తెలుగు రాష్ట్రాల్లో సెగ రేపుతున్న ట్యాపింగ్ వ్యవహారంలో ఏపి ప్రభుత్వానికి కీలక సమాచారం దొరికినట్లు తెలుస్తోంది. ట్యాపింగ్ కు సంబందించిన వివరాలను రాబట్టేందుకు సర్వీస్ ప్రొవైడర్లకు ఇచ్చిన నోటీసులపై వారు సిట్ ముందు హాజరయ్యారు. అయితే ట్యాపింగ్ కు పాల్పడినట్లు సిట్ కు దాదాపు క్లారిటీ వచ్చిందని సమాచారం. రెండు రోజులుగా సాగిన సర్వీస్ ప్రొవైడర్ల దర్యాప్తులో ట్యాపింగ్ కు సంబందించిన ఆధారాలు కూడా లభించినట్లు భావిస్తున్నారు. అయితే మొత్తం 149 ఫోన్ నెంబర్లపై సిట్ అధికారులు ఎక్కువగా దృష్టి సారించారని, ఇందులో కొన్ని నెంబర్లు ట్యాపింగ్ కు గురైనట్లు గుర్తించింది సిట్. అయితే తమ కంపెనీకి చెందిన ఉన్నతాధికారుల ఆదేశాల మేరకే ట్యాపింగ్ జరిగినట్లు సర్వీస్ ప్రొవైడర్లు సిట్ ముందు వెల్లడించినట్లు తెలుస్తోంది. ట్యాప్ జరిగిన ఫోన్లకు సంబంధించిన రికార్డులు, సీడీలను సిట్ అధికారులు స్వాధీనం చేసుకున్నారు.
అయితే సిట్ అధికారులు స్వాధీనం చేసుకున్న రికార్డుల్లో తెలంగాణ టీడీపీ ఎమ్మెల్యే రేవంత్ రెడ్డి, నామినేటెడ్ ఎమ్మెల్యే స్టీఫెన్సన్ మధ్య జరిగిన సంభాషణల టేపులు కూడా ఉన్నట్లు సమాచారం. ఆంధ్రప్రదేశ్ కు చెందిన 14 మంది ఫోన్లు ట్యాప్ చేసినట్లు ఆధారాలతో సహా గుర్తించినట్లు తెలుస్తోంది. ట్యాపింగ్కు సంబంధించి రెండు నెలల రికార్డులన్నీ సీడీల రూపంలో ఇవ్వాలని సిట్ ఆదేశించింది. ఇందుకు సర్వీస్ ప్రొవైడర్లు అంగీకరించారని తెలిసింది. కాగా డాటా ఇవ్వడానికి తమకు కొంత టైం కావాలని కోరినట్లు సమాచారం. రెండు రోజుల విచారణలో ఆయా కంపెనీల ప్రతినిధులు చెప్పిన వివరాల ఆధారంగా సిట్ విచారణ వేగవంతం చెయ్యనుంది. అయితే తమ కంపెనీ ఉన్నతాధికారులు చెప్పినందుకే ట్యాపింగ్ చేశామని సర్వీస్ ప్రొవైడర్లు ఇచ్చిన సమాచారం మేరకు ఆ ఉన్నతాధికారులను కూడా విచారించాలని సిట్ భావిస్తున్నట్లు తెలుస్తోంది.
*అభినవచారి*
(And get your daily news straight to your inbox)
Aug 22 | అమెరికా అందరికీ ఒక డ్రీమ్. మరీ ముఖ్యంగా ఇంజనీరింగ్ పూర్తి చేసిన మన దేశవాసులకు అందులోనూ తెలుగువారికి అగ్రరాజ్యంలోకి అడుగుపెట్టి.. అక్కడ ఉద్యోగం సంపాదించి, స్థిరపడాలన్నది చాలామంది అభిలాష. ఇప్పటికే ఈ ఆశలు ఉన్నవారు... Read more
Oct 08 | అసలే నవరాత్రి వేడుకలు.. అంతా ఉత్సాహంగా ఉన్నారు.. వీధి మధ్యలో గర్భా నృత్యం చేయడానికి ఏర్పాట్లు చేశారు. యువతులు, మహిళలతోపాటు పురుషులూ బాగా రెడీ అయి వచ్చేశారు. కానీ డ్యాన్స్ మొదలుపెట్టగానే కరెంటు పోయింది.... Read more
Oct 08 | తిరుమలలో భక్త జన సందోహం పెరిగింది. దసరా పండగ తరువాత పండగ సెలవులు ముగింపు దశకు చేరకుంటున్న తరుణంలో శ్రీవారి దర్శనం కోసం భక్తులో పోటెత్తారు. సెలవులతో కూడిన వారాంతం కావడంతో భక్తులు పెద్ద... Read more
Oct 08 | దేశవ్యాప్తంగా వాహనాల రిజిస్ట్రేషన్ కు ఒకటే సిరీస్ అయిన బీహెచ్ విషయంలో కేంద్ర రవాణా శాఖ నిబంధనలను సడలించనుంది. దేశవ్యాప్తంగా ప్రతీ రాష్ట్రానికి విడిగా ఒక రిజిస్ట్రేషన్ విధానం నడుస్తోంది. తెలంగాణ అయితే టీఎస్... Read more
Oct 07 | ప్రముఖ ప్రవచనకర్త గరికపాటి నరసింహరావు ఇటీవల మెగాస్టార్ చిరంజీవిపై చేసిన వ్యాఖ్యలు దుమారాన్ని రేపుతున్నాయి. మెగాఫాన్స్ మహాపండితుడు గరికపాటిపై నెట్టింట్లో ట్రోల్ చేస్తున్నారు. ఇక దీనికి మెగాబ్రదర్ నాగబాబు చేసిన ట్వీట్ కూడా తోడు... Read more