The Kidnap Mysteries Of TRS Leader Agiri Venkatesh And Teacher Ramakrishna Reddy Creates Sensation | Telugu States Problem

Trs leader agiri venkatesh teacher ramakrishna reddy kidnap mysteries

trs leader venkatesh kidnap, teacher ramakrishna kidnap, hyderabad kidnap mysteries, nellore teacher kidnap mystery, telugu states kidnap, trs leader kidnap mystery, trs venkatesh kidnap news, teacher ramakrishna kidnap news

TRS Leader Agiri Venkatesh Teacher Ramakrishna Reddy Kidnap Mysteries : The Kidnap Mysteries Of TRS Leader Agiri Venkatesh And Teacher Ramakrishna Reddy Creates Sensation In Telugu States.

ఇక్కడ టీఆర్ఎస్ నేత.. అక్కడ టీచర్..

Posted: 09/10/2015 02:54 PM IST
Trs leader agiri venkatesh teacher ramakrishna reddy kidnap mysteries

కాలానుకూలంగా వాతావరణంలో వచ్చే మార్పుల్లాగా.. రెండు తెలుగు రాష్ట్రాల్లో కొన్ని సంఘటనలు చోటు చేసుకుంటున్నాయి. ఉభయ గోదావరి జిల్లాల్లో ‘సూది’గాడు జనాలతోపాటు పోలీసులను ముచ్చెమటలు పట్టిస్తే.. ఇప్పుడు తాజాగా కిడ్నాప్ మిస్టరీలు భయాందోళనకు గురి చేస్తున్నాయి. అందులోనూ హైదరాబాద్ కు చెందిన టీఆర్ఎస్ నేత కిడ్నాప్ కు గురి కావడం సంచలనం సృష్టిస్తోంది. ఇక నెల్లూరు జిల్లాలో బుధవారం సాయంత్రం ఓ ఉపాధ్యాయుడు అపహరణకు గురికావడంతో అక్కడ కలకలం రేపుతోంది. ఇప్పుడు తెలుగు రాష్ట్రాల్లో ఈ కిడ్నాప్ మిస్టరీల చర్చే కొనసాగుతోంది.

గతంలో టీఆర్ఎస్ తరఫున ముషీరాబాద్ నియోజకవర్గ ఇన్ ఛార్జీగా వ్యవహరించిన ప్రముఖ వ్యాపారి ఆగిరి వెంకటేశ్ మూడు రోజులుగా కనిపించడం లేదు. ఇదివరకే వాసవి క్లబ్ అధ్యక్షుడిగానూ వ్యవహరించిన ఈయన.. ప్రస్తుతం ఫైనాన్స్ రియల్ ఎస్టేట్ వ్యాపారాలు నిర్వహిస్తున్నారు. మూడు రోజుల క్రితం ఇంటినుంచి బయటకు వెళ్లిన ఈయన.. మళ్లీ తిరిగి ఇంటికి రాలేదు. దీంతో ఆందోళనకు గురైన ఆయన కుటుంబసభ్యులు.. పోలీసులకు ఫిర్యాదు చేశారు. రంగంలోకి దిగిన పోలీసులు.. దర్యాప్తు ప్రారంభించారు కానీ ఇంతవరకు ఏ ఒక్క ఆధారాన్ని సంపాదించలేకపోయారు. ఈ నేపథ్యంలో ఆయన ఆచూకీ కోసం నగరంలోని అన్ని పోలీస్ స్టేషన్లకు లుకౌట్ నోటీసులు జారీ అయ్యాయి. వెంకటేశ్ కిడ్నాప్ కావడం వెనుక అసలు కారణాలేంటి? ఎవరు కిడ్నాప్ చేశారు? ఇంతకీ మిస్టరీ ఏంటి? వంటి విషయాలపై పోలీసులు దర్యాప్తు వేగవంతం చేశారు.

ఇదిలావుండగా.. అటు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని నెల్లూరు జిల్లాలో బుధవారం సాయంత్రం ఓ ఉపాధ్యాయుడు కిడ్నాప్ కు గురికావడం తీవ్ర కలకం సృష్టిస్తోంది. రామకృష్ణారెడ్డి అనే ఉపాధ్యాయుడు బుధవారం సాయంత్రం తన విధులు ముగించుకుని ఇంటికి వెళుతున్న క్రమంలో.. గుర్తు తెలియని వ్యక్తులో కారులో వచ్చి కిడ్నాప్ చేశారు. అపహరణ అనంతరం దుండగులు అతడి కుటుంబసభ్యులకు ఫోన్ చేసి రూ.20 లక్షలు డిమాండ్ చేశారట. ‘నిర్దేశించిన సొమ్మను రెడీ చేసుకోండి.. మళ్లీ ఫోన్ చేస్తాం’ అంటూ దుండుగులు చెప్పడంతో.. ఆందోళనకు గురైన ఆయన కుటుంబసభ్యులు పోలీసులను ఆశ్రయించారు. దీంతో రంగంలోకి దిగిన పోలీసులు.. కిడ్నార్ల కోసం గాలిస్తున్నారు. ఈ కిడ్నాప్ వెనుక ఎవరో తెలిసిన వ్యక్తి హస్త వుంటుందని పోలీసులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు.

AS

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : trs leader venkatesh kidnap  telugu states kidnap mysteries  

Other Articles