ragging causes another lady student suicide in guntur

Ragging claims another life in guntur district

Ragging claims another life in Guntur district, Ragging, vatti cherukuru, Guntur, jump from fifth floor, video shot, crime against women, Rishiteshwari, Malineni College of Engineering, suspicious death

Even before the dust in Rishiteshwari case settled, another ragging-related death shocked Guntur. While Rishiteshwari was a victim of ragging, the latest incident involves a girl ended her life after she tried to expose ragging in her college.

మరో ఇంజనీరింగ్ విద్యార్థిని అనుమానాస్పద మృతి.. గుంటూరులో కలకలం..

Posted: 08/05/2015 11:19 PM IST
Ragging claims another life in guntur district

నాగార్జున యూనివర్సిటీలో ర్యాగింగ్‌కు గురైన ఆత్మహత్యకు పాల్పడిన బీ ఆర్కిటెక్చర్ మొదటి సంవత్సరం విద్యార్థిని రిషితేశ్వరి ఘటన ఇప్పటికే రాష్ట్రంలో కలకలం రేపుతుంటే.. అందుకు భిన్నంగా ర్యాంగింగ్‌కు పాల్పడినట్లు వచ్చిన ఆరోపణలతో మరో విద్యార్థిని ఆత్మహత్య చేసుకున్న ఘటన ఇప్పుడు సంచలనం సృష్టిస్తోంది. పుల్లడిగుంటలోని ఓ ఇంజినీరింగ్‌ కాలేజీలో ఈ విషాదం జరిగింది. బీటెక్‌ ఫైనల్‌ ఇయర్‌ చదువుతున్న సునీత అనే విద్యార్థిని కాలేజీ భవనం పైనుంచి దూకడంతో అక్కడికక్కడే మరణించింది.

అయితే ఆ యువతి ఆత్మహత్యకు గల కారణాలను విశ్లేషించగా.. సునీత తన ఫ్రెండ్‌తో కలిసి ర్యాగింగ్‌కు పాల్పడటంతో మరోసారి ఇలా చేస్తే టీసీ ఇస్తామని ప్రిన్సిపాల్ మందలించారని తెలిసింది. అందుకు భయపడిన సునీత ఆత్మహత్యకు పాల్పడినట్టు సమాచారం. సునీత సొంత ఊరు ప్రకాశం జిల్లా చందలూరు గ్రామమని పోలీసులు తెలిపారు. సునీత మృతదేహాన్ని పోస్ట్ మార్టం కోసం జీజీహెచ్‌కు తరలించారు. ఇదిలా ఉంటే సునీత తల్లిదండ్రులు ఈ ఆరోపణల్ని తోసిపుచ్చారు. కాలేజీలో జరిగిన సెల్ ఫోన్ దొంగతనం విషయంలో తమ కుమార్తెపై నిందలు మోపారని, ఆ అవమానభారంతోనే సునీత ఆత్మహత్య చేసుకుందని వారన్నారు. బంధువులతో కలసి మూకుమ్మడిగా చేరకున్న సునితీ తల్లిదండ్రులు కాలేజీని ద్వంసం చేసేందుకు యత్నించారు.

జి. మనోహర్

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Ragging  Malineni College of Engineering  guntur  suspicious death  

Other Articles