ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఆదివారం ఉదయం రాజమండ్రిలో గోదావరి మహా పుష్కర వనం పైలాన్ను ఆవిష్కరించారు. దివాన్ చెరువు దగ్గర పుష్కర వనానికి ఆయన శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా నీరు-చెట్టు కార్యక్రమాన్ని ఆయన ప్రారంభించారు. రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న అడవులను అభివృద్ధి చేసుకోవడం, అలాగే అడవుల బయట విస్తీర్ణాన్ని పెంచుకోవడం లాంటివి నీరు-చెట్టు కార్యక్రమంలో భాగంగా ఉన్నాయని ఆయన అన్నారు. రాజమండ్రి పేరును 'రాజమహేంద్రవరం'గా మారుస్తున్నట్లు ఆయన ప్రకటించారు. నిజానికి గతంలో ఈ పేరే ఉండేదని, కానీ, బ్రిటీష్ పాలకులు తమ ఉచ్ఛారణకు అనువుగా రాజమండ్రిగా పేరు మార్చారని గుర్తుచేశారు.
కాగా ఇపుడు మళ్లీ రాజమహేంద్రవరం పేరునే పునరిద్దరించి, నామకరణం చేయనున్నట్లు తెలిపారు. రాజమహేంద్రవరం నగరాన్ని రాష్ట్రానికి సాంస్కృతిక రాజధానిగా అభివృద్ధి చేస్తామన్నారు. ఈ అభివృద్ధిలో భాగంగా ధవళేశ్వరం బ్యారేజీ చుట్టూ 35 కిలోమీటర్ల ప్రాంతాన్ని అఖండ గోదావరి ప్రాజెక్టుతో అభివృద్ధి చేస్తామని, ఇందుకోసం రూ.100 కోట్లను కేటాయిస్తున్నట్టు తెలిపారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన ఎగ్జిబిషన్ను చంద్రబాబు తిలకించారు. ఈ కార్యక్రమంలో చంద్రబాబుతో పాటు రాజమండ్రి ఎంపీ మురళీమోహన్ రాష్ట్ర మంత్రులు యనమల రామకృష్ణుడు తదితరులు పాల్గొన్నారు.
జి. మనోహర్
(And get your daily news straight to your inbox)
Aug 22 | అమెరికా అందరికీ ఒక డ్రీమ్. మరీ ముఖ్యంగా ఇంజనీరింగ్ పూర్తి చేసిన మన దేశవాసులకు అందులోనూ తెలుగువారికి అగ్రరాజ్యంలోకి అడుగుపెట్టి.. అక్కడ ఉద్యోగం సంపాదించి, స్థిరపడాలన్నది చాలామంది అభిలాష. ఇప్పటికే ఈ ఆశలు ఉన్నవారు... Read more
Oct 08 | అసలే నవరాత్రి వేడుకలు.. అంతా ఉత్సాహంగా ఉన్నారు.. వీధి మధ్యలో గర్భా నృత్యం చేయడానికి ఏర్పాట్లు చేశారు. యువతులు, మహిళలతోపాటు పురుషులూ బాగా రెడీ అయి వచ్చేశారు. కానీ డ్యాన్స్ మొదలుపెట్టగానే కరెంటు పోయింది.... Read more
Oct 08 | తిరుమలలో భక్త జన సందోహం పెరిగింది. దసరా పండగ తరువాత పండగ సెలవులు ముగింపు దశకు చేరకుంటున్న తరుణంలో శ్రీవారి దర్శనం కోసం భక్తులో పోటెత్తారు. సెలవులతో కూడిన వారాంతం కావడంతో భక్తులు పెద్ద... Read more
Oct 08 | దేశవ్యాప్తంగా వాహనాల రిజిస్ట్రేషన్ కు ఒకటే సిరీస్ అయిన బీహెచ్ విషయంలో కేంద్ర రవాణా శాఖ నిబంధనలను సడలించనుంది. దేశవ్యాప్తంగా ప్రతీ రాష్ట్రానికి విడిగా ఒక రిజిస్ట్రేషన్ విధానం నడుస్తోంది. తెలంగాణ అయితే టీఎస్... Read more
Oct 07 | ప్రముఖ ప్రవచనకర్త గరికపాటి నరసింహరావు ఇటీవల మెగాస్టార్ చిరంజీవిపై చేసిన వ్యాఖ్యలు దుమారాన్ని రేపుతున్నాయి. మెగాఫాన్స్ మహాపండితుడు గరికపాటిపై నెట్టింట్లో ట్రోల్ చేస్తున్నారు. ఇక దీనికి మెగాబ్రదర్ నాగబాబు చేసిన ట్వీట్ కూడా తోడు... Read more