అది ప్రవిత్ర ప్రేమకు చిహ్నం, అజరామరమైన ప్రేమకు సజీవ సాక్షం.. యమునా నది తీరాన పాలరాతితో నిర్మితమైన అద్భుత కట్టడం. రాజల కోటలకే మకుటం. తన మూడవ భార్య ముమ్ తాజ్ పై వున్న ప్రేమకు గుర్తుగా షాజహాన్ కట్టించిన సుంధర సమాది. అలాంటి ప్రపంచ ప్రసిద్ద కట్టడం వద్ద మతాంతర వివాహం చేసుకునేందుకు పెద్దలు అనుమతించలేదని ఓ ప్రేమ జంట.. తనవులు చాలించాలని నిర్ణయించుకున్నాయి. అనుకున్నదే తడవుగా ఇద్దరు ఆత్మహత్యకు పాల్పడ్డటం.. స్థానికంగా కలకలం రేపింది. ఈ ఘటనతో తాజ్ మహాల్ ను వీక్షించేందుకు వచ్చిన పర్యాటకులు ఒక్కసారిగా షాక్ కు గురయ్యారు.
ఆగ్రాలో తమ తల్లిదండ్రులతో కలసి నివాసముంటున్న రాజ్ వీర్ సింగ్, షబ్నం అలీలు బాల్యం నుంచి స్నేహితులు. కాల క్రమేనా రాజ్ వీర్ సింగ్ కుటుంబం ఆగ్రా నుంచి డెహ్రడూన్ కు వలస వెళ్లింది. అయితే వీరి మధ్య వున్న స్నేహం మాత్రం క్రమంగా కొత్త పుంతలు తొక్కుతూ ప్రేమగా చిగురించింది. వారిద్దరూ యుక్తవయస్సుకు రావడం.. అదే స్థాయిలో వారి ప్రేమ కూడా చిగురించడం ప్రారంభించింది. అయితే ఇద్దరు తమ ప్రేమ వ్యవహారాన్ని తమ ఇళ్లలోని పెద్దలకు చెప్పారు. మత పెద్దలతోనూ చెప్పించారు. అయినా ఫలితం లేకపోయింది. ముఖ్యంగా షబ్నా ఇంట్లోని పెద్దలు ఎంతకీ పెళ్లికి అంగీకరించలేదు.
ఈ క్రమంలో రాజ్ వీర్ సింగ్ తో అన్ని బంధాలను తెంచుకోవాల్సిందిగా హెచ్చరించారు. అంతేకాదు ఆగ్రాలోని దయాల్ పూర్ నుంచి కరబేలా ప్రాంతానికి రహస్యంగా మకాం మార్చారు. మతాంతర వివాహం చేసుకునేందుక తాము అంగీకరించమని భీష్మించడంతో షబ్నా అలి కూడా వారి చెప్పినట్లుగా నడుచుకున్నట్లు నటించింది. కానీ రహస్యంగా రాజ్ వీర్ తో ఎప్పటికప్పుడు తాను ఫోన్ ద్వారా సంభాషించేది. అలా తామకు వివాహం చేసుకోవాలని వున్నా పెద్దలు అభ్యంతరం చెప్పడంతో.. దిక్కుతోచని ప్రేమజంట ఆత్మహత్యాయత్నానికి పాల్పడాలని సిద్దపడ్డారు.
ఈ నేపథ్యంలో బుధవారం ఆగ్రాకు చెరుకున్న రాజ్ వీర్.. షబ్నా అలికి ఫోన్ చేశాడు. యధావిధిగా ఓ ప్రైవేటు అకాడమీలో డాన్స్ క్లాసులు నిర్వహించేందుకు వెళ్లివస్తానని చెప్పి ఇంటి నుంచి బయలుదేరిన షబ్నా సరాసరి తాజ్ మహాల్ కు చేరుకుని రాజ్ వీర్ ను కలుసుకుంది. పెళ్లి కోసం ఎన్ని ప్రయత్నాలు చేసినా.. తమ ప్రేమను పెద్దలు అంగీకరించడం లేదని భావించిన వారిద్దరూ ఆత్మహత్యకు పాల్పడ్డారు. బ్లేడులతో పరస్పరం దొంతు కోసుకుని బలవన్మరణానికి ప్రయత్నించారు. రక్తపు మడుగులో వున్న వీరిద్దరిని వెంటనే ఎస్.ఎన్ మెడికల్ కాలేజీ ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. వీరిద్దరి పరిస్థితి విషమంగా వున్నట్లు వైద్యులు తెలిపారు.
