సందట్లో సబేమియాలా జగన్.. వీలుదొరికితే చాలు జనాల్లోకి వెళ్లడానికి సిద్దంగా ఉన్నారు. ఓదార్పు యాత్రల పేరుతో ఇప్పటికే రాష్ట్రంలోని పలు ప్రాంతాల్లో పర్యటించిన జగన్.. వచ్చిన ఏ అవకాశాన్ని కూడా వదులుకోవడం లేదు. రైతుల ఆత్మహత్య, ప్రత్యేక హోదా కోసం ఎవరైనా ఆత్మహత్య చేసుకున్నా... ఏదైని చిన్న ఘటన పబ్లిక్ రిలేటెడ్ గా ఉంటే చాలు వెంటనే వాలిపోతున్నారు జగన్. మొత్తానికి జనాల్లో ఉండేందుకు జగన్ ఎప్పుడూ సిద్దంగానే ఉంటారు. అసెంబ్లీలో అధికార పక్షం మీద విమర్శలు గుప్పిస్తూ.. గట్టి పిండమే అనిపించుకున్న జగన్ తాజాగా మరో దీక్షకు దిగుతున్నారు. ఏపీలో వైసీపీని క్షేత్రస్థాయిలో బలోపేతం చేసేందుకు అధినేత జగన్ సన్నద్ధమవుతున్నారు. ఈ నెల 26 నుంచి ప్రత్యేకహోదా కోసం జగన్.. నిరవధిక నిరాహార దీక్ష చేపట్టనున్నారు.
వైసీపీని ప్రజల్లోకి తీసుకువెళ్లేందుకు పార్టీ అధినేత జగన్ కసరత్తు ప్రారంభించారు. అందులో భాగంగానే ఏపీలోని 13 జిల్లాల నేతలతో సమావేశం నిర్వహించాలని భావిస్తున్నట్లు తెలిసింది. రెండ్రోజులుగా లోటస్పాండ్లో జిల్లాల నేతలతో జగన్ సమావేశమయ్యారు. ప్రస్తుతం కొన్ని కమిటీల నియామకం మాత్రమే జరగడంతో పార్టీ చేపట్టే కార్యక్రమాలన్నీ గ్రామీణ స్థాయికి చేరడం లేదనే అపవాదు ఉంది. ఎన్నికలు ముగిసి ఏడాదిన్నర గడిచినా... పార్టీ కమిటీలను పూర్తి స్థాయిలో నియమించకపోవడంపై ఆగ్రహం వ్యక్తం చేసిన జగన్... 15 రోజుల్లో నియమించాలని ఆదేశించారు.
టీడీపీ అధికారం చేపట్టి ఏడాదిన్నర దాటినా ఎన్నికల్లో ఇచ్చిన హమీలను ఒక్కటి కూడా నెరవేర్చలేదన్న విషయాల్ని జనాల్లోకి తీసుకెళ్లాలని నేతలకు దిశానిర్దేశం చేశారు జగన్. ఏకపక్ష నిర్ణయాలు కాకుండా పార్టీ ముఖ్యనేతల సలహాలు, సూచనల్ని కూడా తెలుసుకుంటున్నారు. క్షేత్రస్థాయిలో కార్యకర్తల్లో ఉత్సాహం నింపేందుకు ప్రణాళికలు కూడా సిద్ధం చేసుకునట్లు పార్టీ వర్గాలు తెలిపాయి. ఏపీకి ప్రత్యేక హోదా కోసం ఈ నెల 26న చేపడుతున్న నిరవధిక నిరాహార దీక్షకు దిగుతున్న జగన్... ప్రభుత్వం ఇచ్చిన హామీలను నెరవేర్చలేదనే విషయాన్ని ఎండగడతామంటున్నారు.
(And get your daily news straight to your inbox)
Aug 22 | అమెరికా అందరికీ ఒక డ్రీమ్. మరీ ముఖ్యంగా ఇంజనీరింగ్ పూర్తి చేసిన మన దేశవాసులకు అందులోనూ తెలుగువారికి అగ్రరాజ్యంలోకి అడుగుపెట్టి.. అక్కడ ఉద్యోగం సంపాదించి, స్థిరపడాలన్నది చాలామంది అభిలాష. ఇప్పటికే ఈ ఆశలు ఉన్నవారు... Read more
Oct 08 | అసలే నవరాత్రి వేడుకలు.. అంతా ఉత్సాహంగా ఉన్నారు.. వీధి మధ్యలో గర్భా నృత్యం చేయడానికి ఏర్పాట్లు చేశారు. యువతులు, మహిళలతోపాటు పురుషులూ బాగా రెడీ అయి వచ్చేశారు. కానీ డ్యాన్స్ మొదలుపెట్టగానే కరెంటు పోయింది.... Read more
Oct 08 | తిరుమలలో భక్త జన సందోహం పెరిగింది. దసరా పండగ తరువాత పండగ సెలవులు ముగింపు దశకు చేరకుంటున్న తరుణంలో శ్రీవారి దర్శనం కోసం భక్తులో పోటెత్తారు. సెలవులతో కూడిన వారాంతం కావడంతో భక్తులు పెద్ద... Read more
Oct 08 | దేశవ్యాప్తంగా వాహనాల రిజిస్ట్రేషన్ కు ఒకటే సిరీస్ అయిన బీహెచ్ విషయంలో కేంద్ర రవాణా శాఖ నిబంధనలను సడలించనుంది. దేశవ్యాప్తంగా ప్రతీ రాష్ట్రానికి విడిగా ఒక రిజిస్ట్రేషన్ విధానం నడుస్తోంది. తెలంగాణ అయితే టీఎస్... Read more
Oct 07 | ప్రముఖ ప్రవచనకర్త గరికపాటి నరసింహరావు ఇటీవల మెగాస్టార్ చిరంజీవిపై చేసిన వ్యాఖ్యలు దుమారాన్ని రేపుతున్నాయి. మెగాఫాన్స్ మహాపండితుడు గరికపాటిపై నెట్టింట్లో ట్రోల్ చేస్తున్నారు. ఇక దీనికి మెగాబ్రదర్ నాగబాబు చేసిన ట్వీట్ కూడా తోడు... Read more