గోదావరి మహా పుష్కరాలు చూడాలంటే ఎంతో పుణ్యం చేసుకొని ఉండాలంటారు.. పుణ్యస్నానం చెయ్యలంటే ఎంతో అదృష్టం ఉండాలంటారు. అందుకే గోదావరి మహా పుష్కరాలు ప్రారంభం కాగానే జనం గోదావరికి పోటెత్తారు. అటు ఏపి, ఇటు తెలంగాణలలో ఒక్కరోజే 24 లక్షల మంది భక్తులు పుణ్యస్నానాలు చేశారంటే పరిస్థితి ఎంతలా ఉంటుందో అర్థం చేసుకోవచ్చు. అయితే గోదావరి పుణ్యస్నానానికి వచ్చి తొక్కిసలాటలో భక్తులు మృతి చెందడం సర్వత్రా విషాదం నింపింది. అయితే రాజమండ్రి కోటిలింగాల పుష్కరఘాట్ వద్ద జరిగిన తొక్కసలాటలో 27 మంది మృతి చెందడం సంచలనం రేపింది. అయితే గోదావరి పుష్కరాలకు వస్తున్న భక్తజనం భద్రతకు మరింత పోలీసులను, అధికారులకు నియమించాయి రెండు తెలుగు రాష్ట్ర ప్రభుత్వాలు అయితే జరిగిన ఘటన భక్తుల్లో మార్పు తీసుకువచ్చింది.
Also Read: పుష్కరాలకు వెళ్లే వాళ్లూ జాగ్రత్త.. ఇవి పాటించండి
Also Read: దారులన్నీ గోదారికే.. తొలిరోజే 24 లక్షల మంది పుష్కర స్నానం
గాయం తగిలితే కానీ కట్టు కట్టరు అని సామెత. ముందు జాగ్రత్తలు పాటించండి బాబూ అంటూ పుష్కరాల సమయంలో అధికారులు ఎన్ని జాగ్రత్త పాఠాలు నేర్పించినా కానీ భక్తులు మాత్రం పాటించలేదు. ఒక్కసారిగా లక్షల జనం పుష్కరఘాట్ లకు చేరుకోవడం.. చిన్న పిల్లలు, ముసలివారు కూడా అందులో ఉండటంతో తొక్కిసలాట జరిగి మృతుల సంఖ్య పెరిగింది. అయితే నిన్నటి ఘటనతో గోదావరి మహా పుష్కరాలకు వస్తున్న భక్తులు అలర్ట్ అయ్యారు. పూర్తి జాగ్రత్తలతో పుష్కరాలకు హాజరవుతున్నారు. పోలీసుల ప్రమేయం లేకున్నా కానీ క్యు లైన్లలో వెళ్లి పుష్కర ఘాట్ వద్ద పుణ్య స్నానం చేస్తున్నారు. నిన్నటి ఘటనతో వచ్చే భక్తులు పూర్తి స్థాయి అప్రమత్తతో ఉంటున్నారు. అవసరమైతే కొంచెం ఆలస్యమయినా వేచి ఉండి తీరిగ్గా రద్దీ తగ్గిన తర్వాత పుష్కరాలకు హాజరవుతున్నారు.
By Abhinavachary
Also Read: మా తల్లి గోదారి పిలుస్తోంది.. పుష్కరాలొచ్చె సంబరాలు తెచ్చె
Also Read: ప్రభుత్వ నిర్లక్షం, అధికారుల అలసత్వం.. బలైంది భక్తులు
(And get your daily news straight to your inbox)
Aug 22 | అమెరికా అందరికీ ఒక డ్రీమ్. మరీ ముఖ్యంగా ఇంజనీరింగ్ పూర్తి చేసిన మన దేశవాసులకు అందులోనూ తెలుగువారికి అగ్రరాజ్యంలోకి అడుగుపెట్టి.. అక్కడ ఉద్యోగం సంపాదించి, స్థిరపడాలన్నది చాలామంది అభిలాష. ఇప్పటికే ఈ ఆశలు ఉన్నవారు... Read more
Oct 08 | అసలే నవరాత్రి వేడుకలు.. అంతా ఉత్సాహంగా ఉన్నారు.. వీధి మధ్యలో గర్భా నృత్యం చేయడానికి ఏర్పాట్లు చేశారు. యువతులు, మహిళలతోపాటు పురుషులూ బాగా రెడీ అయి వచ్చేశారు. కానీ డ్యాన్స్ మొదలుపెట్టగానే కరెంటు పోయింది.... Read more
Oct 08 | తిరుమలలో భక్త జన సందోహం పెరిగింది. దసరా పండగ తరువాత పండగ సెలవులు ముగింపు దశకు చేరకుంటున్న తరుణంలో శ్రీవారి దర్శనం కోసం భక్తులో పోటెత్తారు. సెలవులతో కూడిన వారాంతం కావడంతో భక్తులు పెద్ద... Read more
Oct 08 | దేశవ్యాప్తంగా వాహనాల రిజిస్ట్రేషన్ కు ఒకటే సిరీస్ అయిన బీహెచ్ విషయంలో కేంద్ర రవాణా శాఖ నిబంధనలను సడలించనుంది. దేశవ్యాప్తంగా ప్రతీ రాష్ట్రానికి విడిగా ఒక రిజిస్ట్రేషన్ విధానం నడుస్తోంది. తెలంగాణ అయితే టీఎస్... Read more
Oct 07 | ప్రముఖ ప్రవచనకర్త గరికపాటి నరసింహరావు ఇటీవల మెగాస్టార్ చిరంజీవిపై చేసిన వ్యాఖ్యలు దుమారాన్ని రేపుతున్నాయి. మెగాఫాన్స్ మహాపండితుడు గరికపాటిపై నెట్టింట్లో ట్రోల్ చేస్తున్నారు. ఇక దీనికి మెగాబ్రదర్ నాగబాబు చేసిన ట్వీట్ కూడా తోడు... Read more