పెద్దలు ప్రేమకు అంగీకరించలేదని తాము ఆత్మహత్యకు పాల్పడ్డామని, తీవ్ర నిస్పృహతోనే ఇలా చేయాల్సి వచ్చిందని రాజ్ వీర్ సింగ్ అగ్రా మేజిస్ట్రేట్ కు వాంగ్మూలం ఇచ్చాడు. తమ పెళ్లికి పెద్దలను ఒప్పించేందుకు అన్ని ప్రయత్నాలు చేసినా.. విఫలమయ్యామని చెప్పాడు, మతాంతర వివాహ పెళ్లిక అడ్డుగోడగా మారిందని వాపోయాడు. సమాచారం అందుకున్న పోలీసులు.. ప్రేమికుల కుటుంబసభ్యలకు సమాచారం అందించేందుకు యత్నించగా, రాజ్ వీర్ కుటుంబసభ్యులు అందుబాటులోకి రాలేదు. కాగా షబ్నా అలీ కుటుంబసభ్యలు హుటాహుటిన ఆసుపత్రికి చేరుకున్నారు. పెళ్లికి తాము అంగీకరిస్తున్నట్లు వైద్యులకు తెలిపారు.
జి.మనోహర్
(And get your daily news straight to your inbox)
Aug 22 | అమెరికా అందరికీ ఒక డ్రీమ్. మరీ ముఖ్యంగా ఇంజనీరింగ్ పూర్తి చేసిన మన దేశవాసులకు అందులోనూ తెలుగువారికి అగ్రరాజ్యంలోకి అడుగుపెట్టి.. అక్కడ ఉద్యోగం సంపాదించి, స్థిరపడాలన్నది చాలామంది అభిలాష. ఇప్పటికే ఈ ఆశలు ఉన్నవారు... Read more
Oct 08 | అసలే నవరాత్రి వేడుకలు.. అంతా ఉత్సాహంగా ఉన్నారు.. వీధి మధ్యలో గర్భా నృత్యం చేయడానికి ఏర్పాట్లు చేశారు. యువతులు, మహిళలతోపాటు పురుషులూ బాగా రెడీ అయి వచ్చేశారు. కానీ డ్యాన్స్ మొదలుపెట్టగానే కరెంటు పోయింది.... Read more
Oct 08 | తిరుమలలో భక్త జన సందోహం పెరిగింది. దసరా పండగ తరువాత పండగ సెలవులు ముగింపు దశకు చేరకుంటున్న తరుణంలో శ్రీవారి దర్శనం కోసం భక్తులో పోటెత్తారు. సెలవులతో కూడిన వారాంతం కావడంతో భక్తులు పెద్ద... Read more
Oct 08 | దేశవ్యాప్తంగా వాహనాల రిజిస్ట్రేషన్ కు ఒకటే సిరీస్ అయిన బీహెచ్ విషయంలో కేంద్ర రవాణా శాఖ నిబంధనలను సడలించనుంది. దేశవ్యాప్తంగా ప్రతీ రాష్ట్రానికి విడిగా ఒక రిజిస్ట్రేషన్ విధానం నడుస్తోంది. తెలంగాణ అయితే టీఎస్... Read more
Oct 07 | ప్రముఖ ప్రవచనకర్త గరికపాటి నరసింహరావు ఇటీవల మెగాస్టార్ చిరంజీవిపై చేసిన వ్యాఖ్యలు దుమారాన్ని రేపుతున్నాయి. మెగాఫాన్స్ మహాపండితుడు గరికపాటిపై నెట్టింట్లో ట్రోల్ చేస్తున్నారు. ఇక దీనికి మెగాబ్రదర్ నాగబాబు చేసిన ట్వీట్ కూడా తోడు... Read more