ఓటుకు నోటు కేసులో తెలంగాణ ఎమ్మెల్యే రేవంత్ రెడ్డిని లోతుగా విచారించాలని, ఆయన పేర్కొన్న బాస్, ఎవరో తెలుసుకోవాలని అందచేత ఆయనను తమ కస్టడీకి అప్పగించాలని ఏసీబి అధికారులు దాఖలు చేసిన పిటీషన్ పై ఏసీబీ కోర్టు సానుకూలంగా స్పందించింది. ఏసీబి అధికారులు కోరినట్లు ఐదు రోజుల పాటు కాకుండా కేవలం నాలుగు రోజుల పాటు మాత్రమే కస్టడీ న్యాయస్థానం అనుమతినిచ్చింది. శుక్రవారం సాయంత్రం ఏసీబీ కోర్టు ఈ మేరకు తీర్పు వెలువరించింది. శనివారం నుంచి నాలుగు రోజుల పాటు ఏసీబీ అధికారులు రేవంత్ రెడ్డిని విచారించనున్నారు.
రేవంత్ రెడ్డిని నాలుగు రోజులూ ఉదయం 9 గంటల నుంచి సాయంత్రం 5:30 గంటల వరకు కస్టడీలోకి తీసుకుంటారు. అయితే ప్రతిరోజు రేవంత్ రెడ్డిని కస్టడీలోకి తీసుకున్నా.. న్యాయవాది సమక్షంలోనే అతడిని ప్రశ్నించాలని న్యాయస్థానం షరుతు విధించింది. ఈ కేసులో రేవంత్ రెడ్డితో పాటు నిందితులుగా ఉన్న సెబాస్టియన్, ఉదయ్ సింహాలను కస్టడీకి అప్పగించారు. కస్టడి ముగిశాక నిందితులను మేజిస్ట్రేట్ ముందు హాజరు పరచాలని న్యాయస్థానం ఆదేశించింది. కాగా ఈ నెల 8వ తేదీన రేవంత్ రెడ్డి బెయిల్ పిటీషన్ కూడా విచారణకు రానుంది. తెలంగాణ ఎమ్మెల్సీ ఎన్నికల సందర్భంగా నామినేటెడ్ ఎమ్మెల్యే స్టీఫెన్కు ముడుపులు ఇస్తూ రేవంత్ రెడ్డి రెడ్ హ్యాండెడ్గా ఏసిబీకి పట్టుబడిన సంగతి తెలిసిందే.
అయితే ఈ నాలుగు రోజుల పాటు తనను అదుపులో తీసుకుని ప్రశ్నించనున్న ఏసీబి అధికారులకు రేవంత్ రెడ్డి నిజాలను వెల్లడిస్తాడా..? లేదా..?. ఏసీబీ అధికారులు దర్యాప్తుకు రేవంత్ సహకరిస్తాడా లేదా..? టీఆర్ఎస్ నామినేటెడ్ ఎమ్మెల్యే స్టీఫెన్ తో భేటీలో భాగంగా బాస్ అని ఆయన ఎవరిని సంబోధించాడు..? బాబు అంటే చంద్రబాబా..? లేక మరెవరు..? రేవంత్ రెడ్డితీ ఎవరు ఈ పని చేయించారు..? రేవంత్ రెడ్డి పీకపై కత్తి పెట్టినంత రిస్క్ ఎలా అయ్యింది.? ఈ మొత్తం ఎపిసోడ్ కు కర్త, కర్మ, క్రియ అదేనండి.. డైరెక్షన్ ఎవరు..? అన్న వివరాలను ఏసీబి రాబట్టగలుగుతుందా..? అందుకు రేవంత్ సహరిస్తాడా..? అన్నది వేచి చూడాల్సిందే.
జి. మనోహర్
(And get your daily news straight to your inbox)
Aug 22 | అమెరికా అందరికీ ఒక డ్రీమ్. మరీ ముఖ్యంగా ఇంజనీరింగ్ పూర్తి చేసిన మన దేశవాసులకు అందులోనూ తెలుగువారికి అగ్రరాజ్యంలోకి అడుగుపెట్టి.. అక్కడ ఉద్యోగం సంపాదించి, స్థిరపడాలన్నది చాలామంది అభిలాష. ఇప్పటికే ఈ ఆశలు ఉన్నవారు... Read more
Oct 08 | అసలే నవరాత్రి వేడుకలు.. అంతా ఉత్సాహంగా ఉన్నారు.. వీధి మధ్యలో గర్భా నృత్యం చేయడానికి ఏర్పాట్లు చేశారు. యువతులు, మహిళలతోపాటు పురుషులూ బాగా రెడీ అయి వచ్చేశారు. కానీ డ్యాన్స్ మొదలుపెట్టగానే కరెంటు పోయింది.... Read more
Oct 08 | తిరుమలలో భక్త జన సందోహం పెరిగింది. దసరా పండగ తరువాత పండగ సెలవులు ముగింపు దశకు చేరకుంటున్న తరుణంలో శ్రీవారి దర్శనం కోసం భక్తులో పోటెత్తారు. సెలవులతో కూడిన వారాంతం కావడంతో భక్తులు పెద్ద... Read more
Oct 08 | దేశవ్యాప్తంగా వాహనాల రిజిస్ట్రేషన్ కు ఒకటే సిరీస్ అయిన బీహెచ్ విషయంలో కేంద్ర రవాణా శాఖ నిబంధనలను సడలించనుంది. దేశవ్యాప్తంగా ప్రతీ రాష్ట్రానికి విడిగా ఒక రిజిస్ట్రేషన్ విధానం నడుస్తోంది. తెలంగాణ అయితే టీఎస్... Read more
Oct 07 | ప్రముఖ ప్రవచనకర్త గరికపాటి నరసింహరావు ఇటీవల మెగాస్టార్ చిరంజీవిపై చేసిన వ్యాఖ్యలు దుమారాన్ని రేపుతున్నాయి. మెగాఫాన్స్ మహాపండితుడు గరికపాటిపై నెట్టింట్లో ట్రోల్ చేస్తున్నారు. ఇక దీనికి మెగాబ్రదర్ నాగబాబు చేసిన ట్వీట్ కూడా తోడు... Read more