‘బాహుబలి’.. దర్శకధీరుడు రాజమౌళి రూపొందించిన అద్భుత శిల్పం. అద్భుతమైన గ్రాఫిక్స్ తో తెరకెక్కిన ఈ చిత్రం ప్రపంచవ్యాప్తంగా ప్రశంసలు అందుకోవడంతోపాటు తెలుగు సినిమా ఖ్యాతిని విశ్వవ్యాప్తంగా వ్యాప్తిచెందేలా చేసింది. లండన్ ఫిల్మ్ ఫెస్టివల్ లో ప్రదర్శించబడిన ఈ చిత్రం.. భుసన్ ఫెస్టివల్ ల్లోనూ ప్రదర్శనకు సిద్ధమవుతోంది. ఇక ‘శ్రీమంతుడు’ చిత్రం విషయానికొస్తే.. గ్రామాన్ని దత్తత తీసుకునే నేపథ్యంలో కొనసాగే ఆ సినిమా ఎందరికో స్ఫూర్తిదాయకంగా నిలిచింది. టాలీవుడ్ లో సరికొత్త రికార్డులు సృష్టించడంతోపాటు దేశవ్యాప్తంగా ప్రశంసలు అందుకుంది. ఇంతటి ఘనవిజయాలు సాధించిన ఈ రెండు చిత్రాలకు తాజాగా ‘కోర్టు’ ఝలకిచ్చింది. ఇంతకీ ఏ విషయంలో అనుకుంటున్నారా! ఆ వివరాలు తెలియాలంటే మేటర్ లోకి వెళ్లాల్సిందే!
అసలు విషయం ఏమిటంటే.. వచ్చే ఏడాది ఫిబ్రవరి, మార్చి నెలల్లో 88వ ఆస్కార్ అవార్డుల ప్రధాన కార్యక్రమం జరగనుంది. ఇందులో భాగంగానే ఉత్తమ విదేశీ భాషల చిత్రాల కేటగిరీలో జ్యురీ ఛైర్మన్, డైరెక్టర్ అమోల్ పాలేకర్ తన బృందంతో కలిసి తొలుత 30 భారతీయ చిత్రాలను పరిశీలించారు. వాటిల్లో తెలుగు చిత్రాలైన ‘బాహుబలి’, ‘శ్రీమంతుడు’.. తమిళం నుంచి ‘కాక్క ముట్టై’.. బాలీవుడ్ నుంచి ‘పీకే’, ‘హైదర్’, ‘మేరీకోమ్’, మసాన్.. మరాఠీ పరిశ్రమ నుంచి ‘కోర్టు’ ఇంకా తదితర చిత్రాలు వున్నాయి. అలా ఎంపిక చేసిన ఆ 30 సినిమాలను ‘ఎంపిక బృందం’ తొమ్మిది రోజులపాటు హైదరాబాద్ లో చూశారు. వాటిల్లో ఏది ఉత్తమ విదేశీ చిత్రంగా ఎంపిక చేయాలోనన్న తర్జనభర్జన చేసి.. చివరగా ‘కోర్టు’ చిత్రాన్ని ఎంపిక చేసినట్లు వివరించారు. 88వ ఆస్కార్ అవార్డుల ప్రధాన కార్యక్రమం కోసం భారత్ నుంచి ‘కోర్టు’ సినిమాను అధికారికంగా ఎంపిక చేసినట్లు అమోల్ పాలేకర్ బుధవారం వెల్లడించారు.
‘కోర్టు’ లోపల జరిగే సన్నివేశాలతో సాగే ఈ చిత్రాన్ని ప్రముఖ మరాఠీ దర్శకుడు చైతన్య తమనే రూపొందించారు. ముంబయి క్రిందిస్థాయి కోర్టులో ఓ వృద్ధ ఫోక్ సింగర్ కు సంబంధించిన కేసు వాదోపవాదాలతో ఈ చిత్రం ముందుకు సాగుతుంది. ఇప్పటికే ఈ చిత్రం జాతీయ అవార్డును గెలుచుకోగా.. తాజాగా ‘బాహుబలి’, ‘శ్రీమంతుడు’, ‘పీకే’, ‘మేరీ కోం’ వంటి చిత్రాలన్నింటిని వెనక్కి నెట్టేసి.. ఆస్కార్ కు నామినేషన్ పొందింది.
AS
(And get your daily news straight to your inbox)
Aug 22 | అమెరికా అందరికీ ఒక డ్రీమ్. మరీ ముఖ్యంగా ఇంజనీరింగ్ పూర్తి చేసిన మన దేశవాసులకు అందులోనూ తెలుగువారికి అగ్రరాజ్యంలోకి అడుగుపెట్టి.. అక్కడ ఉద్యోగం సంపాదించి, స్థిరపడాలన్నది చాలామంది అభిలాష. ఇప్పటికే ఈ ఆశలు ఉన్నవారు... Read more
Oct 08 | అసలే నవరాత్రి వేడుకలు.. అంతా ఉత్సాహంగా ఉన్నారు.. వీధి మధ్యలో గర్భా నృత్యం చేయడానికి ఏర్పాట్లు చేశారు. యువతులు, మహిళలతోపాటు పురుషులూ బాగా రెడీ అయి వచ్చేశారు. కానీ డ్యాన్స్ మొదలుపెట్టగానే కరెంటు పోయింది.... Read more
Oct 08 | తిరుమలలో భక్త జన సందోహం పెరిగింది. దసరా పండగ తరువాత పండగ సెలవులు ముగింపు దశకు చేరకుంటున్న తరుణంలో శ్రీవారి దర్శనం కోసం భక్తులో పోటెత్తారు. సెలవులతో కూడిన వారాంతం కావడంతో భక్తులు పెద్ద... Read more
Oct 08 | దేశవ్యాప్తంగా వాహనాల రిజిస్ట్రేషన్ కు ఒకటే సిరీస్ అయిన బీహెచ్ విషయంలో కేంద్ర రవాణా శాఖ నిబంధనలను సడలించనుంది. దేశవ్యాప్తంగా ప్రతీ రాష్ట్రానికి విడిగా ఒక రిజిస్ట్రేషన్ విధానం నడుస్తోంది. తెలంగాణ అయితే టీఎస్... Read more
Oct 07 | ప్రముఖ ప్రవచనకర్త గరికపాటి నరసింహరావు ఇటీవల మెగాస్టార్ చిరంజీవిపై చేసిన వ్యాఖ్యలు దుమారాన్ని రేపుతున్నాయి. మెగాఫాన్స్ మహాపండితుడు గరికపాటిపై నెట్టింట్లో ట్రోల్ చేస్తున్నారు. ఇక దీనికి మెగాబ్రదర్ నాగబాబు చేసిన ట్వీట్ కూడా తోడు... Read more