ప్రపంచ ఆటోమోటివ్స్ రంగంలో తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న జర్మనీకి చెందిన ఆటోమొబైల్ దిగ్గజం ఫోక్స్వ్యాగన్కు మరో ఎదురుదెబ్బ తగిలింది. కాలుష్య ఉద్గార కుంభకోణం నేపథ్యంలో కంపెనీ చీఫ్ ఎగ్జిక్యూటివ్ మార్టిన్ వింటర్కార్న్ తన పదవికి రాజీనామా చేశారు. కంపెనీపై తాజాగా వెళ్లువెత్తుతున్న ఆరోపణల నేపథ్యంలో ఐదు మంది డైరెక్టర్ల బృందం ఒత్తిడి తీసుకరావడం వల్లనే మార్టిన్ తన పదవి నుంచి వైదొలుగినట్లు సమాచారం. తాజా పరిస్థితులు తనకు సాక్ కలిగిస్తున్నాయని ఆయన అన్నారు. ప్రపంచంలో కార్ల తయారీలో రెండో అతిపెద్ద సంస్థయైన ఫోక్స్వ్యాగన్పై జర్మనీ ప్రభుత్వం విచారణకు ఆదేశించింది. కాలుష్య పరీక్షల్లో పాసయ్యేందుకు రూపొందించిన ప్రత్యేక సాఫ్ట్వేర్ను ప్రపంచ వ్యాప్తంగా కోటికిపైగా కార్లలో అమర్చినట్లు సంస్థ ఇటీవల ఒప్పుకున్నది.
దీనిపై విచారణ చేపట్టిన జపాన్ ప్రభుత్వ ఉన్నతాధికారులు వాల్ఫ్బర్గ్లో ఉన్న సంస్థ ప్రధాన కార్యాలయాన్ని సందర్శించనున్నట్లు ఫెడరల్ ట్రాన్స్పోర్ట్ మంత్రి అలెగ్జాండర్ ప్రకటించారు. జర్మనీ, యూరప్ మార్గదర్శకాలకు లోబడి సంస్థ వ్యవహరించిందా.. లేదా.. తెలుసుకోవడానికి ఏర్పాటు చేసిన ఈ కమిటీకి ఆ దేశ రవాణా శాఖ మంత్రి మైకేల్ నాయకత్వం వహించనున్నారు. కంపెనీ పేర్కొన్న విధంగానే కాలుష్యం వెలువడుతుందా..అంతకుమించి అధిక మోతాదులో వెలువడుతున్నాయో ఒకసారి పరిశీలించిన తర్వాత ఆ సంస్థపై క్రిమినల్ కేసులు పెట్టాలన్న యోచనలో అమెరికన్ అధికారులున్నట్లు తెలుస్తున్నది. ఇటీవల అమెరికాలో ప్రారంభమైన ఈ కుంభకోణం ప్రస్తుతం ఇతర దేశాలకు వ్యాపించింది. యూఎస్లో ఇప్పటి వరకు 50 లక్షల డీజిల్ కార్లను రీకాల్ చేస్తున్నట్లు సంస్థ ప్రకటించింది కూడా.
ఫోక్స్వ్యాగన్ అమర్చిన ఈ ప్రత్యేక సాఫ్ట్వేర్.. కారు నడుస్తున్నప్పుడు ఉద్గార నియంత్రణ వ్యవస్థను పనిచేయకుండా ఆపేస్తుంది. కాలుష్య పరీక్ష చేస్తున్న సమయంలో మాత్రమే ఈ కంట్రోల్స్ పనిచేసేవిధంగా రూపొందించింది. కాలుష్య పరీక్షలో పాసయ్యేందుకు వీలుగా కంపెనీ ఉద్దేశపూర్వకంగానే ఈ సాఫ్ట్వేర్ను కార్లలో అమర్చిందని అమెరికా అధికారులు ఆరోపిస్తున్నారు. 40 శాతం అధికంగా కాలుష్యాన్ని వెదజళ్లనున్నది. ఫ్రాంక్ఫర్ట్ స్టాక్ ఎక్సేంజ్లో కంపెనీ షేరు ధర మంగళవారం 20 శాతం మేర పడిపోయింది. గడిచిన రెండు రోజుల్లో షేరు విలువ 36 శాతం మేర క్షీణించడంతో 2700 కోట్ల యూరోల మార్కెట్ విలువను కోల్పోయింది. కంపెనీలో తలెత్తుతున్న పరిణామాల నేపథ్యంలో జర్మనీ చాన్సలర్ ఎంజెలా మోర్కెల్ మాట్లాడుతూ.. సాధ్యమైనంతగా తొందరగా కోలుకోవాలని వ్యాఖ్యానించారు. మొత్తంగా ప్రపంచ ఆటోమోటివ్స్ రంగంలో అగ్రగామి కంపెనీగా పేరున్న ఫోక్స్ వాగన్ కంపెనీ అప్రతిష్టపాలు కావడం మార్కెట్ల మీద చాలా ప్రభావం చూపించింది.
(And get your daily news straight to your inbox)
Aug 22 | అమెరికా అందరికీ ఒక డ్రీమ్. మరీ ముఖ్యంగా ఇంజనీరింగ్ పూర్తి చేసిన మన దేశవాసులకు అందులోనూ తెలుగువారికి అగ్రరాజ్యంలోకి అడుగుపెట్టి.. అక్కడ ఉద్యోగం సంపాదించి, స్థిరపడాలన్నది చాలామంది అభిలాష. ఇప్పటికే ఈ ఆశలు ఉన్నవారు... Read more
Oct 08 | అసలే నవరాత్రి వేడుకలు.. అంతా ఉత్సాహంగా ఉన్నారు.. వీధి మధ్యలో గర్భా నృత్యం చేయడానికి ఏర్పాట్లు చేశారు. యువతులు, మహిళలతోపాటు పురుషులూ బాగా రెడీ అయి వచ్చేశారు. కానీ డ్యాన్స్ మొదలుపెట్టగానే కరెంటు పోయింది.... Read more
Oct 08 | తిరుమలలో భక్త జన సందోహం పెరిగింది. దసరా పండగ తరువాత పండగ సెలవులు ముగింపు దశకు చేరకుంటున్న తరుణంలో శ్రీవారి దర్శనం కోసం భక్తులో పోటెత్తారు. సెలవులతో కూడిన వారాంతం కావడంతో భక్తులు పెద్ద... Read more
Oct 08 | దేశవ్యాప్తంగా వాహనాల రిజిస్ట్రేషన్ కు ఒకటే సిరీస్ అయిన బీహెచ్ విషయంలో కేంద్ర రవాణా శాఖ నిబంధనలను సడలించనుంది. దేశవ్యాప్తంగా ప్రతీ రాష్ట్రానికి విడిగా ఒక రిజిస్ట్రేషన్ విధానం నడుస్తోంది. తెలంగాణ అయితే టీఎస్... Read more
Oct 07 | ప్రముఖ ప్రవచనకర్త గరికపాటి నరసింహరావు ఇటీవల మెగాస్టార్ చిరంజీవిపై చేసిన వ్యాఖ్యలు దుమారాన్ని రేపుతున్నాయి. మెగాఫాన్స్ మహాపండితుడు గరికపాటిపై నెట్టింట్లో ట్రోల్ చేస్తున్నారు. ఇక దీనికి మెగాబ్రదర్ నాగబాబు చేసిన ట్వీట్ కూడా తోడు... Read more