ప్రధాని నరేంద్రమోడీ బాహార్ ఎన్నికల ప్రచారానికి సమరశంఖం పూరించి.. తమకు ఒక్క సారి అవకాశమివ్వాలని బిహార్ రూపురేఖలను మారుస్తామని అభ్యర్థించిన మరుసటి రోజునే బిజేపి బీహార్ శ్రేణులకు షాక్ తగిలింది. ప్రధాని ప్రచారంతో ముందుకు సాగుదామనుకున్న పార్టీ శ్రేణులకు తమ పార్టీకి చెందిన నేత , పార్లమెంటు సభ్యుడైన శతృఘ్నసిన్హా నుంచి గట్టి ఎదురుదెబ్బను ఎదుర్కోన్నారు. ప్రధాని మోడీ నిన్న పార్టీ శ్రేణులల్లో కల్పించిన నూతన జవసత్వాలు ఇవాళ నీరుగారేలా చేశారు శతృఘ్నసిన్హా. అదేలా అంటారా..? ఇవాళ బీహార్ ముఖ్యమంత్రి నితీశ్కుమార్కు కలసిన ఆయన నితీష్ కుమార్ పై ప్రశంసల జల్లు కురిపించారు.
దేశంలోనే నితీశ్ కన్నా బెస్ట్ సిఎం ఎవ్వరూ లేరని కితాబునిచ్చారు. అంతేకాదు బిహార్ రాష్ట్రానికి నితిష్ గోప్ప సంరక్షకుడని కోనియాడారు. నితిశ్ కన్నా బిహార్ రాష్ట్రాన్ని ఎవ్వరూ అభివృద్ధిపథంలో తీసుకువెళ్లలేరని ప్రశంసిచ్చారు. బిహార్ సీఎం నితీశ్ కుమార్ ను ఆయన నివాసంలో కలుసుకున్న శతృఘ్నసిన్హా మంతనాలు కూడా జరిపారు. ఓ పక్క మోడీ నితీశ్ సర్కారును కూకటివేళ్లతో పెకిలించి వేయాలని బీహారీలకు పిలుపునిస్తుంటే సిన్హా మాత్రం నితీశ్ను ఆకాశానికెత్తేస్తున్నారు. దీంతో మోడీ నిన్న ముజాఫర్ పూర్ లో ప్రారంభించిన ఎన్నికల ప్రచారానికి ఇవాళ సోంత పార్టీ నేత ప్రశంసలతో కళ్లెం పడినట్లయ్యిందని బిజేపి వర్గాలే గుసగుసలాడుకుంటున్నాయి.
ఈ మధ్యలో మరికోన్ని వదంతులు వినబడుతున్నాయి. నేడో రేపో ఆర్జేడీ అధినేత లాలూను కూడా కలుసుకోనున్న సిన్హా బిజెపిని వీడే అవకాశాలు కనపడుతున్నాయని పుకార్లు షికార్లు చేస్తున్నాయి. ఆయనకు కేంద్ర మంత్రి పదవి ఇవ్వకపోవడంపై కొంత కాలంగా ఆయన గుర్రుగా ఉన్నారు. పార్టీ అధిష్టానాన్ని బెదిరించేందుకే శతృఘ్నసిన్హా ఆర్జేడీ-జెడియూ నేతలతో చెట్టాపట్టాల్ వేసుకుని తిరుగుతున్నారని బీహార్ బిజెపి నేతలు ఆరోపిస్తున్నారు. ఏదిఏమైనా ప్రధాని శ్రమకు ఫలితం లేకుండా చేయడంలో మాత్రం శతృఘ్నసిన్హా సఫలీకృతుడయ్యాడని రాజకీయ విమర్శకులు వ్యాఖ్యానిస్తున్నారు.
జి. మనోహర్
(And get your daily news straight to your inbox)
Aug 22 | అమెరికా అందరికీ ఒక డ్రీమ్. మరీ ముఖ్యంగా ఇంజనీరింగ్ పూర్తి చేసిన మన దేశవాసులకు అందులోనూ తెలుగువారికి అగ్రరాజ్యంలోకి అడుగుపెట్టి.. అక్కడ ఉద్యోగం సంపాదించి, స్థిరపడాలన్నది చాలామంది అభిలాష. ఇప్పటికే ఈ ఆశలు ఉన్నవారు... Read more
Oct 08 | అసలే నవరాత్రి వేడుకలు.. అంతా ఉత్సాహంగా ఉన్నారు.. వీధి మధ్యలో గర్భా నృత్యం చేయడానికి ఏర్పాట్లు చేశారు. యువతులు, మహిళలతోపాటు పురుషులూ బాగా రెడీ అయి వచ్చేశారు. కానీ డ్యాన్స్ మొదలుపెట్టగానే కరెంటు పోయింది.... Read more
Oct 08 | తిరుమలలో భక్త జన సందోహం పెరిగింది. దసరా పండగ తరువాత పండగ సెలవులు ముగింపు దశకు చేరకుంటున్న తరుణంలో శ్రీవారి దర్శనం కోసం భక్తులో పోటెత్తారు. సెలవులతో కూడిన వారాంతం కావడంతో భక్తులు పెద్ద... Read more
Oct 08 | దేశవ్యాప్తంగా వాహనాల రిజిస్ట్రేషన్ కు ఒకటే సిరీస్ అయిన బీహెచ్ విషయంలో కేంద్ర రవాణా శాఖ నిబంధనలను సడలించనుంది. దేశవ్యాప్తంగా ప్రతీ రాష్ట్రానికి విడిగా ఒక రిజిస్ట్రేషన్ విధానం నడుస్తోంది. తెలంగాణ అయితే టీఎస్... Read more
Oct 07 | ప్రముఖ ప్రవచనకర్త గరికపాటి నరసింహరావు ఇటీవల మెగాస్టార్ చిరంజీవిపై చేసిన వ్యాఖ్యలు దుమారాన్ని రేపుతున్నాయి. మెగాఫాన్స్ మహాపండితుడు గరికపాటిపై నెట్టింట్లో ట్రోల్ చేస్తున్నారు. ఇక దీనికి మెగాబ్రదర్ నాగబాబు చేసిన ట్వీట్ కూడా తోడు... Read more