ఒకప్పుడు హస్త భూషణం అని అనే వారు.. కానీ కాలం మారింది పుస్తకానికి ఎప్పుడో కాలం చెల్లింది. తాజాగా స్మార్ట్ పోన్ చేతిలోకి వచ్చేసింది. అయితే ఆ స్మార్ట్ ఫోన్ లో వాట్సాప్, షేస్ బుక్ లాంటి సోషల్ కనెక్టివిటి లేకపోతే దండగ అనే ఫిలింగ్ చాలా మందికి ఉన్నారు. అయితే వాట్సాప్ యూజర్ల జాబితా అంతకంతకు పెరిగిపోతోంది. ఫోన్ చేసుకునే కన్నా కూడా వాట్సాప్ లాంటి సోషల్ మీడియా ద్వారా ఛాటింగ్ చేస్తూ ముచ్చటిస్తున్నారు. అయితే గతంలో కన్నా విపరీతంగా వాట్సాప్ వాడకం పెరగిపోయింది. ప్రతి విషయాన్ని వాట్సాప్ ద్వారా షేర్ చెయ్యడం ఫ్యాషనైపోయింది. ఒక్క వాట్సాప్ తో కాదు వి ఛాట్, స్కైప్ లాంటివి కూడా ఇదే కోవలోకి వస్తాయి. చుట్టు పక్కల ఏం జరుగుతుందన్న విషయాన్ని కూడా మరిచిపోయి ఛాటింగ్ లో అంతలా లీనమైపోతున్నారు స్మార్ట్ యూజర్లు.
అయితే ఇండియాలోని స్మార్ట్ఫోన్ వాడకందారులు వాట్సాప్, వి చాట్, హైక్, స్కైప్ లాంటి సోఫల్ మీడియా యాప్లపైనే 47 శాతం సమయాన్ని కేటాయిస్తున్నారని తాజాగా ఓ నివేదికలొ వెల్లడైంది. ఈ అప్లికేషన్లే మొబైల్ బ్రాడ్బ్యాండ్ వినియోగానికి మెయిన్ రోల్ గా మారుతున్నాయని దానిలో తేలింది. ప్రస్తుతం స్మార్ట్ఫోన్లలో సోషల్ మీడియా యాప్ ల హవా కొనసాగుతోంది.. కొత్త కొత్త యాప్ ల వినియోగంపై స్మార్ట్ ఫోన్ వినియోగదారులు చాలా ఇంట్రస్ట్ గా ఉన్నారు. అయితే సోషల్ మీడియాలో కనెక్టివిటి కోసం నెట్ వాడకం బాగా పెరిగింది. అయితే గతంలో నెట్ వినియోగం కన్నా సోషల్ మీడియా కనెక్టివిటి కలిగిన వాట్సాప్, వి ఛాట్, స్కైప్ లాంటి యాప్ ల రాకతో నెట్ వినియోగం విపరీతంగా పెరిగిందని స్వీడన్ టెలికాం పరికరాల తయారీసంస్థ ఇరిక్సన్ నివేదికలో తెలిపింది. స్మార్ట్ఫోన్ వినియోగిస్తున్న భారతీయులు వారి సమయంలో 47 శాతాన్ని సోషల్ మిడియా కనెక్టివిటి అప్లికేషన్లపైనే గడుపుతున్నారని ఈ నివేదిక తెలిపింది.
*అభినవచారి*
(And get your daily news straight to your inbox)
Aug 22 | అమెరికా అందరికీ ఒక డ్రీమ్. మరీ ముఖ్యంగా ఇంజనీరింగ్ పూర్తి చేసిన మన దేశవాసులకు అందులోనూ తెలుగువారికి అగ్రరాజ్యంలోకి అడుగుపెట్టి.. అక్కడ ఉద్యోగం సంపాదించి, స్థిరపడాలన్నది చాలామంది అభిలాష. ఇప్పటికే ఈ ఆశలు ఉన్నవారు... Read more
Oct 08 | అసలే నవరాత్రి వేడుకలు.. అంతా ఉత్సాహంగా ఉన్నారు.. వీధి మధ్యలో గర్భా నృత్యం చేయడానికి ఏర్పాట్లు చేశారు. యువతులు, మహిళలతోపాటు పురుషులూ బాగా రెడీ అయి వచ్చేశారు. కానీ డ్యాన్స్ మొదలుపెట్టగానే కరెంటు పోయింది.... Read more
Oct 08 | తిరుమలలో భక్త జన సందోహం పెరిగింది. దసరా పండగ తరువాత పండగ సెలవులు ముగింపు దశకు చేరకుంటున్న తరుణంలో శ్రీవారి దర్శనం కోసం భక్తులో పోటెత్తారు. సెలవులతో కూడిన వారాంతం కావడంతో భక్తులు పెద్ద... Read more
Oct 08 | దేశవ్యాప్తంగా వాహనాల రిజిస్ట్రేషన్ కు ఒకటే సిరీస్ అయిన బీహెచ్ విషయంలో కేంద్ర రవాణా శాఖ నిబంధనలను సడలించనుంది. దేశవ్యాప్తంగా ప్రతీ రాష్ట్రానికి విడిగా ఒక రిజిస్ట్రేషన్ విధానం నడుస్తోంది. తెలంగాణ అయితే టీఎస్... Read more
Oct 07 | ప్రముఖ ప్రవచనకర్త గరికపాటి నరసింహరావు ఇటీవల మెగాస్టార్ చిరంజీవిపై చేసిన వ్యాఖ్యలు దుమారాన్ని రేపుతున్నాయి. మెగాఫాన్స్ మహాపండితుడు గరికపాటిపై నెట్టింట్లో ట్రోల్ చేస్తున్నారు. ఇక దీనికి మెగాబ్రదర్ నాగబాబు చేసిన ట్వీట్ కూడా తోడు... Read more