మక్కా పవిత్ర హజ్ యాత్రలో పెను విషాదం చోటు చేసుకుంది. భక్తులు హజ్ క్రతువుల్లో ఉండగా.. భారీ క్రేన్ కూలింది. ఈ దుర్ఘటనలో107 మంది మరణించారు. 184మందికి తీవ్ర గాయాలయ్యాయి. క్రేన్ కూలి మసీదు పైకప్పుపై పడటంతో ఈ ప్రమాదం జరిగినట్టు సౌదీ ప్రభుత్వం వెల్లడించింది. సౌదీ అరేబియాలోని మక్కాలో హజ్ క్రతువుల్లో, అల్లాహ్ నామస్మరణలో భక్తులు లీనమై ఉన్నవేళ.. అంతటా భక్తి పారవశ్యం.. ఆథ్యాత్మిక పరిమళాల్లో ప్రార్ధనలు చేస్తున్న వేళ...సడెన్గా భారీ శబ్దం, ఘోర ప్రమాదం, పెను విషాదం.. భక్తుల హాహాకారాలు..ఎప్పటిలాగే, ఈ ఏడు కూడా పవిత్ర హజ్ యాత్రకు లక్షలాదిగా తరలివచ్చారు భక్తులు. ఎటు చూసినా భక్తజనం. అల్లాహ్ కీర్తనలు, పవిత్ర వాక్యాల పారాయణం.. నమాజులు, ప్రత్యేక ప్రార్ధనలు జరుగుతున్న సమయంలో.. పెను విషాదం చోటుచేసుకుంది.
ఏటా పెరుగుతున్న హజ్ యాత్రికుల్ని దృష్టిలో పెట్టుకొని మక్కా మసీదు విస్తరణ పనుల్ని చేపడుతోంది సౌదీ ప్రభుత్వం. 24 గంటలూ భారీ యంత్రాలు, మిషనరీతో పనులు జరుగుతున్నాయక్కడ. ప్రధాన మసీదు ఏరియాలో భారీ క్రేన్ల సహాయంతో నిర్మాణం సాగుతోంది. ఆ టైమ్లోనే ఓ జెయింట్ క్రేన్ ఒక్కసారిగా మసీదు పైకప్పుపై కూలిపడింది. ఆ పైకప్పుకింద ఉన్న భక్తులు మృత్యువాత పడ్డారు. దాదాపు నాలుగొందల మందికి తీవ్ర గాయాలయ్యాయి. ప్రమాదం జరిగిన వెంటనే.. సౌదీ అరేబియా సివిల్ డిఫెన్స్ టీమ్ రంగంలోకి దిగింది. మక్కాలో సహాయక చర్యలను వేగవంతం చేశారు అధికారులు. అంబులెన్స్ల ద్వారా క్షతగాత్రులను ఆస్పత్రులకు తరలించారు. ప్రమాదం జరిగిన ఏరియాను తమ అధీనంలోకి తీసుకున్నాయి బలగాలు. ఈ ప్రమాదంలో హజ్ యాత్రికులే అధికంగా ఉన్నట్టు తెలుస్తోంది. మృతిచెందిన వారి వివరాలు సేకరిస్తున్నారు అధికారులు. ఆయా దేశాల ప్రతినిధులు, రాయబారులు తమవాళ్ల యోగ క్షేమాలు తెలుసుకుంటున్నారు. ఇప్పటికే సౌదీలోని ఇండియన్ ఎంబసీకి చెందిన ఉన్నతాధికారులు సౌదీ అధికారులతో మాట్లాడుతున్నారు. మృతుల్లో భారత్కు చెందినవాళ్లెవరైనా ఉన్నారా?, గాయపడిన వాళ్లు ఎవరైనా ఉంటే వాళ్ల పరిస్థితెలా వుందో ఎప్పటికప్పుడు అడిగి తెలుసుకుంటున్నారు.
(And get your daily news straight to your inbox)
Aug 22 | అమెరికా అందరికీ ఒక డ్రీమ్. మరీ ముఖ్యంగా ఇంజనీరింగ్ పూర్తి చేసిన మన దేశవాసులకు అందులోనూ తెలుగువారికి అగ్రరాజ్యంలోకి అడుగుపెట్టి.. అక్కడ ఉద్యోగం సంపాదించి, స్థిరపడాలన్నది చాలామంది అభిలాష. ఇప్పటికే ఈ ఆశలు ఉన్నవారు... Read more
Oct 08 | అసలే నవరాత్రి వేడుకలు.. అంతా ఉత్సాహంగా ఉన్నారు.. వీధి మధ్యలో గర్భా నృత్యం చేయడానికి ఏర్పాట్లు చేశారు. యువతులు, మహిళలతోపాటు పురుషులూ బాగా రెడీ అయి వచ్చేశారు. కానీ డ్యాన్స్ మొదలుపెట్టగానే కరెంటు పోయింది.... Read more
Oct 08 | తిరుమలలో భక్త జన సందోహం పెరిగింది. దసరా పండగ తరువాత పండగ సెలవులు ముగింపు దశకు చేరకుంటున్న తరుణంలో శ్రీవారి దర్శనం కోసం భక్తులో పోటెత్తారు. సెలవులతో కూడిన వారాంతం కావడంతో భక్తులు పెద్ద... Read more
Oct 08 | దేశవ్యాప్తంగా వాహనాల రిజిస్ట్రేషన్ కు ఒకటే సిరీస్ అయిన బీహెచ్ విషయంలో కేంద్ర రవాణా శాఖ నిబంధనలను సడలించనుంది. దేశవ్యాప్తంగా ప్రతీ రాష్ట్రానికి విడిగా ఒక రిజిస్ట్రేషన్ విధానం నడుస్తోంది. తెలంగాణ అయితే టీఎస్... Read more
Oct 07 | ప్రముఖ ప్రవచనకర్త గరికపాటి నరసింహరావు ఇటీవల మెగాస్టార్ చిరంజీవిపై చేసిన వ్యాఖ్యలు దుమారాన్ని రేపుతున్నాయి. మెగాఫాన్స్ మహాపండితుడు గరికపాటిపై నెట్టింట్లో ట్రోల్ చేస్తున్నారు. ఇక దీనికి మెగాబ్రదర్ నాగబాబు చేసిన ట్వీట్ కూడా తోడు... Read more