కాంగ్రెస్, బీజేపీ మధ్య మాటల తూటాలు పేలుతూనే ఉన్నాయి. దేశాభివృద్ధిని అడ్డుకుంటున్నారని మోడీ చేసిన విమర్శలకు రాహుల్ కౌంటరిచ్చారు. పార్లమెంట్ను ఆరెస్సెస్ బ్రాంచ్గా మారిస్తే చూస్తూ ఊరుకుంటామా అంటూ సెటైరేశారు. ప్రతిపక్షం గొంతు నొక్కుదామంటే కుదిరే పని కాదని యువరాజు అంటే..రాబర్ట్ వాద్రా భూబాగోతం మాటేంటంటూ కమలనాధులు రివర్స్ ఎటాక్ ఇచ్చారు. పార్లమెంట్ను స్తంభింపజేయడం ద్వారా కాంగ్రెస్ పార్టీ దేశాభివృద్ధిని అడ్డుకుంటోందన్న ప్రధాని నరేంద్ర మోడీ వ్యాఖ్యలపై రాహుల్ గాంధీ ఘాటుగా స్పందించారు. పార్లమెంట్ను ఆరెస్సెస్ శాఖగా నడపలేరన్న రాహుల్, ప్రతిపక్షం గొంతు నొక్కేయడం సాధ్యం కాదని స్పష్టం చేశారు. ముఖ్యమైన జీఎస్టీ, భూ సేకరణ సవరణ బిల్లులపై ప్రభుత్వం తమను ఎప్పు డు సంప్రదించిందని ఆయన ప్రశ్నించారు. గత సమావేశాల్లో లోక్సభలో ప్రతిపక్ష నేత మల్లి ఖార్జున ఖర్గేను కూడా నోరు మెదపకుండా చేశారని ఆరోపించారు.
ఎన్డీఏ ప్రభుత్వం ప్రతిపాదించిన జీఎస్టీ బిల్లుపై తమకు అభ్యంతరాలున్నాయన్న రాహుల్, తాము గరిష్టంగా 28 శాతం ట్యాక్స్ స్లాబ్ కోరుతున్నామని చెప్పారు. అసోం, అరుణాచల్ ప్రదేశ్, మణిపూర్ ముఖ్యమంత్రులకు తెలియకుండా ప్రధాని మోడీ ప్రభుత్వం నాగా ఒప్పందం కుదుర్చుకుందని ఆరోపించారు. ఉత్తుత్తి హామీలతో ప్రధాని మోడీ ప్రజలను మభ్యపెడుతున్నారని రాహుల్ ఆరోపించారు. అటు కాంగ్రెస్ వ్యాఖ్యలపై కేంద్ర ప్రభుత్వం మండిపడింది. రైతులు, భూ సేకరణ బిల్లు పేరుతో ప్రతిపక్ష కాంగ్రెస్ వ్యతిరేక రాజకీయాలు చేస్తోందని ధ్వజమెత్తింది. భూ సేకరణ బిల్లుపై కేంద్రాన్ని తప్పుపడుతున్న కాంగ్రెస్.. ఆ పార్టీ అధినేత్రి సోనియాగాంధీ అల్లుడు రాబర్ట్ వాద్రా వివాదాస్పద భూ ఒప్పందాలను గుర్తుచేసుకోవాలని ఎద్దేవా చేసింది. కాంగ్రెస్ హయాంలోనే ఎక్కువగా రైతుల భూములు సేకరించారన్నదే వాస్తవమని స్పష్టం చేసింది.
(And get your daily news straight to your inbox)
Aug 22 | అమెరికా అందరికీ ఒక డ్రీమ్. మరీ ముఖ్యంగా ఇంజనీరింగ్ పూర్తి చేసిన మన దేశవాసులకు అందులోనూ తెలుగువారికి అగ్రరాజ్యంలోకి అడుగుపెట్టి.. అక్కడ ఉద్యోగం సంపాదించి, స్థిరపడాలన్నది చాలామంది అభిలాష. ఇప్పటికే ఈ ఆశలు ఉన్నవారు... Read more
Oct 08 | అసలే నవరాత్రి వేడుకలు.. అంతా ఉత్సాహంగా ఉన్నారు.. వీధి మధ్యలో గర్భా నృత్యం చేయడానికి ఏర్పాట్లు చేశారు. యువతులు, మహిళలతోపాటు పురుషులూ బాగా రెడీ అయి వచ్చేశారు. కానీ డ్యాన్స్ మొదలుపెట్టగానే కరెంటు పోయింది.... Read more
Oct 08 | తిరుమలలో భక్త జన సందోహం పెరిగింది. దసరా పండగ తరువాత పండగ సెలవులు ముగింపు దశకు చేరకుంటున్న తరుణంలో శ్రీవారి దర్శనం కోసం భక్తులో పోటెత్తారు. సెలవులతో కూడిన వారాంతం కావడంతో భక్తులు పెద్ద... Read more
Oct 08 | దేశవ్యాప్తంగా వాహనాల రిజిస్ట్రేషన్ కు ఒకటే సిరీస్ అయిన బీహెచ్ విషయంలో కేంద్ర రవాణా శాఖ నిబంధనలను సడలించనుంది. దేశవ్యాప్తంగా ప్రతీ రాష్ట్రానికి విడిగా ఒక రిజిస్ట్రేషన్ విధానం నడుస్తోంది. తెలంగాణ అయితే టీఎస్... Read more
Oct 07 | ప్రముఖ ప్రవచనకర్త గరికపాటి నరసింహరావు ఇటీవల మెగాస్టార్ చిరంజీవిపై చేసిన వ్యాఖ్యలు దుమారాన్ని రేపుతున్నాయి. మెగాఫాన్స్ మహాపండితుడు గరికపాటిపై నెట్టింట్లో ట్రోల్ చేస్తున్నారు. ఇక దీనికి మెగాబ్రదర్ నాగబాబు చేసిన ట్వీట్ కూడా తోడు... Read more