దిగ్విజయ్ సింగ్ ఒక ఫోటో సర్వత్రా చర్చకు దారి తీసింది. కాంగ్రెస్ సీనియర్ నేతగా ఎంతో రాజకీయ అనుభవం ఉన్న దిగ్విజయ్ సింగ్ పోస్ట్ చేసిన ఓ ఫోటో వివాదానికి కేంద్ర బిందువుగా మారింది. దిగ్విజయ్ సింగ్ పోస్ట్ చేసిన ఫోటో మీద ఎంఐఎం పార్టీ అధినేత ఓవైసీ మండిపడుతున్నారు. తన సగం ముఖచిత్రాన్ని ఆరెస్సెస్ అధినేత మోహన్ భగవత్ సగం ముఖచిత్రంతో కలిపి కాంగ్రెస్ పార్టీ ప్రధాన కార్యదర్శి దిగ్విజయ్సింగ్ ట్విట్టర్లో పోస్ట్ చేయ డంపై ఎంఐఎం నేత అసదుద్దీన్ ఒవైసీ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. టోపీ ధరించి గడ్డంతో ఉన్న ఓ ముస్లింను ఆరెస్సెస్ నేత ఫొటోతో కలిపి ప్రదర్శించడం ముస్లిమ్లను అవమానించడమేనన్నారు.
దేశ సామాజిక నిర్మాణాన్ని ధ్వంసం చేస్తున్న ఇద్దరు మత మౌఢ్యులు అన్న వ్యాఖ్యతో దిగ్విజయ్సింగ్ ఆ ఫొటోను ట్విట్టర్లో పోస్ట్ చేశారు. దీనిపై ఒవైసీ స్పందిస్తూ తన ఫొటోకు ఎటువంటి ప్రాధాన్యం లేదని, కానీ ఆయన ఈ చర్యతో ముస్లింలను అవమానించారన్నారు. కాంగ్రెస్ పాలనలోనే అనేక మత కల్లోలాలు జరిగాయని గుర్తు చేశారు. బాబ్రీ మసీదును కూల్చివేసి, అందులో విగ్రహాలు పెట్టారని పేర్కొన్నారు. నరేంద్రమోదీని మీ పిల్లల వివాహాలకు ఆహ్వానిస్తారు కదా. ఆ ఫొటోలను ఎందుకు పోస్ట్ చేయరు? అని నిలదీశారు. మొత్తంగా ఒకే ఒక్క ఫోటోతో దిగ్విజయ్ సింగ్ విమర్శలు ఎదుర్కొంటున్నారు. అయితే దిగ్విజయ్ ఉద్దేశంలో ఒకే ఫోటో ద్వారా మతఛాందస వాదాన్ని చూపిద్దామని అనుకున్నారేమో కానీ బెడిసి కొట్టింది. అయితే కాంగ్రెస్ పార్టీకి చెందిన సీనియర్ నాయకుడు ఇలా చెయ్యడం ఏంటని కాంగ్రెస్ పార్టీలో చర్చసాగుతోందట.
*అభినవచారి*
(And get your daily news straight to your inbox)
Aug 22 | అమెరికా అందరికీ ఒక డ్రీమ్. మరీ ముఖ్యంగా ఇంజనీరింగ్ పూర్తి చేసిన మన దేశవాసులకు అందులోనూ తెలుగువారికి అగ్రరాజ్యంలోకి అడుగుపెట్టి.. అక్కడ ఉద్యోగం సంపాదించి, స్థిరపడాలన్నది చాలామంది అభిలాష. ఇప్పటికే ఈ ఆశలు ఉన్నవారు... Read more
Oct 08 | అసలే నవరాత్రి వేడుకలు.. అంతా ఉత్సాహంగా ఉన్నారు.. వీధి మధ్యలో గర్భా నృత్యం చేయడానికి ఏర్పాట్లు చేశారు. యువతులు, మహిళలతోపాటు పురుషులూ బాగా రెడీ అయి వచ్చేశారు. కానీ డ్యాన్స్ మొదలుపెట్టగానే కరెంటు పోయింది.... Read more
Oct 08 | తిరుమలలో భక్త జన సందోహం పెరిగింది. దసరా పండగ తరువాత పండగ సెలవులు ముగింపు దశకు చేరకుంటున్న తరుణంలో శ్రీవారి దర్శనం కోసం భక్తులో పోటెత్తారు. సెలవులతో కూడిన వారాంతం కావడంతో భక్తులు పెద్ద... Read more
Oct 08 | దేశవ్యాప్తంగా వాహనాల రిజిస్ట్రేషన్ కు ఒకటే సిరీస్ అయిన బీహెచ్ విషయంలో కేంద్ర రవాణా శాఖ నిబంధనలను సడలించనుంది. దేశవ్యాప్తంగా ప్రతీ రాష్ట్రానికి విడిగా ఒక రిజిస్ట్రేషన్ విధానం నడుస్తోంది. తెలంగాణ అయితే టీఎస్... Read more
Oct 07 | ప్రముఖ ప్రవచనకర్త గరికపాటి నరసింహరావు ఇటీవల మెగాస్టార్ చిరంజీవిపై చేసిన వ్యాఖ్యలు దుమారాన్ని రేపుతున్నాయి. మెగాఫాన్స్ మహాపండితుడు గరికపాటిపై నెట్టింట్లో ట్రోల్ చేస్తున్నారు. ఇక దీనికి మెగాబ్రదర్ నాగబాబు చేసిన ట్వీట్ కూడా తోడు... Read more