కడప జిల్లాలోని నారాయణ కాలేజీలో ఇద్దరు విద్యార్థినులు ఆత్మహత్య చేసుకున్న ఘటన స్థానికంగా కలకలం రేపింది. ఈ విద్యార్థినుల ఘటనపై జ్యుడీషియల్ విచారణ జరిపించాలని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు, ఆంధ్రప్రదేశ్ ప్రతిపక్ష నాయకుడు వైఎస్ జగన్ మోహన్ రెడ్డి డిమాండ్ చేశారు. విద్యార్థినుల కుటుంబాలకు న్యాయం చేయాలన్న డిమాండ్ తో బుధవారం కడప నగరం బంద్ కు పిలుపునిచ్చారు. విద్యార్థినుల మృతదేహాలకు హైదరాబాద్ లో రీపోస్టుమార్టం నిర్వహించాల డిమాండ్ చేశారు. కడప రిమ్స్ ఆస్పత్రి వద్ద విద్యార్థినుల తల్లిదండ్రులను మంగళవారం వైఎస్ జగన్ పరామర్శించారు. ఈ సందర్భంగా విలేకరులతో ఆయన మాట్లాడారు.
సీఎం చంద్రబాబు మంత్రి నారాయణను తన మంత్రివర్గం నుంచి బర్తరఫ్ చేసి.. ఈ ఘటనపై విచారణ జరిపించాలన్నారు. రాష్ట్రవ్యాప్తంగా 15 మాసాల్లో నారాయణ కాలేజీల్లో 11 మంది విద్యార్థులు మృతి చెందారని వారిలో 9 మంది అమ్మాయిలు, ఇద్దరు అబ్బాయిలని.. జగన్ అరోపించారు. ఇంత మంది మరణాలకు కారణమైన నారాయణ కాళాశాల డైరెక్టర్ మంత్రి నారాయణకు తక్షణం అరెస్టు చేయాలని జగన్ డిమాండ్ చేశారు. ఇంత మంది విద్యార్థులు చనిపోతున్నారంటే.. ఇది జూనియర్ కాలేజీయా..? లేక ఆత్మహత్యలను ప్రేరేపించే కాలేజీయా..? అని ఆయన తీవ్రస్థాయిలో నిలదీశారు.
ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు జిల్లాలో పర్యటిస్తున్న సమయంలోనే ఈ ఘటన చోటుచేసుకుందని, అయినా ఆయన కనీసం విద్యార్థుల తల్లిదండ్రులను పరామర్శించలేదని అన్నారు. చనిపోయిన పిల్లల ఆత్మహత్యలను కూడా తమకు సంబంధం లేదన్నట్లుగా చేసే విధంగా కాలేజ్ యాజమాన్యం ప్రయత్నిస్తుందని, టెన్త్ పాస్ అయ్యి మూడు నెలలు కూడా కానీ విద్యార్థులు మరణాలకు ప్రేమ వ్యవహారమే కారణమంటూ కొత్తగా లవ్ లెటర్ సృష్టించారని, విద్యార్థినుుల రాయని లేఖలను చూపిస్తున్నారని, అభంశుభం తెలియని పిల్లలపై అభాండాలు వేయడం ఎంతవరకు సమంజసని జగన్ ప్రశ్నించారు. విద్యార్థుల కుటుంబాలకు న్యాయం చేయాలన్న డిమాండ్ తో రేపు జిల్లా బంద్ కు జగన్ పిలుపునిచ్చారు
జి.మనోహర్
(And get your daily news straight to your inbox)
Aug 22 | అమెరికా అందరికీ ఒక డ్రీమ్. మరీ ముఖ్యంగా ఇంజనీరింగ్ పూర్తి చేసిన మన దేశవాసులకు అందులోనూ తెలుగువారికి అగ్రరాజ్యంలోకి అడుగుపెట్టి.. అక్కడ ఉద్యోగం సంపాదించి, స్థిరపడాలన్నది చాలామంది అభిలాష. ఇప్పటికే ఈ ఆశలు ఉన్నవారు... Read more
Oct 08 | అసలే నవరాత్రి వేడుకలు.. అంతా ఉత్సాహంగా ఉన్నారు.. వీధి మధ్యలో గర్భా నృత్యం చేయడానికి ఏర్పాట్లు చేశారు. యువతులు, మహిళలతోపాటు పురుషులూ బాగా రెడీ అయి వచ్చేశారు. కానీ డ్యాన్స్ మొదలుపెట్టగానే కరెంటు పోయింది.... Read more
Oct 08 | తిరుమలలో భక్త జన సందోహం పెరిగింది. దసరా పండగ తరువాత పండగ సెలవులు ముగింపు దశకు చేరకుంటున్న తరుణంలో శ్రీవారి దర్శనం కోసం భక్తులో పోటెత్తారు. సెలవులతో కూడిన వారాంతం కావడంతో భక్తులు పెద్ద... Read more
Oct 08 | దేశవ్యాప్తంగా వాహనాల రిజిస్ట్రేషన్ కు ఒకటే సిరీస్ అయిన బీహెచ్ విషయంలో కేంద్ర రవాణా శాఖ నిబంధనలను సడలించనుంది. దేశవ్యాప్తంగా ప్రతీ రాష్ట్రానికి విడిగా ఒక రిజిస్ట్రేషన్ విధానం నడుస్తోంది. తెలంగాణ అయితే టీఎస్... Read more
Oct 07 | ప్రముఖ ప్రవచనకర్త గరికపాటి నరసింహరావు ఇటీవల మెగాస్టార్ చిరంజీవిపై చేసిన వ్యాఖ్యలు దుమారాన్ని రేపుతున్నాయి. మెగాఫాన్స్ మహాపండితుడు గరికపాటిపై నెట్టింట్లో ట్రోల్ చేస్తున్నారు. ఇక దీనికి మెగాబ్రదర్ నాగబాబు చేసిన ట్వీట్ కూడా తోడు... Read more