ప్రశాంతంగా ఉన్న హైదరాబాద్లో అల్లర్లు సృష్టించేందుకు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కుట్ర పన్నుతున్నారని తెలంగాణమంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ ఆరోపించారు. ఇరు రాష్ట్రాల ప్రజల మధ్య విద్వేశాలు రెచ్చగొట్టి హైదరాబాద్లో రాష్ట్ర పునర్విభజన చట్టంలోని సెక్షన్ 8ని అమలు చేసేందుకు ప్రయత్నిస్తున్నారని తెలిపారు. రేవంత్రెడ్డి ముడుపుల వ్యవహారంలో కేసు తన మెడకు చుట్టుకుంటుందని బాబు ఊహించలేదన్నారు. తీరా ఈ కేసు ఆయన మెడకు చుట్టుకోవడంతో దాన్ని నుండి తప్పించుకోవడానికి సెక్షన్ 8 అమలు కోసం పట్టు పడుతున్నారని మంత్రి విమర్శించారు. ఈ మేరకు మంగళవారం సచివాలయంలో ఆయన విలేకరులతో మాట్లాడుతూ పదవి రావడం కాదు.. బుద్ధి, జ్ఞానాన్ని పెంచుకోవాలన్నారు. మెడకు చుట్టుకున్న కేసు నుండి ఏదోవిధంగా బయట పడేందుకు చంద్రబాబు విద్వేశాలు రెచ్చగొడుతూ కొత్త సమస్యలకు ఆజ్యం పోస్తున్నారని విమర్శించారు.
హైదరాబాద్ లో శాంతిభద్రతల సమస్య ఎక్కడా లేదని , సెక్షన్ 8 అమలు చేయాల్సిన అవసరం ఏమాత్రం లేదని ఆయన స్పష్టం చేశారు. రాష్ట్ర విభజన జరిగిన ఏడాది కాలంలో హైదరాబాద్లో ఎలాంటి ఘర్షణలు చోటు చేసుకోలేదన్నారు. ఓటుకు నోటు కేసు తరువాతనే తెలంగాణలో ఆధ్రప్రదేశ్ ప్రజలకు రక్షణ లేకుండా పోయిందా అని ఆయన ప్రశ్నించారు. ఈ చిల్లర రాజకీయాలు మానుకోవాలని తెలిపారు. హైదరాబాద్లో అన్ని ప్రాంతాల ప్రజలు సంతోషంగా జీవిస్తున్నారని, ముఖ్యంగా ఆంధ్ర ప్రజలకు ఇబ్బందులున్నట్లు ఎక్కడా ఫిర్యాదు లేవని, ఈ తరుణంలో సెక్షన్ 8 అమలు జరపాల్సిన అవసరం లేదన్నారు. తమ ప్రభుత్వం సెక్షన్ 8కు లోబడే నడుచుకుంటుందని తెలిపారు. చంద్రబాబుకు నోటీసులు ఇవ్వాల్సి వస్తే మెడలు వంచైనా నోటీసులు ఇచ్చేందుకు వెనకాడమన్నారు. చట్టం ముందు అధికారం పని చేయదన్నారు. ఆంధ్ర ప్రజలను గాలికొదిలేసి, ఇక్కడ ఎపి ప్రభుత్వ పెద్దలు రాజభోగాలు అనుభవిస్తున్నారని , ఎపి మంత్రులు, ఎమ్మెల్యేల్లో 70శాతం మంది హైదరాబాద్ లోనే ఉంటున్నారని ఆయన ఆరోపించారు. వారందరికీ తెలంగాణ ప్రభుత్వమే భద్రత కల్పిస్తుందన్నారు.
*అభినవచారి*
(And get your daily news straight to your inbox)
Aug 22 | అమెరికా అందరికీ ఒక డ్రీమ్. మరీ ముఖ్యంగా ఇంజనీరింగ్ పూర్తి చేసిన మన దేశవాసులకు అందులోనూ తెలుగువారికి అగ్రరాజ్యంలోకి అడుగుపెట్టి.. అక్కడ ఉద్యోగం సంపాదించి, స్థిరపడాలన్నది చాలామంది అభిలాష. ఇప్పటికే ఈ ఆశలు ఉన్నవారు... Read more
Oct 08 | అసలే నవరాత్రి వేడుకలు.. అంతా ఉత్సాహంగా ఉన్నారు.. వీధి మధ్యలో గర్భా నృత్యం చేయడానికి ఏర్పాట్లు చేశారు. యువతులు, మహిళలతోపాటు పురుషులూ బాగా రెడీ అయి వచ్చేశారు. కానీ డ్యాన్స్ మొదలుపెట్టగానే కరెంటు పోయింది.... Read more
Oct 08 | తిరుమలలో భక్త జన సందోహం పెరిగింది. దసరా పండగ తరువాత పండగ సెలవులు ముగింపు దశకు చేరకుంటున్న తరుణంలో శ్రీవారి దర్శనం కోసం భక్తులో పోటెత్తారు. సెలవులతో కూడిన వారాంతం కావడంతో భక్తులు పెద్ద... Read more
Oct 08 | దేశవ్యాప్తంగా వాహనాల రిజిస్ట్రేషన్ కు ఒకటే సిరీస్ అయిన బీహెచ్ విషయంలో కేంద్ర రవాణా శాఖ నిబంధనలను సడలించనుంది. దేశవ్యాప్తంగా ప్రతీ రాష్ట్రానికి విడిగా ఒక రిజిస్ట్రేషన్ విధానం నడుస్తోంది. తెలంగాణ అయితే టీఎస్... Read more
Oct 07 | ప్రముఖ ప్రవచనకర్త గరికపాటి నరసింహరావు ఇటీవల మెగాస్టార్ చిరంజీవిపై చేసిన వ్యాఖ్యలు దుమారాన్ని రేపుతున్నాయి. మెగాఫాన్స్ మహాపండితుడు గరికపాటిపై నెట్టింట్లో ట్రోల్ చేస్తున్నారు. ఇక దీనికి మెగాబ్రదర్ నాగబాబు చేసిన ట్వీట్ కూడా తోడు... Read more