ఏపి రాజధాని భూమి పూజ కార్యక్రమం ఎంతో అంగరంగ వైభవంగా సాగింది. ఏపి ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, తన కుటుంబ సభ్యులతో కలిసి రాజధాని భూమి పూజను నిర్వహించారు. రాజధాని నిర్మాణానికి భూములు ఇచ్చిన దాతలను ఈ సందర్భంగా గుర్తుచేసుకున్నారు. అయితే గతంలో ఎంతో కష్టపడి.. అభివృద్ది చేసిన హైదరాబాద్ కు ఏపి దూరమైంది. మరి కొత్తగా నిర్మిస్తున్న ఏపి రాజధానిని కూడా ఎవరైనా సొంతం చేసుకుంటే.. ? దాన్ని కూడా ఎవరైనా లాక్కుంటే..? ఎంతో కష్టపడి నిర్మించడానికి, చరిత్రలో నిలిచేలా నిర్మిస్తున్న రాజధాని కూడా ఏపికి దక్కకుండా పోతే..? ఇవి ఓ పదేళ్ల చిన్నారికి వచ్చిన డౌట్స్. రాజధాని భూమి పూజ సందర్భంగా అడిగిన ప్రశ్నలు అక్కడికి వచ్చని అందరిని ఆలోచింపచేసింది.
ఏపి రాజధాని భూమి పూజకు తిరుపతి నుండి ఏకంగా స్కేటింగ్ చేసుకుంటూ వచ్చిన ఓ చిన్నారి తను సేవ్ చేసిన డబ్బులను రాజధాని నిర్మాణం కోసం తీసుకువచ్చింది. తిరుపతి నుండి అమరావతి వరకు వచ్చిన ఆ చిన్నారిని చంద్రబాబు ప్రశంసించారు. ఓ చిన్నారి చేస్తున్న కృషిని ఆయన మెచ్చుకున్నారు. సింగపూర్ లాంటి రాజధానిని నిర్మించాలని ఆ చిన్నారి కోరారు. అయితే చిన్నారిని మాట్లాడమని చంద్రబాబు కోరగా ఆ చిన్నారి ఒకే నిమిషం మాట్లాడింది. అయితే సింగపూర్ లాంటి రాజధానిని నిర్మించాలని కోరడమూ కాకుండా.. హైదరాబాద్ లాగా ఎవరూ లాక్కుపోకుండా కాపాడాలని కూడా చిన్నారి చంద్రబాబును కోరింది. దాంతో చంద్రబాబు చాలా ముచ్చట పడ్డారు. సభలో ఉన్న వాళ్లు అంతా ఒక్క నిమిషం పాటు చప్పట్లతో అభినందించారు. మరి నిజంగా అమరావతిని కూడా ఎవరైనా లాక్కుంటారా..? అంటే సమాధానం ఎవరికీ తెలియదు. కానీ అమరావతిని మాత్రం అంతర్జాతీయ స్థాయిలొ నిర్మించడం మాత్రం ఖచ్చితంగా సాధ్యమే.
*అభినవచారి*
(And get your daily news straight to your inbox)
Aug 22 | అమెరికా అందరికీ ఒక డ్రీమ్. మరీ ముఖ్యంగా ఇంజనీరింగ్ పూర్తి చేసిన మన దేశవాసులకు అందులోనూ తెలుగువారికి అగ్రరాజ్యంలోకి అడుగుపెట్టి.. అక్కడ ఉద్యోగం సంపాదించి, స్థిరపడాలన్నది చాలామంది అభిలాష. ఇప్పటికే ఈ ఆశలు ఉన్నవారు... Read more
Oct 08 | అసలే నవరాత్రి వేడుకలు.. అంతా ఉత్సాహంగా ఉన్నారు.. వీధి మధ్యలో గర్భా నృత్యం చేయడానికి ఏర్పాట్లు చేశారు. యువతులు, మహిళలతోపాటు పురుషులూ బాగా రెడీ అయి వచ్చేశారు. కానీ డ్యాన్స్ మొదలుపెట్టగానే కరెంటు పోయింది.... Read more
Oct 08 | తిరుమలలో భక్త జన సందోహం పెరిగింది. దసరా పండగ తరువాత పండగ సెలవులు ముగింపు దశకు చేరకుంటున్న తరుణంలో శ్రీవారి దర్శనం కోసం భక్తులో పోటెత్తారు. సెలవులతో కూడిన వారాంతం కావడంతో భక్తులు పెద్ద... Read more
Oct 08 | దేశవ్యాప్తంగా వాహనాల రిజిస్ట్రేషన్ కు ఒకటే సిరీస్ అయిన బీహెచ్ విషయంలో కేంద్ర రవాణా శాఖ నిబంధనలను సడలించనుంది. దేశవ్యాప్తంగా ప్రతీ రాష్ట్రానికి విడిగా ఒక రిజిస్ట్రేషన్ విధానం నడుస్తోంది. తెలంగాణ అయితే టీఎస్... Read more
Oct 07 | ప్రముఖ ప్రవచనకర్త గరికపాటి నరసింహరావు ఇటీవల మెగాస్టార్ చిరంజీవిపై చేసిన వ్యాఖ్యలు దుమారాన్ని రేపుతున్నాయి. మెగాఫాన్స్ మహాపండితుడు గరికపాటిపై నెట్టింట్లో ట్రోల్ చేస్తున్నారు. ఇక దీనికి మెగాబ్రదర్ నాగబాబు చేసిన ట్వీట్ కూడా తోడు... Read more