తెలంగాణ మంత్రి హరీష్ రావుకు, తెలంగాణ ముఖ్యమంత్రికి కేసీఆర్ కు ఉన్న రిలేషన్ గురించి అందరికి తెలుసు. కేసీఆర్ కు హరీష్ రావు స్వయానా మేనల్లుడే.. అందుకే ముందు నుండి కూడా పార్టీలో ఎంతో కీలకంగా మారారు హరీష్. కేసీఆర్ అండతో. తన వాక్చాతుర్యంతో టిఆర్ఎస్ లో తిరుగులేని నేతగా ఎదిగారు హరీష్ రావు. అయితే కేసీఆర్ కు హరీష్ రావు మీద కంప్లేంట్ చేస్తానని యాదగిరి గుట్ట ఈవో.. గుర్రుగా ఉన్నారు. యాదగిరిగుట్ట మీద కేసీఆర్ కు ప్రత్యేక శ్రద్ద ఉంది. అక్కడి నరసింహ స్వామి ఆలయాన్ని పూర్తి స్థాయిలో మార్చివెయ్యాలని కేసీఆర్ సంకల్పించారు. అయితే యాదగిరిగుట్ట నరసింహస్వామి దేవాలయానికి ఈవోగా పని చేస్తున్న మహిళా ఉద్యోగి మాత్రం హరీష్ తీరు మీద అసహనంగా ఉన్నారట అందుకే ముఖ్యమంత్రి కేసీఆర్ కు డైరెక్ట్ గా పిర్యాదు చేస్తానని అంటున్నారు.
youtube}=Z4iNZCmRWBM|620|400|1{/youtube}
యాదగిరిగుట్టలో హరీష్ రావు టిఆర్ఎస్ పార్టీ శ్రేణులతో కలిసి ర్యాలీ నిర్వహించారు. అయితే హరీష్ రావు అనుచరులు, టిఆర్ఎస్ నాయకులు భారీగా రావడం.. పెద్ద ఎత్తున బైక్ ర్యాలీ నిర్వహించడం జరిగింది. కానీ యాదగిరిగుట్ట పుణ్యక్షేత్రం కావడం.. భక్తుల సంఖ్య ముందు కన్నా పెరుగుతుండటంతో వచ్చిన భక్తులకు ఇబ్బంది కలిగింది. దీని మీదే ఆలయ ఈవో ఆగ్రహం వ్యక్తం చేశారు. హరీష్ రావు ఇలా చెయ్యడంతో భక్తులకు ఇబ్బంది కలిగిందని.. అందుకే తాను స్వయంగా ముఖ్యమంత్రి కేసీఆర్ కే పిర్యాదు చేస్తానని అంది. అయితే విషయం తెలుసుకున్న స్థానిక ఎమ్మెల్యే ఈవో మీద మండిపడ్డారు. హరీష్ రావ్ ప్రజా నాయకులు కాబట్టి జనం అలానే వస్తారు అంటూ ఈవో మీద మండిపడ్డారు. మొత్తానికి ఈవోను ప్రస్తుతానికి నయానోభయానో ఒప్పించినా కేసీఆర్ వచ్చిన తర్వాత ఆమె ఫిర్యాదు చేస్తుందో లేదో చూడాలి.
*అభినవచారి*
(And get your daily news straight to your inbox)
Aug 22 | అమెరికా అందరికీ ఒక డ్రీమ్. మరీ ముఖ్యంగా ఇంజనీరింగ్ పూర్తి చేసిన మన దేశవాసులకు అందులోనూ తెలుగువారికి అగ్రరాజ్యంలోకి అడుగుపెట్టి.. అక్కడ ఉద్యోగం సంపాదించి, స్థిరపడాలన్నది చాలామంది అభిలాష. ఇప్పటికే ఈ ఆశలు ఉన్నవారు... Read more
Oct 08 | అసలే నవరాత్రి వేడుకలు.. అంతా ఉత్సాహంగా ఉన్నారు.. వీధి మధ్యలో గర్భా నృత్యం చేయడానికి ఏర్పాట్లు చేశారు. యువతులు, మహిళలతోపాటు పురుషులూ బాగా రెడీ అయి వచ్చేశారు. కానీ డ్యాన్స్ మొదలుపెట్టగానే కరెంటు పోయింది.... Read more
Oct 08 | తిరుమలలో భక్త జన సందోహం పెరిగింది. దసరా పండగ తరువాత పండగ సెలవులు ముగింపు దశకు చేరకుంటున్న తరుణంలో శ్రీవారి దర్శనం కోసం భక్తులో పోటెత్తారు. సెలవులతో కూడిన వారాంతం కావడంతో భక్తులు పెద్ద... Read more
Oct 08 | దేశవ్యాప్తంగా వాహనాల రిజిస్ట్రేషన్ కు ఒకటే సిరీస్ అయిన బీహెచ్ విషయంలో కేంద్ర రవాణా శాఖ నిబంధనలను సడలించనుంది. దేశవ్యాప్తంగా ప్రతీ రాష్ట్రానికి విడిగా ఒక రిజిస్ట్రేషన్ విధానం నడుస్తోంది. తెలంగాణ అయితే టీఎస్... Read more
Oct 07 | ప్రముఖ ప్రవచనకర్త గరికపాటి నరసింహరావు ఇటీవల మెగాస్టార్ చిరంజీవిపై చేసిన వ్యాఖ్యలు దుమారాన్ని రేపుతున్నాయి. మెగాఫాన్స్ మహాపండితుడు గరికపాటిపై నెట్టింట్లో ట్రోల్ చేస్తున్నారు. ఇక దీనికి మెగాబ్రదర్ నాగబాబు చేసిన ట్వీట్ కూడా తోడు... Read more