంది. షీనా అసలు తన కూతురే కాదని ఓసారి, ఆమె అమెరికాలో బత్రికే వుందని మరోసారి, ఆరోగ్యం బాగేలేదని ఇంకోసారి.. ఇలా తనదైన శైలిలో కేసును తప్పుదోవ పట్టించేందుకు ప్లాన్ చేస్తూ వచ్చింది. అయితే.. అవి ఫలించక ఇంకా బెడిసికొట్టడంతో తాజాగా మరో వినూత్న విధానాన్ని ఎంచుకుంది ఈ అమ్మడు. ప్రస్తుతం బైకుల్లా జైలులో వున్న ఇంద్రాణి.. అక్కడి పోలీసుల వరుస విచారణలతోపాటు జైలులో అత్యంత దారుణ పరిస్థితిని ఎదుర్కొంటున్న నేపథ్యంలో.. ఎట్టిపరిస్థితుల్లోనైనా బెయిల్ పొంది, బయటపడాలని మరో కొత్త నాటకానికి తెరలేపినట్లు తెలుస్తోందని జైలు అధికార వర్గాలే అనుమానం వ్యక్తం చేశాయి. ఈ మేరకు ఇప్పటికే పలు కీలక ఆధారాలు సేకరించినట్లు తెలుస్తోంది.
జైల్లో ఉండగానే తీవ్ర అనారోగ్యానికి గురైన ఇంద్రాణి.. అపస్మారక స్థితిలోకి వెళ్లింది. అది గమనించిన జైలు అధికారులు ఆమెను హుటాహుటిన జేజే ఆసుపత్రికి తరలించారు. మూడు రోజుల చికిత్స అనంతరం ఇంద్రాణి తిరిగి స్పృహలోకొచ్చింది. స్పృహలోకొచ్చిన తర్వాత ఆసుపత్రిలోనే ప్రశ్నించిన పోలీసు అధికారులకు ఆమె ఆసక్తికర వాదనను చెప్పింది. తాను ఎలాంటి ఔషధాలు తీసుకోలేదని ఆమె చెప్పిందట. మరి ఉన్నట్టుండి అనారోగ్యానికి ఎలా గురయ్యారని పోలీసులు ఆరా తీశారు. ఈ క్రమంలోనే పొంతనలేని సమాధానాలు రావడంతో బెయిల్ పొందేందుకే ఆమె నాటకాలాడిందా? అన్న అనుమానాలు బలపడుతున్నాయి. అంతేకాదు.. గతంలో విచారణ నేపథ్యంలోనూ తడబడుతూ రకరకాల వాంగ్మూలాలను ఆమె ఇచ్చిన సంగతి తెలిసిందే! ఆ విషయాలను సమీక్షించిన అనంతరం.. బెయిల్ కోసమే ఆమె నాటకాలాడుతోందని.. ఇప్పుడు కూడా అనారోగ్య బారిన పడినట్లు పథకం చేసినట్లు అనుమానిస్తున్నారు.
ఇదిలావుండగా.. అనారోగ్యంతో ఆసుపత్రిలో చికిత్స పొందిన ఇంద్రాణి పూర్తిగా కోలుకుందని.. త్వరలోనే పోలీసులకు స్టేట్మెంట్ ఇస్తుందని ఆమెను పర్యవేక్షిస్తున్న సీనియర్ డాక్టర్ టీపీ లహానే చెప్పారు. ప్రస్తుతం ఆమె పూర్తిగా కోలుకుందని వైద్యులతో కూడా మాట్లాడుతోందని ఆయన వివరించారు. ప్రస్తుతం ఆ వైద్యుల అనుమతితోనే ఆమె డిశ్చార్జి అయ్యి పోలీసులకు వాంగ్మూలం ఇవ్వాల్సి ఉంటుంది. ఈ నేపథ్యంలో వైద్యులు ఆమె ఆరోగ్య పరిస్థితిపై ప్రకటన చేశారు. త్వరలోనే ఆమెను డిశ్చార్జి చేస్తామని, పోలీసులు వాంగ్మూలం నమోదు చేసుకోవచ్చని ఇప్పుడామె శరీరం అన్ని రకాలుగా సహకరిస్తుందని వివరించారు. దీంతో.. ఈరోజు (మంగళవారం) ఇంద్రాణి నుంచి అధికారికంగా వాంగ్మూలం సేకరించనున్న జైలు అధికారులు ఘటనపై సమగ్ర దర్యాప్తు చేసేందుకు సన్నాహాలు చేస్తున్నారు.
AS
(And get your daily news straight to your inbox)
Aug 22 | అమెరికా అందరికీ ఒక డ్రీమ్. మరీ ముఖ్యంగా ఇంజనీరింగ్ పూర్తి చేసిన మన దేశవాసులకు అందులోనూ తెలుగువారికి అగ్రరాజ్యంలోకి అడుగుపెట్టి.. అక్కడ ఉద్యోగం సంపాదించి, స్థిరపడాలన్నది చాలామంది అభిలాష. ఇప్పటికే ఈ ఆశలు ఉన్నవారు... Read more
Oct 08 | అసలే నవరాత్రి వేడుకలు.. అంతా ఉత్సాహంగా ఉన్నారు.. వీధి మధ్యలో గర్భా నృత్యం చేయడానికి ఏర్పాట్లు చేశారు. యువతులు, మహిళలతోపాటు పురుషులూ బాగా రెడీ అయి వచ్చేశారు. కానీ డ్యాన్స్ మొదలుపెట్టగానే కరెంటు పోయింది.... Read more
Oct 08 | తిరుమలలో భక్త జన సందోహం పెరిగింది. దసరా పండగ తరువాత పండగ సెలవులు ముగింపు దశకు చేరకుంటున్న తరుణంలో శ్రీవారి దర్శనం కోసం భక్తులో పోటెత్తారు. సెలవులతో కూడిన వారాంతం కావడంతో భక్తులు పెద్ద... Read more
Oct 08 | దేశవ్యాప్తంగా వాహనాల రిజిస్ట్రేషన్ కు ఒకటే సిరీస్ అయిన బీహెచ్ విషయంలో కేంద్ర రవాణా శాఖ నిబంధనలను సడలించనుంది. దేశవ్యాప్తంగా ప్రతీ రాష్ట్రానికి విడిగా ఒక రిజిస్ట్రేషన్ విధానం నడుస్తోంది. తెలంగాణ అయితే టీఎస్... Read more
Oct 07 | ప్రముఖ ప్రవచనకర్త గరికపాటి నరసింహరావు ఇటీవల మెగాస్టార్ చిరంజీవిపై చేసిన వ్యాఖ్యలు దుమారాన్ని రేపుతున్నాయి. మెగాఫాన్స్ మహాపండితుడు గరికపాటిపై నెట్టింట్లో ట్రోల్ చేస్తున్నారు. ఇక దీనికి మెగాబ్రదర్ నాగబాబు చేసిన ట్వీట్ కూడా తోడు... Read more