ఓటుకు నోటు వ్యవహారం తర్వాత ఏపి ప్రభుత్వం ట్యాపిగ్ పై తీవ్రంగా మండిపడుతోంది. అయితే ట్యాపింగ్ కు సంబందించిన ఆధారాలు కూడా తమ వద్ద ఉన్నాయని ఏపి ప్రభుత్వం పలు సార్లు వెల్లడించింది. అయితే ట్యాపింగ్ విషయంలో ఆధారాలు ఉంటే బయటపెట్టాలని తెలంగాణ నేతలు సవాల్ విసిరినా కానీ ఏపి ప్రభుత్వం మాత్రం ఎలాంటి ఆధారాలను బయటపెట్లలేదు. అయితే తాజాగా నారా లోకేష్ తెలంగాణకు చెందిన ఇద్దరు కీలక అధికారుల పేర్లను వెల్లడించడంతో ఉత్కంఠత పెరిగింది. తెలంగాణ ప్రభుత్వం ఏపి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, మంత్రులు, పలు కీలక పదవుల్లో ఉన్న అధికారుల ఫోన్లను ట్యాప్ చేస్తున్నారని, అందుకు సంబందించిన ఆధారాలు కూడా ఉన్నాయని నారా లోకేష్ గతంలోనే తెలిపారు. అయితే తప్పు చేసిన కేసీఆర్ భయపడుతున్నారని కూడా విమర్శించారు. తాజాగా ఇద్దరు తెలంగాణ అధికారుల పేర్లను వెల్లడించడం కొత్త చర్చ. మొదలైంది.
Also Read: ITEMVIDEOS: ఓటుకు నోటు కేసులో లోకేష్ గేమ్
ఓటుకు నోటు వ్యవహారంలో వారం తర్వాత ఏపి సిఎం చంద్రబాబు నాయుడు మాట్లాడినట్లుగా బావిస్తున్న ఆడియో టేపులు విడుదలయ్యాయి. అయితే ఏపి ప్రభుత్వం మాత్రం తమ ఫోన్లను ట్యాప్ చేస్తున్నారని ఆరోపించింది. అయితే దాని మీద ఎలాంటి ఆధారాలు ఇప్పటి వరకు విడుదల చెయ్యడమో లేదా చూపించడమో చెయ్యలేదు. కానీ తాజాగా నారా లోకేష్ తెలంగాణ ప్రభుత్వంలో పని చేస్తున్న అధికారులు ట్యాపింగ్ చేసేందుకు తమ సంతకాలతో లెటర్లు రాసినట్లు వెల్లడించారు. తెలంగాణ ప్రభుత్వ అధికారులు సజ్జనార్, శివధర్ రెడ్డిలు స్వయంగా సంతకం చేసి సర్వీస్ ప్రొవైడర్లకు ఇచ్చిన కాపీలు తమ వద్ద ఉన్నాయని నారా లోకేష్ వెల్లడించారు. అయితే ఆ ఆధారాలను సరూన సమయంలో బయటపెడతాం అని వెల్లడించారు. అయితే నారా లోకేష్ ఇలా సరైన సమయం అంటూ చూసుకుంటూ పోతే ఇంకెన్నటికీ ఆధారాలు బయటపడవేమో అని కొంత మంది అప్పుడూ విమర్శిస్తున్నారు.
By Abhinavachary
Also Read : ఫోన్ ట్యాపింగ్ వ్యవహరంపై నారా లోకేష్ తీవ్ర వ్యాఖ్యలు
Also Read: నారా లోకేష్ అందిరివాడు కాజాలడా..?
(And get your daily news straight to your inbox)
Aug 22 | అమెరికా అందరికీ ఒక డ్రీమ్. మరీ ముఖ్యంగా ఇంజనీరింగ్ పూర్తి చేసిన మన దేశవాసులకు అందులోనూ తెలుగువారికి అగ్రరాజ్యంలోకి అడుగుపెట్టి.. అక్కడ ఉద్యోగం సంపాదించి, స్థిరపడాలన్నది చాలామంది అభిలాష. ఇప్పటికే ఈ ఆశలు ఉన్నవారు... Read more
Oct 08 | అసలే నవరాత్రి వేడుకలు.. అంతా ఉత్సాహంగా ఉన్నారు.. వీధి మధ్యలో గర్భా నృత్యం చేయడానికి ఏర్పాట్లు చేశారు. యువతులు, మహిళలతోపాటు పురుషులూ బాగా రెడీ అయి వచ్చేశారు. కానీ డ్యాన్స్ మొదలుపెట్టగానే కరెంటు పోయింది.... Read more
Oct 08 | తిరుమలలో భక్త జన సందోహం పెరిగింది. దసరా పండగ తరువాత పండగ సెలవులు ముగింపు దశకు చేరకుంటున్న తరుణంలో శ్రీవారి దర్శనం కోసం భక్తులో పోటెత్తారు. సెలవులతో కూడిన వారాంతం కావడంతో భక్తులు పెద్ద... Read more
Oct 08 | దేశవ్యాప్తంగా వాహనాల రిజిస్ట్రేషన్ కు ఒకటే సిరీస్ అయిన బీహెచ్ విషయంలో కేంద్ర రవాణా శాఖ నిబంధనలను సడలించనుంది. దేశవ్యాప్తంగా ప్రతీ రాష్ట్రానికి విడిగా ఒక రిజిస్ట్రేషన్ విధానం నడుస్తోంది. తెలంగాణ అయితే టీఎస్... Read more
Oct 07 | ప్రముఖ ప్రవచనకర్త గరికపాటి నరసింహరావు ఇటీవల మెగాస్టార్ చిరంజీవిపై చేసిన వ్యాఖ్యలు దుమారాన్ని రేపుతున్నాయి. మెగాఫాన్స్ మహాపండితుడు గరికపాటిపై నెట్టింట్లో ట్రోల్ చేస్తున్నారు. ఇక దీనికి మెగాబ్రదర్ నాగబాబు చేసిన ట్వీట్ కూడా తోడు... Read more