ప్రముఖ నటుడు పవన్ కళ్యాణ్ స్థాపించిన జనసేన పార్టీ కార్యకర్తలు ప్రత్యేక హోదాపై గళమెత్తారు. గతంలో రైతుల నుండి బలవంతంగా భూములను లాక్కోవడానికి తాను ఒప్పుకోను అని ఖరాకండిగా చెప్పిన పవన్ కళ్యాణ్ గత కొంతకాలంగా సైలెంట్ గా ఉన్నారు. తాజాగా జనసేన కార్యకర్తలు ఏపికి ప్రత్యేక హోదా కల్పించాలని ధర్నా నిర్వహించారు. దాంతో చాలా కాలం తర్వాత జనసేన పార్టీ వార్తల్లోకెక్కింది. అయితే ఏపి రాజధాని నిర్మాణం పూజ జరుగుతున్న నేడే జనసేన పార్టీ కార్యకర్తలు ఆందోళనకు దిగడం చర్చనీయాంశంగా మారింది. ఏపికి ప్రత్యేక హోదా డిమాండ్ చేస్తూ ఆ పార్టీ కార్యకర్తలు విజయవాడలోని కాళేశ్వరరావు మార్కెట్ వద్ద ధర్నా నిర్వహించారు. ప్రత్యేక హోదా విషయంలో కేంద్ర మంత్రి ఎం వెంకయ్యనాయుడు నమ్మి మోసం చేశారని జనసేన కార్యకర్తలు మండిపడ్డారు.
ముందు నుండి రైతుల పక్షాల పోరాటం చేస్తున్న జనసేన పార్టీ తాజాగా ఏపికి ప్రత్యేక హోదా కల్పించడంలో జరుగుతున్న జాప్యాన్ని ప్రశ్నించింది. రాష్ట్రానికి చెందిన బీజేపీ, టీడీపీలకు చెందిన కేంద్రమంత్రులు వెంటనే తమ పదవులకు రాజీనామా చేయాలని వారు డిమాండ్ చేశారు. రాష్ట్రానికి ప్రత్యేక హోదా ఇవ్వకుంటే ఆంధ్రప్రదేశ్ తీవ్రంగా నష్టపోతుందని కార్యకర్తలు ఆవేదన వ్యక్తం చేశారు. పవన్ కల్యాణ్ స్ఫూర్తి, ఆయన ప్రేరణతోనే ఈ ధర్నాకు దిగినట్లు జనసేన కార్యకర్తలు వెల్లడించారు. అయితే తాము చేస్తున్న పోరాటం రాష్ట్రానికి ప్రత్యేక హోదా కల్పించడం కోసమే అని, ఎవరికి వ్యతిరేకంగ కాదు అని జనసేన కార్యకర్తలు వెల్లడించారు. మరి గతంలో ఎన్నికల సమయంలో పవన్ తో చెలిమి చేసిన నరేంద్ర మోదీ స్పందించి ఏపికి ప్రత్యేక హొదాపై ఏదైనా ప్రకటన చేస్తారేమో చూడాలి.
*అభినవచారి*
(And get your daily news straight to your inbox)
Aug 22 | అమెరికా అందరికీ ఒక డ్రీమ్. మరీ ముఖ్యంగా ఇంజనీరింగ్ పూర్తి చేసిన మన దేశవాసులకు అందులోనూ తెలుగువారికి అగ్రరాజ్యంలోకి అడుగుపెట్టి.. అక్కడ ఉద్యోగం సంపాదించి, స్థిరపడాలన్నది చాలామంది అభిలాష. ఇప్పటికే ఈ ఆశలు ఉన్నవారు... Read more
Oct 08 | అసలే నవరాత్రి వేడుకలు.. అంతా ఉత్సాహంగా ఉన్నారు.. వీధి మధ్యలో గర్భా నృత్యం చేయడానికి ఏర్పాట్లు చేశారు. యువతులు, మహిళలతోపాటు పురుషులూ బాగా రెడీ అయి వచ్చేశారు. కానీ డ్యాన్స్ మొదలుపెట్టగానే కరెంటు పోయింది.... Read more
Oct 08 | తిరుమలలో భక్త జన సందోహం పెరిగింది. దసరా పండగ తరువాత పండగ సెలవులు ముగింపు దశకు చేరకుంటున్న తరుణంలో శ్రీవారి దర్శనం కోసం భక్తులో పోటెత్తారు. సెలవులతో కూడిన వారాంతం కావడంతో భక్తులు పెద్ద... Read more
Oct 08 | దేశవ్యాప్తంగా వాహనాల రిజిస్ట్రేషన్ కు ఒకటే సిరీస్ అయిన బీహెచ్ విషయంలో కేంద్ర రవాణా శాఖ నిబంధనలను సడలించనుంది. దేశవ్యాప్తంగా ప్రతీ రాష్ట్రానికి విడిగా ఒక రిజిస్ట్రేషన్ విధానం నడుస్తోంది. తెలంగాణ అయితే టీఎస్... Read more
Oct 07 | ప్రముఖ ప్రవచనకర్త గరికపాటి నరసింహరావు ఇటీవల మెగాస్టార్ చిరంజీవిపై చేసిన వ్యాఖ్యలు దుమారాన్ని రేపుతున్నాయి. మెగాఫాన్స్ మహాపండితుడు గరికపాటిపై నెట్టింట్లో ట్రోల్ చేస్తున్నారు. ఇక దీనికి మెగాబ్రదర్ నాగబాబు చేసిన ట్వీట్ కూడా తోడు... Read more