అచ్చే దిన్ అంటూ ఎన్నికల్లో ప్రచారం చేసిన మోదీ.. అధికారంలోకి వచ్చినప్పటి నుండి ప్రజలకు ఎంతో మేలు చేసే పథకాలను ప్రారంభించారు. ఎంతో ప్రతిష్టాత్మకంగా ప్రారంభించిన జన్ ధన్, అటల్ పెన్షన్ యోజన లాంటివి సామాన్య జనానికి ఎంతో మేలుచేసేవే. అందరికి భీమా కల్పించాలనే లక్ష్యంతొ నరేంద్ర మోదీ ప్రారంభించిన జన్ ధన్ పథకం గురించి అయితే సర్వత్రా హర్షంవ్యక్తమయింది. తాజాగా ఆ దిశగానే మరో పథకానికి మోదీ సిద్దపడుతున్నారని సమాచాంరం. అయితే ఆ పథకం ఎలా ఉంటుంది..? అంటే మామూలు వ్యక్తులు కూడా విమాన ప్రయాణం చేసేలాగా ప్రభుత్వం అన్ని అవకాశాలను కల్పించేలా ఉంటుంది. ఏంటి మామూలు వ్యక్తులకు విమాన ప్రయాణ:, అది కూడా ప్రభుత్వమే స్వయంగా సపోర్ట్ చేస్తుందా..? అన్న ప్రశ్నలకు సమాధానాలు కావాలంటే మొత్తం ఆర్టికల్ చదవాల్సిందే.
నరేంద్ర మోదీ.. భారత రాజకీయాల్లో ఓ కొత్త కిరణం.. భారత కీర్తిని విశ్వవ్యాప్తం చేసి, సగటు భారతీయుడి గుర్తింపును అన్ని దేశాలకు ఇనుమడింపజేసిన భారత ప్రధాని. గుజరాత్ రాష్ట్రాన్ని అభివృద్ది వైపు పరుగులు పెట్టించిన నరేంద్ర మోదీ సగటు జనానికి మేలు చేసే అన్ని రకాల అవకాశాలను అందుకుంటున్నారు. డిజిటల్ ఇండియా, మేక్ ఇన్ ఇండియా లాంటి ఎన్నో ప్రతిష్టాత్మక పథకాలతో ప్రజలకు సేవలనుయ అందించడంతో పాటుగా వారికి ఉపాధిని కూడా అందించడానికి పూనుకున్నారు. అయితే మామూలు వ్యక్తులకు విమాన ప్రయాణం అంటే అందని ద్రాక్షలాంటిదే. ఆకాశంలో విమానం ఎగురుతుంటే నేల మీద కూర్చొని సంబరపడే ఎంతో మంది మిడిల్ క్లాస్ జనాలకు మోదీ ఓ శుభవార్తనే చెప్పే సూచనలు కనిపిస్తున్నాయి. అందరికి విమానయానం కల్పించేందుకు మోదీ ప్రభుత్వం పావులు కదుపుతున్నట్లు సమాచారం. కొత్తగా తేనున్న పౌరవిమానయాన విధానంలో ప్రతి మధ్య తరగతి కుటుంబం సంవత్సరానికి ఒకసారి విమాన ప్రయాణం చేసేలాగా అవకాశం కల్పించేందుకు రంగం సిద్దం చేసినట్లు సమాచారం. అదే గనక జరిగితే నేల మీద నుండి సంబరపడ్డ జనం.. నిజ జీవితంలో విమానయానాన్ని ఆస్వాదిస్తారు.
