మాజీ రాష్ట్రపతి అబ్దుల్ కలాం గొప్ప మార్గదర్శకుడు అని ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ అన్నారు. కలాం మృతి పట్ల మోదీ తీవ్ర విచారం వ్యక్తం చేశారు. కలాం గొప్ప మేధావి అని....ఆయన్నుంచి ఎంతో నేర్చుకున్నానని తెలిపారు. రాష్ట్రపతి భవన్కు ప్రజలను చేరువ చేసేందుకు కలాం ఎంతో కృషి చేశారని కొనియాడారు. భారత దేశం శాస్త్రసాంకేతిక రంగాల్లో ముందుకు దూసుకుపోతూ, ప్రపంచ దేశాలకు పోటీనివ్వడంతో కలాం కృషి ఎంతో వుందన్నారు. కలాం చివరిక్షణం వరకు విద్యార్థులతోనే గడిపారని ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ అన్నారు.
కాంగ్రెస్ ఉపాధ్యక్షుడు రాహుల్ గాంధీ కాలం మృతి పట్ల తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. కలాం మరణం తనను తీవ్ర దిగ్ర్భాంతికి గురిచేసిందని చెప్పారు. ఆయన రాష్ట్రపతి పదవిని చేపట్టి.. దేశ ప్రజల హృదయాలను చూరగోన్నారని రాహుల్ అన్నారు. తన యుక్త అలోచనలతో యువతను నిరంతరం కలలు కనండి.. వాటిని సాకారం చేసుకునేందుకు శ్రమించండీ అంటూ పిలుపునిచ్చిన కలాం తన వివేకంతో భారత జాతీ యువత మనస్సును గెలుచుకున్నారని పేర్కోన్నారు. కలాం విజన్ను, ఆయన ఆలోచనలను కోల్పోయామని రాహుల్ ఆవేదన వ్యక్తం చేశారు.
చివరి క్షణం వరకు దేశం కోసం పనిచేసిన మహోన్నత వ్యక్తి అబ్దుల్ కలాం అని రాహుల్ అన్నారు. యువతలో ఆలోచనలను తట్టిలేపిన గొప్ప వ్యక్తి కలాం అని చెప్పారు. రాష్ట్రపతిగా దేశానికి ఆయన అందించిన సేవలు మరువలేనివని అన్నారు. దేశం మొత్తం ఆయన ఆలోచనలను ఆదర్శంగా తీసుకోవాలని ఆయన చెప్పారు. దేశం ఫోక్రాన్ పరీక్షలో అబ్దుల్ కలాం పాత్ర కీలకమని రాహుల్ చెప్పుకోచ్చారు. యువత కలాం ఆశయాలను సాధించడానికి నిత్యం కృషి చేయాలని ఆయన పిలుపునిచ్చారు.
భరతమాత ముద్దు బిడ్డ, దేశానికే గర్వకారణంగా జీవించిన వ్యక్తి మాజీ రాష్ట్రపతి ఏపీజే అబ్దుల్ కలాం మరణం దిగ్ర్భాంతికి గురిచేసిందని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు ఆవేదన వ్యక్తం చేశారు. దేశం గొప్పశాస్త్రవేత్తను, మేధావిని....శాస్త్రసాంకేతిక రంగం పెద్ద దిక్కును కోల్పోయిందన్నారు. తనతో ఎంతో సన్నిహితంగా ఉన్న వ్యక్తిని కోల్పోవడం బాధాకరమని చంద్రబాబు అన్నారు. కలాం జీవితం ప్రజలందరికీ ఓ ఆదర్శమని తెలిపారు. భారతదేశ కీర్తి ప్రతిష్టతలను ప్రపంచం మొత్తం చాటి చెప్పిన వ్యక్తి అబ్దుల్ కలాం అని కొనియాడారు.
నిరంతర కృషి, పట్టుదలతో పనిచేయడమే కలాంను ఉన్నతశిఖరాల్లోకి చేర్చిందన్నారు. ఇస్రోలో పనిచేయడం పెద్ద విజయమని కలాం ఎప్పుడూ చెబుతుండే వారని గుర్తుచేశారు. కలాంను భారత రాష్ట్రపతిగా చేయడంలో తాను కూడా భాగాస్వామి అవడం అదృష్టంగా భావిస్తున్నానన్నారు. అలిపిరిలో తనపై దాడి జరిగిన సమయంలో ప్రోటోకాల్ను సైతం పక్కనపెట్టి పరామర్శించారని గుర్తుచేసుకున్నారు. కలాం 75వ జన్మదినోత్సవాన్ని విద్యార్థుల దినోత్సవంగా ఐక్యరాజ్యసమతి ప్రకటించిందన్నారు. అబ్దుల్ కలాంను యువత ఆదర్శంగా తీసుకోవాలని పిలుపునిచ్చారు. తను చనిపోతే సెలవు ఇవ్వొద్దని...అవసరమైతే మరోరోజు అదనంగా పనిచేయాలని చెప్పిన మహోన్నత వ్యక్తి కలాం అని చంద్రబాబు కొనియాడారు.
జి మనోహర్
(And get your daily news straight to your inbox)
Aug 22 | అమెరికా అందరికీ ఒక డ్రీమ్. మరీ ముఖ్యంగా ఇంజనీరింగ్ పూర్తి చేసిన మన దేశవాసులకు అందులోనూ తెలుగువారికి అగ్రరాజ్యంలోకి అడుగుపెట్టి.. అక్కడ ఉద్యోగం సంపాదించి, స్థిరపడాలన్నది చాలామంది అభిలాష. ఇప్పటికే ఈ ఆశలు ఉన్నవారు... Read more
Oct 08 | అసలే నవరాత్రి వేడుకలు.. అంతా ఉత్సాహంగా ఉన్నారు.. వీధి మధ్యలో గర్భా నృత్యం చేయడానికి ఏర్పాట్లు చేశారు. యువతులు, మహిళలతోపాటు పురుషులూ బాగా రెడీ అయి వచ్చేశారు. కానీ డ్యాన్స్ మొదలుపెట్టగానే కరెంటు పోయింది.... Read more
Oct 08 | తిరుమలలో భక్త జన సందోహం పెరిగింది. దసరా పండగ తరువాత పండగ సెలవులు ముగింపు దశకు చేరకుంటున్న తరుణంలో శ్రీవారి దర్శనం కోసం భక్తులో పోటెత్తారు. సెలవులతో కూడిన వారాంతం కావడంతో భక్తులు పెద్ద... Read more
Oct 08 | దేశవ్యాప్తంగా వాహనాల రిజిస్ట్రేషన్ కు ఒకటే సిరీస్ అయిన బీహెచ్ విషయంలో కేంద్ర రవాణా శాఖ నిబంధనలను సడలించనుంది. దేశవ్యాప్తంగా ప్రతీ రాష్ట్రానికి విడిగా ఒక రిజిస్ట్రేషన్ విధానం నడుస్తోంది. తెలంగాణ అయితే టీఎస్... Read more
Oct 07 | ప్రముఖ ప్రవచనకర్త గరికపాటి నరసింహరావు ఇటీవల మెగాస్టార్ చిరంజీవిపై చేసిన వ్యాఖ్యలు దుమారాన్ని రేపుతున్నాయి. మెగాఫాన్స్ మహాపండితుడు గరికపాటిపై నెట్టింట్లో ట్రోల్ చేస్తున్నారు. ఇక దీనికి మెగాబ్రదర్ నాగబాబు చేసిన ట్వీట్ కూడా తోడు... Read more