గోదావరి మహాపుష్కరాల మొదటి రోజు.. ఎంతో వైభవంగా ప్రారంభమైన గోదావరి మహా పుష్కరాలు ప్రారంభమైన కొద్ది గంటల్లోనే 27 మంది భక్తులు మృత్యువాత పడటంపై మానవ హక్కుల సంఘంలో ఫిర్యాదు నమోదేంది. కేంద్ర హోంశాఖ కూడా జరిగిన ఘటన మీద నివేదిక కోరింది. అయితే తాజాగా తూర్పుగోదావరి జిల్లా కలెక్టర్ ప్రాథమిక నివేదికను తయారు చేసి అందించినట్లు సమాచారం. అయితే నివేదికలో చంద్రబాబు నాయుడు వల్లే దుర్ఘటన చోటుచేసుకుందన్నట్లు వెల్లడించారని సమాచారం. భద్రతాలోపాల వల్ల తొక్కిసలాట జరిగినట్లు భావిస్తున్నా కానీ పరోక్షంగా చంద్రబాబు నాయుడు దీనికి కారణం అని నివేదికలో కలెక్టర్ వెల్లడించినట్లు సమాచారం.
Also Read: మహా పుష్కరాల్లో మహా విషాదం.. తొలి రోజే అపశృతి
Also Read: విషాదం తీవ్రంగా కలిచి వేసిందంటూ పవన్ ట్వీట్..
కలెక్టర్ నివేదికలో వెల్లడించినట్లు భావిస్తున్న అంశాలు..
* వీఐపీలంతా రాజమండ్రిలో కేంద్రీకృతం కావడం వల్ల జిల్లా యంత్రాంగం, పోలీసు వ్యవస్థ మొత్తం వారి భద్రత, సేవలపై కేంద్రీకరించాల్సి వచ్చిందని సమాచారం.
* చంద్రబాబు వీఐపీ ఘాట్లో కాకుండా సామాన్య జనం స్నానాలు ఆచరించే ఘాట్లో ఎక్కువసేపు గడపడం, ఆ తర్వాత ఒక్కసారిగా గేట్లు తెరవడం తొక్కిసలాటకు కారణం
* ప్రమాదమని తెలిసీ చంద్రబాబు సామాన్యజనం ఉండే ఘాట్కు వచ్చారని, భద్రతా సిబ్బంది, అధికార యంత్రాంగం వద్దంటున్నా ఆయన వినలేదని సమాచారం.
* ఇంతకీ చంద్రబాబు సామాన్యజనం ఉండే ఘాట్కు ఎందుకు వచ్చారంటే ఓ షార్ట్ ఫిలిం షూటింగ్ కోసమేనని కూడా ప్రచారంలో ఉందని.. దాని గురించి కూడా కలెక్టర్ నివేదికలో ప్రస్తావించినట్లు తెలుస్తోంది.
By Abhinavachary
Also Read: దారులన్నీ గోదారికే.. తొలిరోజే 24 లక్షల మంది పుష్కర స్నానం
Also Read: క్యు లైన్లో భక్తులు.. నిన్నటి ఘటనతో జాగ్రత్తలు
(And get your daily news straight to your inbox)
Aug 22 | అమెరికా అందరికీ ఒక డ్రీమ్. మరీ ముఖ్యంగా ఇంజనీరింగ్ పూర్తి చేసిన మన దేశవాసులకు అందులోనూ తెలుగువారికి అగ్రరాజ్యంలోకి అడుగుపెట్టి.. అక్కడ ఉద్యోగం సంపాదించి, స్థిరపడాలన్నది చాలామంది అభిలాష. ఇప్పటికే ఈ ఆశలు ఉన్నవారు... Read more
Oct 08 | అసలే నవరాత్రి వేడుకలు.. అంతా ఉత్సాహంగా ఉన్నారు.. వీధి మధ్యలో గర్భా నృత్యం చేయడానికి ఏర్పాట్లు చేశారు. యువతులు, మహిళలతోపాటు పురుషులూ బాగా రెడీ అయి వచ్చేశారు. కానీ డ్యాన్స్ మొదలుపెట్టగానే కరెంటు పోయింది.... Read more
Oct 08 | తిరుమలలో భక్త జన సందోహం పెరిగింది. దసరా పండగ తరువాత పండగ సెలవులు ముగింపు దశకు చేరకుంటున్న తరుణంలో శ్రీవారి దర్శనం కోసం భక్తులో పోటెత్తారు. సెలవులతో కూడిన వారాంతం కావడంతో భక్తులు పెద్ద... Read more
Oct 08 | దేశవ్యాప్తంగా వాహనాల రిజిస్ట్రేషన్ కు ఒకటే సిరీస్ అయిన బీహెచ్ విషయంలో కేంద్ర రవాణా శాఖ నిబంధనలను సడలించనుంది. దేశవ్యాప్తంగా ప్రతీ రాష్ట్రానికి విడిగా ఒక రిజిస్ట్రేషన్ విధానం నడుస్తోంది. తెలంగాణ అయితే టీఎస్... Read more
Oct 07 | ప్రముఖ ప్రవచనకర్త గరికపాటి నరసింహరావు ఇటీవల మెగాస్టార్ చిరంజీవిపై చేసిన వ్యాఖ్యలు దుమారాన్ని రేపుతున్నాయి. మెగాఫాన్స్ మహాపండితుడు గరికపాటిపై నెట్టింట్లో ట్రోల్ చేస్తున్నారు. ఇక దీనికి మెగాబ్రదర్ నాగబాబు చేసిన ట్వీట్ కూడా తోడు... Read more