ఢిల్లీలో ఆమ్ ఆద్మీ పార్టీ, లెఫ్టినెంట్ గవర్నర్ నజీబ్ జంగ్ల మధ్య గత కొంతకాలంగా నడుస్తున్న వివాదం మరింత ముదిరింది. రాజ్యాంగ బద్ధంగా ఎన్నికైన ప్రభుత్వాన్ని అనేక ఇబ్బందులకు గురి చేయడం సరికాదని పలువురు మేధావులు, న్యాయస్థానాలు చెబుతున్నా, నరేంద్ర మోడీ ప్రభుత్వం ఆప్ను అష్టకష్టాలకు గురి చేస్తూనే ఉంది. ఆప్ పాలనను స్తంభింపజేసేందుకు కేంద్ర ప్రభుత్వం తెరవెనుక నుంచి పావులు కదుపుతోంది.ఢిల్లీ లెఫ్టినెంట్ గవర్నర్ కేంద్ర ప్రభుత్వ ఆదేశాల మేరకే ఆప్ ప్రభుత్వాన్ని అణచి వేసేందుకు ప్రయత్నిస్తున్నారనే ఆరోపణలు వెల్లు వెత్తుతున్నాయి. గత సంవత్సరం జరిగిన ఎన్నికల్లో బిజెపి ఢిల్లీని కైవశం చేసుకునేందుకు గట్టి ప్రయత్నం చేసింది. కానీ ఢిల్లీ ప్రజలు మాత్రం ఆప్కే పట్టం కట్టారు.
Also Read: ఆప్ పార్టీకి పైసల కటకట.. కేజ్రీవాల్ ప్రకటన
ఢిల్లీ అసెంబ్లీలో మొత్తం స్థానాలు 60 కాగా, 57 స్థానాలను ఆమ్ ఆద్మీ పార్టీ, కేవలం 3 స్థానాలను బిజెపి గెలుచుకుంది. ఢిల్లీలో ఆప్ ప్రభుత్వం ఏర్పాటు చేయడం నరేంద్ర మోడీ ప్రభుత్వానికి ఏమాత్రం ఇష్టంలేదు. అందువల్లనే ఆప్ పాలనను స్తంభింప జేయాలని బిజెపి ప్రయత్నిస్తున్నదని ఇటీవల విమర్శలు వెల్లువెత్తాయి. నరేంద్ర మోడీ ప్రభుత్వం ఢిల్లీ ప్రభుత్వాన్ని పరిపాలన చేయకుండా ఇబ్బందులకు గురి చేయడం మాను కోవాలని దేశవ్యాప్తంగా నిరసన వ్యక్తమైన కేంద్రం పట్టించుకోవడం లేదు. పైగా తన చర్యలను మరింత ఉధృతం చేసింది. దీంతో అప్ ఎల్జీల మధ్య ఏర్పడిన విభేదాలు వీధిల్లోకి వచ్చాయి. కేంద్రానికి వ్యతిరేకంగా ఉద్యమం నిర్వహిస్తున్న ఆప్ నాయకుడు దిలీప్పాండేను మోటారుతో ఢీకొట్టించి చంపి వేయాలని పథకం వేసినట్లు ఆప్ నాయకులు ఆరోపించారు.
Also Read: తిట్లు తినడంలో మోదీ, కేజ్రీవాల్ పోటీ.. నెట్ లో హల్ చల్
తాజాగా ఢిల్లీ మహిళా కమిషనర్ నియామకం చెల్లదని చెప్పడంతో వివాదం పతాక స్థాయి చేరింది. ఢిల్లీలో లెఫ్టినెంట్ గవర్నర్ నజీబ్ జంగ్, ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ల మధ్య నియామక వివాదాలు ఇంకా కొనసాగుతూనే ఉన్నాయి. తాజాగా వీరిద్దరి మధ్య మరో వివాదం చోటుచేసుకుంది. ఢిల్లీ మహిళా కమిషనర్గా స్వాతి మలివాల్ను నియమిస్తూ మూడు రోజుల క్రితం ఆప్ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. అయితే ఈ నియామకం చెల్లదని లెఫ్టినెంట్ గవర్నర్ సిఎం కార్యాలయానికి లేఖ రాశారు. నియమ నిబంధనల ప్రకారం నియామకం జరగలేదని గవర్నర్ ఆ లేఖలో పేర్కొన్నారు.అయితే నిబంధనల ప్రకారమే ఆమె నియామకం జరిగిందని ఆప్ పార్టీ వివరించింది.
(And get your daily news straight to your inbox)
Aug 22 | అమెరికా అందరికీ ఒక డ్రీమ్. మరీ ముఖ్యంగా ఇంజనీరింగ్ పూర్తి చేసిన మన దేశవాసులకు అందులోనూ తెలుగువారికి అగ్రరాజ్యంలోకి అడుగుపెట్టి.. అక్కడ ఉద్యోగం సంపాదించి, స్థిరపడాలన్నది చాలామంది అభిలాష. ఇప్పటికే ఈ ఆశలు ఉన్నవారు... Read more
Oct 08 | అసలే నవరాత్రి వేడుకలు.. అంతా ఉత్సాహంగా ఉన్నారు.. వీధి మధ్యలో గర్భా నృత్యం చేయడానికి ఏర్పాట్లు చేశారు. యువతులు, మహిళలతోపాటు పురుషులూ బాగా రెడీ అయి వచ్చేశారు. కానీ డ్యాన్స్ మొదలుపెట్టగానే కరెంటు పోయింది.... Read more
Oct 08 | తిరుమలలో భక్త జన సందోహం పెరిగింది. దసరా పండగ తరువాత పండగ సెలవులు ముగింపు దశకు చేరకుంటున్న తరుణంలో శ్రీవారి దర్శనం కోసం భక్తులో పోటెత్తారు. సెలవులతో కూడిన వారాంతం కావడంతో భక్తులు పెద్ద... Read more
Oct 08 | దేశవ్యాప్తంగా వాహనాల రిజిస్ట్రేషన్ కు ఒకటే సిరీస్ అయిన బీహెచ్ విషయంలో కేంద్ర రవాణా శాఖ నిబంధనలను సడలించనుంది. దేశవ్యాప్తంగా ప్రతీ రాష్ట్రానికి విడిగా ఒక రిజిస్ట్రేషన్ విధానం నడుస్తోంది. తెలంగాణ అయితే టీఎస్... Read more
Oct 07 | ప్రముఖ ప్రవచనకర్త గరికపాటి నరసింహరావు ఇటీవల మెగాస్టార్ చిరంజీవిపై చేసిన వ్యాఖ్యలు దుమారాన్ని రేపుతున్నాయి. మెగాఫాన్స్ మహాపండితుడు గరికపాటిపై నెట్టింట్లో ట్రోల్ చేస్తున్నారు. ఇక దీనికి మెగాబ్రదర్ నాగబాబు చేసిన ట్వీట్ కూడా తోడు... Read more