ఎమ్మెల్యేకు లంచం ఇస్తూ పట్టుబడిన ఎమ్మెల్సే రేవంత్ రెడ్డికి 14 రోజుల జ్యుడిషియల్ కస్టడీ విధిస్తూ ఏసీబీ కోర్టు న్యాయమూర్తి లక్ష్మీపతి ఆదేశాలు జారీచేశారు.దీంతో రేవంత్ సహా మరో ఇద్దరు నిందితులను చర్లపల్లి జైలుకు తరలించేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. ఈ ఉదయం ఎనిమిది గంటలకు బంజారాహిల్స్లోని ఏసీబీ కోర్టు న్యాయమూర్తి లక్ష్మీపతి నివాసానికి రేవంత్ను తీసుకొచ్చిన అధికారలు సంబంధిత పత్రాలతో సహా ముగ్గురు నిందితులను న్యాయమూర్తి ముందుంచారు. ఎఫ్ఐఆర్ లో మొత్తం నలుగురు నిందితుల్ని చేర్చిన ఏసీబీ.. రేవంత్ రెడ్డిని ఏ1గా, సెబాస్టియన్ను ఏ2గా పేర్కొన్నారు. ఏ3గా ఉదయ్ని, ఏ4గా మ్యాథ్యూస్ను చేర్చారు.
అయితే తెలంగాణ ఎమ్మెల్సీ ఎన్నికల్లో రేవంత్ రెడ్డి తన ఓటు హక్కను వినియోగించుకునే అవకాశాన్ని కల్పిస్తు జడ్జీ ఆదేశాలు జారీ చేశారు. తనకు ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఓటు వేసే హక్కు ఉందని గట్టిగా వాదించడంతో జడ్జీ దీని మీద లిఖిత పూర్వంగా రాసివ్వాలని కోరారు. దాంతో రేవంత్ రెడ్డి తరఫున లాయర్లు వెంటనే తెల్లటి కాగితంపై రేవంత్ రెడ్డి తరఫున ఓటు హక్కు వినియోగించుకునే అవకాశం కల్పించాలని కోరారు. రేవంత్ రెడ్డి అభ్యర్తనను స్వీకరించిన జడ్జ్ ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఒటు హక్కు వినియోగించుకోవచ్చని తేల్చారు. అయితే కోర్టు నుండి నేరుగా అసెంబ్లీ కే తీసుకువెళతారా..? అన్నది పోలీసులు నిర్ణయించాలి. మొత్తానికి ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఓటు వేసిన తర్వాత 14 రోజులు రిమాండ్ కు వెళ్లనున్నారు రేవంత్ రెడ్డి.
*అభినవచారి*
(And get your daily news straight to your inbox)
Aug 22 | అమెరికా అందరికీ ఒక డ్రీమ్. మరీ ముఖ్యంగా ఇంజనీరింగ్ పూర్తి చేసిన మన దేశవాసులకు అందులోనూ తెలుగువారికి అగ్రరాజ్యంలోకి అడుగుపెట్టి.. అక్కడ ఉద్యోగం సంపాదించి, స్థిరపడాలన్నది చాలామంది అభిలాష. ఇప్పటికే ఈ ఆశలు ఉన్నవారు... Read more
Oct 08 | అసలే నవరాత్రి వేడుకలు.. అంతా ఉత్సాహంగా ఉన్నారు.. వీధి మధ్యలో గర్భా నృత్యం చేయడానికి ఏర్పాట్లు చేశారు. యువతులు, మహిళలతోపాటు పురుషులూ బాగా రెడీ అయి వచ్చేశారు. కానీ డ్యాన్స్ మొదలుపెట్టగానే కరెంటు పోయింది.... Read more
Oct 08 | తిరుమలలో భక్త జన సందోహం పెరిగింది. దసరా పండగ తరువాత పండగ సెలవులు ముగింపు దశకు చేరకుంటున్న తరుణంలో శ్రీవారి దర్శనం కోసం భక్తులో పోటెత్తారు. సెలవులతో కూడిన వారాంతం కావడంతో భక్తులు పెద్ద... Read more
Oct 08 | దేశవ్యాప్తంగా వాహనాల రిజిస్ట్రేషన్ కు ఒకటే సిరీస్ అయిన బీహెచ్ విషయంలో కేంద్ర రవాణా శాఖ నిబంధనలను సడలించనుంది. దేశవ్యాప్తంగా ప్రతీ రాష్ట్రానికి విడిగా ఒక రిజిస్ట్రేషన్ విధానం నడుస్తోంది. తెలంగాణ అయితే టీఎస్... Read more
Oct 07 | ప్రముఖ ప్రవచనకర్త గరికపాటి నరసింహరావు ఇటీవల మెగాస్టార్ చిరంజీవిపై చేసిన వ్యాఖ్యలు దుమారాన్ని రేపుతున్నాయి. మెగాఫాన్స్ మహాపండితుడు గరికపాటిపై నెట్టింట్లో ట్రోల్ చేస్తున్నారు. ఇక దీనికి మెగాబ్రదర్ నాగబాబు చేసిన ట్వీట్ కూడా తోడు... Read more