వరంగల్ జిల్లాలో అధికార టీఆర్ఎస్ పార్టీకీ, తెలుగుదేశం పార్టీ కార్యకర్తలకు మధ్య గత కొంత కాలంగా నిగూఢంగా వున్న యుద్దవాతావరణం ఇవాళ వారి మధ్య ఘర్షణకు దారితీసింది. జిల్లాలోని పాలపర్తి మార్కెట్ యార్డు వద్ద ఈ ఘర్షణ వాతావరణం ఉద్రిక్తలకు దారి తీసింది. మార్కెట్ యార్టులోని ఓ భవనం శంకుస్థాపన విషయంలో రేగిన వివాదమే ఘర్షణకు దారితీసింది. మార్కెట్ యార్డుకు టీటీడీఎల్పీనేత ఎర్రబెల్లి దయాకర్ రావు రాగానే ఆయనకు వ్యతిరేకంగా టీఆర్ఎస్ కార్యకర్తలు నినాదాలు చేయడం వారిని ప్రతిఘటించడానికి టీడీపీ కార్యకర్తాలు పోటీగా నినాదాలు చేయడంతో ఇరుపార్టీ కార్యకర్తల తోపులాట.. ఆ తరువాత ఘర్షణ చోటుచేసుకుంది. ఈ దాడిలో ఎర్రబెల్లి చేతికి గాయమైంది. పాలపర్తి ఎస్ఐ సహా 15 మందికి గాయాలయ్యాయి. క్షతగాత్రులను పోలీసులు చికిత్స నిమిత్తం ఆసుపత్రికి తరలించారు.
ఆదివారం జిల్లాలోని పాలకుర్తి మార్కెట్ యార్డులో అదనపు గదుల ప్రారంభోత్సవానికి ఎర్రబెల్లి దయాకర్ రావు హాజరయ్యారు. ఈ సందర్భంగా టీఆర్ఎస్ కార్యకర్తలు ఎర్రబెల్లిని అడ్డుకున్నారు. దీంతో టీఆర్ఎస్, టీడీపీ కార్యకర్తలు ఘర్షణకు దిగారు. పరస్పరం రాళ్లు రువ్వుకున్నారు. ఈ ఘటనలో ఎర్రబెల్లి దయాకర్ రావుతో పాటు అక్కడ ఉన్న పోలీసులకు, మీడియా ప్రతినిధులకు గాయాలయ్యాయి. దీంతో రంగంలోకి దిగిన పోలీసులు లాఠీచార్జీ చేసి ఇరు వర్గాలను చెదరగొట్టారు. పరిస్థితిని అదుపులోకి తీసుకువచ్చేందుకు గాను ఎర్రబెల్లిని కూడా పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. కాగా, టీఆర్ఎస్ దాడిని నిరసిస్తూ టీడీపీ కార్యకర్తలు ఆందోళనకు దిగారు. రోడ్డుపై బైఠాయించి రాస్తారోకో నిర్వహించారు. దీంతో వాహనాల రాకపోకలు నిలిచిపోయాయి.
జి. మనోహర్
(And get your daily news straight to your inbox)
Aug 22 | అమెరికా అందరికీ ఒక డ్రీమ్. మరీ ముఖ్యంగా ఇంజనీరింగ్ పూర్తి చేసిన మన దేశవాసులకు అందులోనూ తెలుగువారికి అగ్రరాజ్యంలోకి అడుగుపెట్టి.. అక్కడ ఉద్యోగం సంపాదించి, స్థిరపడాలన్నది చాలామంది అభిలాష. ఇప్పటికే ఈ ఆశలు ఉన్నవారు... Read more
Oct 08 | అసలే నవరాత్రి వేడుకలు.. అంతా ఉత్సాహంగా ఉన్నారు.. వీధి మధ్యలో గర్భా నృత్యం చేయడానికి ఏర్పాట్లు చేశారు. యువతులు, మహిళలతోపాటు పురుషులూ బాగా రెడీ అయి వచ్చేశారు. కానీ డ్యాన్స్ మొదలుపెట్టగానే కరెంటు పోయింది.... Read more
Oct 08 | తిరుమలలో భక్త జన సందోహం పెరిగింది. దసరా పండగ తరువాత పండగ సెలవులు ముగింపు దశకు చేరకుంటున్న తరుణంలో శ్రీవారి దర్శనం కోసం భక్తులో పోటెత్తారు. సెలవులతో కూడిన వారాంతం కావడంతో భక్తులు పెద్ద... Read more
Oct 08 | దేశవ్యాప్తంగా వాహనాల రిజిస్ట్రేషన్ కు ఒకటే సిరీస్ అయిన బీహెచ్ విషయంలో కేంద్ర రవాణా శాఖ నిబంధనలను సడలించనుంది. దేశవ్యాప్తంగా ప్రతీ రాష్ట్రానికి విడిగా ఒక రిజిస్ట్రేషన్ విధానం నడుస్తోంది. తెలంగాణ అయితే టీఎస్... Read more
Oct 07 | ప్రముఖ ప్రవచనకర్త గరికపాటి నరసింహరావు ఇటీవల మెగాస్టార్ చిరంజీవిపై చేసిన వ్యాఖ్యలు దుమారాన్ని రేపుతున్నాయి. మెగాఫాన్స్ మహాపండితుడు గరికపాటిపై నెట్టింట్లో ట్రోల్ చేస్తున్నారు. ఇక దీనికి మెగాబ్రదర్ నాగబాబు చేసిన ట్వీట్ కూడా తోడు... Read more