అటు ఆంధ్రప్రదేశ్, ఇటు తెలంగాణ రాష్ట్రాల్ని వర్షాలు వణికిస్తున్నాయి. రెండు రాష్ట్రాల్లో జోరుగా భారీ వర్షాలు కురుస్తున్నాయి. దీంతో లోతట్టుప్రాంతాలు జలమయమయ్యాయి. బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడన ప్రభావంతో మరో రెండు రోజుల పాటు వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖాధికారులు చెబుతున్నారు. ఎన్నాళ్లుగానో ఎదురుచూస్తున్న వానలు ఇప్పుడిప్పుడే జోరుగా కురుస్తున్నాయి. అల్పపీడనం ప్రభావంతో రెండు రాష్ట్రాల్లోనూ విస్తారంగా వర్షాలు కురుస్తున్నాయి. ఎగువ రాష్ట్రాల్లో కురుస్తున్న వర్షాలకు ఇప్పటికే నదులు జలకళ సంతరించుకోగానే ఇక్కడ పడుతున్న వర్షాలకు చెరువులు, వాగులు నిండుతున్నాయి. హైదరాబాద్ లో వరుసగా నాలుగో రోజూ భారీ వర్షం పడడంతో లోతట్టుప్రాంతాలన్నీ జలమయమయ్యాయి. డ్రైనేజీలు, నాలాలు పొంగిపొర్లడంతో బస్తీవాసులు నిద్రాహారాలు మరచి ఎప్పుడే ఉపద్రవం ముంచుకొస్తుందోనని భయపడుతూ జీవిస్తున్నారు. నాలుగు రోజులుగా కురుస్తున్న వర్షాలకు భారీ పిడుగులు తోడవ్వడంతో పలువురు మృత్యువాత పడుతున్నారు.
గత నాలుగు రోజులుగా ఏపీ,తెలంగాణలో వానలు ముంచెత్తడంతో ప్రాజెక్టులు నిండుకుండలా మారుతున్నాయి. శ్రీశైలం, తుంగభద్ర జలాశయాల్లో నీటిమట్టం భారీగా పెరిగింది. శ్రీశైలం జలాశయం ఇన్ ఫ్లో 58,280 క్యూ సెక్కులుగా ఉంది. దీంతో ప్రస్తుతం జలాశయం నీటిమట్టం 813 అడుగులకు చేరింది. ఇక సుంకేశుల ప్రాజెక్టు వద్ద 8 గేట్లు ఎత్తి దిగువకు నీళ్లు విడుదల చేస్తున్నారు. ప్రస్తుతం ప్రాజెక్టుకు ఇన్ఫ్లో 40 వేల క్యుసెక్కులు ఉండగా అవుట్ఫ్లో 30వేల క్యుసెక్కులు ఉంది. మరోవైపు తుంగభద్ర జలాశయానికి ఇన్ ఫ్లో 11, 357 క్యుసెక్కులుగా ఉంది. ప్రస్తుతం తుంగభద్ర జలాశయం నీటిమట్టం 1625 అడుగులకు పెరిగింది. తుంగభద్ర జలాశయం పూర్తిస్తాయి నీటిమట్టం 73.58 టీఎంసీలు. జూరాలలో ప్రస్తుతం 318.35 మీటర్ల నీటిమట్టం ఉంది. ఇన్ఫ్లో 16,454 క్యుసెక్కులు ఉండగా అవుట్ ఫ్లో 20,750 క్యుసెక్కులుగా ఉంది. జూరాలలో మూడు యూనిట్ల ద్వారా విద్యుత్ ఉత్పత్తి చేస్తున్నారు. ఉరుములు మెరుపులు పిడుగులతో కూడిన భారీ వర్షాలు మరో రెండు రోజులు కొనసాగుతాయని వాతావరణ అధికారులు వెల్లడించారు. ఛత్తీస్గఢ్ నుంచి కోస్తాంధ్ర మీదుగా అల్పపీడన ద్రోణి కొనసాగుతోందని, ఇది అల్పపీడనంగా మారే అవకాశముందని స్పష్టంచేశారు. దీంతో ఉభయరాష్ట్రాల్లో మరో రెండు రోజులు భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది.
(And get your daily news straight to your inbox)
Aug 22 | అమెరికా అందరికీ ఒక డ్రీమ్. మరీ ముఖ్యంగా ఇంజనీరింగ్ పూర్తి చేసిన మన దేశవాసులకు అందులోనూ తెలుగువారికి అగ్రరాజ్యంలోకి అడుగుపెట్టి.. అక్కడ ఉద్యోగం సంపాదించి, స్థిరపడాలన్నది చాలామంది అభిలాష. ఇప్పటికే ఈ ఆశలు ఉన్నవారు... Read more
Oct 08 | అసలే నవరాత్రి వేడుకలు.. అంతా ఉత్సాహంగా ఉన్నారు.. వీధి మధ్యలో గర్భా నృత్యం చేయడానికి ఏర్పాట్లు చేశారు. యువతులు, మహిళలతోపాటు పురుషులూ బాగా రెడీ అయి వచ్చేశారు. కానీ డ్యాన్స్ మొదలుపెట్టగానే కరెంటు పోయింది.... Read more
Oct 08 | తిరుమలలో భక్త జన సందోహం పెరిగింది. దసరా పండగ తరువాత పండగ సెలవులు ముగింపు దశకు చేరకుంటున్న తరుణంలో శ్రీవారి దర్శనం కోసం భక్తులో పోటెత్తారు. సెలవులతో కూడిన వారాంతం కావడంతో భక్తులు పెద్ద... Read more
Oct 08 | దేశవ్యాప్తంగా వాహనాల రిజిస్ట్రేషన్ కు ఒకటే సిరీస్ అయిన బీహెచ్ విషయంలో కేంద్ర రవాణా శాఖ నిబంధనలను సడలించనుంది. దేశవ్యాప్తంగా ప్రతీ రాష్ట్రానికి విడిగా ఒక రిజిస్ట్రేషన్ విధానం నడుస్తోంది. తెలంగాణ అయితే టీఎస్... Read more
Oct 07 | ప్రముఖ ప్రవచనకర్త గరికపాటి నరసింహరావు ఇటీవల మెగాస్టార్ చిరంజీవిపై చేసిన వ్యాఖ్యలు దుమారాన్ని రేపుతున్నాయి. మెగాఫాన్స్ మహాపండితుడు గరికపాటిపై నెట్టింట్లో ట్రోల్ చేస్తున్నారు. ఇక దీనికి మెగాబ్రదర్ నాగబాబు చేసిన ట్వీట్ కూడా తోడు... Read more