తెలుగు రాష్ట్రాల మధ్య చోటు చేసుకున్న పరిణామాలు కొత్త మలుపులు తిరుగుతున్నాయి. ఇప్పటికే హైదరాబాద్ లో సెక్షన్-8 ను అమలు చెయ్యాలని డిమాండ్ చేస్తున్న ఏపి ప్రభుత్వం తాజాగా తన స్ట్రాటజీని మార్చిందా లేదా తెలంగాణ సర్కార్ అతిగా చేస్తుందా అనే అనుమానాలు కలుగుతున్నాయి. తాజాగా హైదరాబాద్ లోని అమీర్ పేట్, ఎస్ఆర్ నగర్ లోని మెన్స్ హాస్టల్లలో నగర పోలీసులు కార్డాన్ సెర్చ్ నిర్వహించడం చర్చనీయాంశంగా మారింది. ఆంధ్రప్రాంత యువకులు ఎక్కువ మంది ఉంటారని భావించే ప్రాంతాల్లోని హాస్టళ్లమీద దాడులు నిర్వహించడం అనేది ప్రాధాన్యం సంతరించుకుంటున్నది. అయితే గత కొంత కాలంగా చార్మినార్ ఘటన తర్వాత పోలీసులు కార్డాన్ సెర్చ్ నిర్వహిస్తున్నా కానీ తాజా సెర్చ్ మాత్రం వార్తల్లో నిలుస్తోంది.
తెలుగు రాష్ట్రాల మధ్య పచ్చగడ్డి వేసినా మండేలా ఉంది పరిస్థితి. అయితే హైదరాబాద్ లో ఉంటున్న సీమాంధ్రులకు రక్షణ లేకుండా పోయిందని కాబట్టి విభజన చట్టంలోని సెక్షన్ 8ను అమలు చెయ్యాలని ఏఫి ప్రభుత్వం ప్రధానంగా డిమాండ్ చేస్తోంది. అందులో భాగంగా ప్రధానిని, గవర్నర్ ను కలిసిన చంద్రబాబు తగిన విధంగా హామీ పొందలేకపోయారని అందుకే ప్లాన్ మార్చినట్లు తెలంగాణ అధికారులు అనుకుంటున్నారు. హైదరాబాదులో అల్లర్లను సృష్టించడానికి చంద్రబాబునాయుడు ప్రయత్నిస్తున్నారని, ఆంధ్ర ప్రాంతంనుంచి అల్లరిమూకలను నగరానికి తరలిస్తున్నట్లు విశ్వసనీయ సమాచారం ఉన్నదని ప్రభుత్వ పెద్దలు ప్రకటించారు. అయితే హైదరాబాద్ లో అల్లర్లు జరిగితే శాంతి భద్రతలకు ఇక్కడ గ్యారెంటీ లేదని ముందే చెప్పాం కాబట్టి ఇప్పటికైనా సెక్షన్ 8ను అమలు చెయ్యండి అని ఏపి ప్రభుత్వం వత్తిడి తీసుకురావాలని ప్రయత్నిస్తోందని తెలంగాణ ప్రభుత్వం చర్చించుకుంటోంది.
అందులో బాగంగానే ఆ:ధ్రా యూత్ ఎక్కువగా ఉండే అమీర్ పేట్, ఎస్ఆర్ నగర్ ప్రాంతాల్లోని మెన్స్ హాస్టల్స్ పై పోలీసులు కార్డాన్ సెర్చ నిర్వహించారు. అయితే ఈ సెర్చ్కు ఎలాంటి ప్రత్యేకత లేదని, శాంతిభద్రతల కోసం నిర్వహించే రెగ్యులర్ సెర్చ్ లాంటిదేనని పోలీసులు చెబుతున్నారు. సరైన ఆధారాలు చూపించలేని 21 మందిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. సౌత్జోన్ డీసీపీ వెంకటేశ్వరరావు ఆధ్వర్యంలో 15 ఇన్స్పెక్టర్లు, 40 మంది ఎస్సైలు, 300 మంది పోలీసులు 40 బృందాలుగా మొత్తం ఈ సెర్చ్లో పాల్గొనడం విశేషం. తాజాగా అమీర్ పేట్, ఎస్ఆర్ నగర్ లో జరిగిన కార్డాన్ సెర్చ్ ఎలాంటి పరిణామాలకు దారి తీస్తుందో చూడాలి.
*అభినవచారి*
(And get your daily news straight to your inbox)
Aug 22 | అమెరికా అందరికీ ఒక డ్రీమ్. మరీ ముఖ్యంగా ఇంజనీరింగ్ పూర్తి చేసిన మన దేశవాసులకు అందులోనూ తెలుగువారికి అగ్రరాజ్యంలోకి అడుగుపెట్టి.. అక్కడ ఉద్యోగం సంపాదించి, స్థిరపడాలన్నది చాలామంది అభిలాష. ఇప్పటికే ఈ ఆశలు ఉన్నవారు... Read more
Oct 08 | అసలే నవరాత్రి వేడుకలు.. అంతా ఉత్సాహంగా ఉన్నారు.. వీధి మధ్యలో గర్భా నృత్యం చేయడానికి ఏర్పాట్లు చేశారు. యువతులు, మహిళలతోపాటు పురుషులూ బాగా రెడీ అయి వచ్చేశారు. కానీ డ్యాన్స్ మొదలుపెట్టగానే కరెంటు పోయింది.... Read more
Oct 08 | తిరుమలలో భక్త జన సందోహం పెరిగింది. దసరా పండగ తరువాత పండగ సెలవులు ముగింపు దశకు చేరకుంటున్న తరుణంలో శ్రీవారి దర్శనం కోసం భక్తులో పోటెత్తారు. సెలవులతో కూడిన వారాంతం కావడంతో భక్తులు పెద్ద... Read more
Oct 08 | దేశవ్యాప్తంగా వాహనాల రిజిస్ట్రేషన్ కు ఒకటే సిరీస్ అయిన బీహెచ్ విషయంలో కేంద్ర రవాణా శాఖ నిబంధనలను సడలించనుంది. దేశవ్యాప్తంగా ప్రతీ రాష్ట్రానికి విడిగా ఒక రిజిస్ట్రేషన్ విధానం నడుస్తోంది. తెలంగాణ అయితే టీఎస్... Read more
Oct 07 | ప్రముఖ ప్రవచనకర్త గరికపాటి నరసింహరావు ఇటీవల మెగాస్టార్ చిరంజీవిపై చేసిన వ్యాఖ్యలు దుమారాన్ని రేపుతున్నాయి. మెగాఫాన్స్ మహాపండితుడు గరికపాటిపై నెట్టింట్లో ట్రోల్ చేస్తున్నారు. ఇక దీనికి మెగాబ్రదర్ నాగబాబు చేసిన ట్వీట్ కూడా తోడు... Read more