మోదీ ఆలోచన ఎలా ఉన్నా.. దీని మీద అప్పుడే ప్రతిపక్షాలు మండిపడుతున్నాయి. కాలే కడుపులతో పడుకునే ఎంతో మందికి కనీసం ఉపాథి, ఆహారాన్ని అందించలేని మోదీ సర్కార్ దాన్ని కప్పిపుచ్చుకోవడానికి ఇలా విమానయానం పేరుతో మోసం చేస్తోందని మండిపడుతున్నారు. అరచేతిలో విశ్వాన్ని చూపించడం మోదీ ప్రభుత్వానికి వెన్నతో పెట్టిన విద్య అని వారు విమర్శిస్తున్నారు. భారతదేశంలో కోటీశ్వరుల సంఖ్య పెరుగుతున్నా కానీ పేదల సంఖ్య మాత్రం ఆశించిన స్థాయిలె తగ్గడం లేదు. ఇప్పటికే సగటు పేదవాడి జీవన ప్రమాణం 21 రూపాయలతో నడుస్తోంది అంటే భారత్ లో ఎంత దారుణంగా ఉందో పరిస్థితిని అర్థం చేసుకోవచ్చు. ఐక్యరాజ్య సమితి నివేదిక ప్రకారం ఆసియా దేశాల్లోనే ఎక్కువ మంది పేదలు ఉన్నారు. అందునా భారత్ లో పేదల సంఖ్య తక్కువేమీ కాదు. మరి పేదలకు కడుపు నిండా తిండి పెట్టడానికి ఆలోచించని మోదీ సర్కార్ విమానయానం మీద మాత్రం బాగా దృష్టిసారించిందని విమర్శకులు మండిపడుతున్నారు.
By Abhinavachary
(And get your daily news straight to your inbox)
Aug 22 | అమెరికా అందరికీ ఒక డ్రీమ్. మరీ ముఖ్యంగా ఇంజనీరింగ్ పూర్తి చేసిన మన దేశవాసులకు అందులోనూ తెలుగువారికి అగ్రరాజ్యంలోకి అడుగుపెట్టి.. అక్కడ ఉద్యోగం సంపాదించి, స్థిరపడాలన్నది చాలామంది అభిలాష. ఇప్పటికే ఈ ఆశలు ఉన్నవారు... Read more
Oct 08 | అసలే నవరాత్రి వేడుకలు.. అంతా ఉత్సాహంగా ఉన్నారు.. వీధి మధ్యలో గర్భా నృత్యం చేయడానికి ఏర్పాట్లు చేశారు. యువతులు, మహిళలతోపాటు పురుషులూ బాగా రెడీ అయి వచ్చేశారు. కానీ డ్యాన్స్ మొదలుపెట్టగానే కరెంటు పోయింది.... Read more
Oct 08 | తిరుమలలో భక్త జన సందోహం పెరిగింది. దసరా పండగ తరువాత పండగ సెలవులు ముగింపు దశకు చేరకుంటున్న తరుణంలో శ్రీవారి దర్శనం కోసం భక్తులో పోటెత్తారు. సెలవులతో కూడిన వారాంతం కావడంతో భక్తులు పెద్ద... Read more
Oct 08 | దేశవ్యాప్తంగా వాహనాల రిజిస్ట్రేషన్ కు ఒకటే సిరీస్ అయిన బీహెచ్ విషయంలో కేంద్ర రవాణా శాఖ నిబంధనలను సడలించనుంది. దేశవ్యాప్తంగా ప్రతీ రాష్ట్రానికి విడిగా ఒక రిజిస్ట్రేషన్ విధానం నడుస్తోంది. తెలంగాణ అయితే టీఎస్... Read more
Oct 07 | ప్రముఖ ప్రవచనకర్త గరికపాటి నరసింహరావు ఇటీవల మెగాస్టార్ చిరంజీవిపై చేసిన వ్యాఖ్యలు దుమారాన్ని రేపుతున్నాయి. మెగాఫాన్స్ మహాపండితుడు గరికపాటిపై నెట్టింట్లో ట్రోల్ చేస్తున్నారు. ఇక దీనికి మెగాబ్రదర్ నాగబాబు చేసిన ట్వీట్ కూడా తోడు... Read more