Duronto Express accident

Two killed and 8 injured in train derailment in karnataka

Kalburgi, Karnataka, Mumbai-bound train, Martur station, Duronto Express

Two killed and 8 injured in train derailment in Karnataka At least two persons were killed and eight others injured when nine coaches of a Mumbai-bound train derailed near Kalburgi in Karnataka early on Saturday.

ITEMVIDEOS: పట్టాలు తప్పిన దురంతో ఎక్స్ ప్రెస్ రైలు

Posted: 09/12/2015 08:23 AM IST
Two killed and 8 injured in train derailment in karnataka

దురంతో ఎక్స్‌ప్రెస్ పట్టాలు తప్పింది. మొత్తం 4బోగీలు పల్టీలు కొట్టాయి. ఇద్దరు అక్కడికక్కడే చనిపోయారు. ఇంకా మృతుల సంఖ్య పెరిగే అవకాశం ఉంది. గాయపడ్డవారిని గుల్బర్గా ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. రాత్రి రెండున్నర గంటల ప్రాంతంలో ప్రమాదం జరిగింది. సమాచారం అందుకున్న జిల్లా కలెక్టర్, ఎస్పీ అమిత్‌సింగ్ వెంటనే సహాయక చర్యలు చేపట్టారు. బోగీల్లో ఇరుక్కున్న వారిని బయటకు తీసి...హుటాహుటిన గుల్బార్గా ఆసుపత్రికి తరలించారు. సికింద్రాబాద్‌ నుంచి కుర్లాకు రాత్రి 11గంటలకు దురంతో ఎక్స్‌ప్రెస్ బయలుదేరింది. గంటకు 110 కిలోమీటర్ల వేగంతో వెళ్తున్న దురంతో ఎక్స్‌ప్రెస్‌...వర్తూరు స్టేషన్‌ దగ్గరకు రాగానే పట్టాలు తప్పింది. దీంతో 9బోగీలు పల్టీలు కొట్టాయి. ఆసయమంలో ప్రయాణీకులంతా గాఢనిద్రలో ఉన్నారు. భారీ శబ్దంతో రావడంతో...ప్రయాణీకులంతా భయంతో వణికిపోయారు. ఏం జరిగిందో తెలుసుకునేలోపే బోగీలు చెల్లచెదురుగా పడిపోయాయి. ముంబై నుంచి చెన్నై మార్గంలోని రైళ్లన్నీ రద్దు చేశారు. ప్రమాదం ఎలా జరిగిందన్న దానిపై అధికారులు ఆరా తీస్తున్నారు.

 

రైలు ప్రమాదం మీద ఏర్పాటు చేసిన హెల్ప్ లైన్ నెంబర్లు...
సికింద్రాబాద్- 040- 27700868
హైదరాబాద్ - 040- 23200865
వికారాబాద్ - 08416-252103
తాండూరు- 08400- 272010

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Kalburgi  Karnataka  Mumbai-bound train  Martur station  Duronto Express  

Other Articles