ప్రభుత్వాలు, పాలకులు చెబుతున్న మాటలన్నీ అబల పరిరక్షణ విషయంలో నీటి మూటలుగానే మిగులుతున్నాయి. తెలంగానలో ఓ కామాంధుడు ముక్కుపచ్చలారని బాలికను విద్యుత్ సబ్స్టేషన్లో నిర్బంధించి రెండు రోజుల పాటు అత్యాచారానికి పాల్పడిన ఘటన మెదక్ జిల్లా పుల్కల్లో జరిగింది. వివరాల్లోకి వెళ్తే.. పుల్కల్లోని స్థానిక విద్యుత్ సబ్స్టేషన్లో ఆపరేటర్గా పనిచేస్తున్న తోఫిక్(24) శుక్రవారం సంగారెడ్డి మండలం పోతిరెడ్డిపల్లికి చెందిన 12 ఏళ్ల బాలికను బైక్పై సబ్స్టేషన్కు తీసుకొచ్చి నిర్బంధించి పలుమార్లు అత్యాచారం చేశాడు. శనివారం ఆమెను విడిచిపెట్టాడు. అక్కడి నుంచి పోతిరెడ్డిపల్లిలోని తన ఇంటికి చేరుకున్న బాలికను తల్లిదండ్రులు ప్రశ్నించడంతో ఆమె విషయం చెప్పింది. దీంతో బాలికను తీసుకుని తల్లిదండ్రులు రాత్రి 11 గంటలకు పుల్కల్ పోలీస్ స్టేషన్కు వచ్చి ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు ఆదివారం ఉదయం సంగారెడ్డి ప్రభుత్వ ఆస్పత్రిలో బాధితురాలికి వైద్య పరీక్షలు జరిపించారు. కాగా నిందితుడు పరారీలో ఉన్నాడు.
బంధువును పరామర్శించేందుకు ఆస్పత్రికి వెళ్లిన ఓ మహిళపై ఇద్దరు ఉద్యోగులు లైంగికదాడికి పాల్పడ్డారు. కోల్కతాలోని ఓ ఆస్పత్రిలో ఈ ఘటన జరిగింది. పశ్చిమబెంగాల్లోని ముషీరాబాద్ జిల్లాకు చెందిన ఓ యువతి శుక్రవారం కోల్కతా వచ్చింది. తన బంధువును పరామర్శించేందుకు ఆస్పత్రికి వెళ్లింది. ఈ రోజు రాత్రి ఆస్పత్రిలో పనిచేసే లిఫ్ట్మన్, మరో ఉద్యోగి ఆమెపై అత్యాచారానికి పాల్పడ్డారు. బాధితురాలి ఫిర్యాదు మేరకు నిందితులు మసూమ్ అలీ ఖాన్, హైదర్ అలీని పోలీసులు అరెస్ట్ చేశారు. ఈ ఘటనతో ఆస్పత్రిలో పనిచేసే మహిళా సిబ్బంది, మహిళా రోగులు భయపడుతున్నారు. మహిళలకు భద్రతకు తగిన చర్యలు తీసుకోవాలని కోరారు.
జి మనోహర్
(And get your daily news straight to your inbox)
Aug 22 | అమెరికా అందరికీ ఒక డ్రీమ్. మరీ ముఖ్యంగా ఇంజనీరింగ్ పూర్తి చేసిన మన దేశవాసులకు అందులోనూ తెలుగువారికి అగ్రరాజ్యంలోకి అడుగుపెట్టి.. అక్కడ ఉద్యోగం సంపాదించి, స్థిరపడాలన్నది చాలామంది అభిలాష. ఇప్పటికే ఈ ఆశలు ఉన్నవారు... Read more
Oct 08 | అసలే నవరాత్రి వేడుకలు.. అంతా ఉత్సాహంగా ఉన్నారు.. వీధి మధ్యలో గర్భా నృత్యం చేయడానికి ఏర్పాట్లు చేశారు. యువతులు, మహిళలతోపాటు పురుషులూ బాగా రెడీ అయి వచ్చేశారు. కానీ డ్యాన్స్ మొదలుపెట్టగానే కరెంటు పోయింది.... Read more
Oct 08 | తిరుమలలో భక్త జన సందోహం పెరిగింది. దసరా పండగ తరువాత పండగ సెలవులు ముగింపు దశకు చేరకుంటున్న తరుణంలో శ్రీవారి దర్శనం కోసం భక్తులో పోటెత్తారు. సెలవులతో కూడిన వారాంతం కావడంతో భక్తులు పెద్ద... Read more
Oct 08 | దేశవ్యాప్తంగా వాహనాల రిజిస్ట్రేషన్ కు ఒకటే సిరీస్ అయిన బీహెచ్ విషయంలో కేంద్ర రవాణా శాఖ నిబంధనలను సడలించనుంది. దేశవ్యాప్తంగా ప్రతీ రాష్ట్రానికి విడిగా ఒక రిజిస్ట్రేషన్ విధానం నడుస్తోంది. తెలంగాణ అయితే టీఎస్... Read more
Oct 07 | ప్రముఖ ప్రవచనకర్త గరికపాటి నరసింహరావు ఇటీవల మెగాస్టార్ చిరంజీవిపై చేసిన వ్యాఖ్యలు దుమారాన్ని రేపుతున్నాయి. మెగాఫాన్స్ మహాపండితుడు గరికపాటిపై నెట్టింట్లో ట్రోల్ చేస్తున్నారు. ఇక దీనికి మెగాబ్రదర్ నాగబాబు చేసిన ట్వీట్ కూడా తోడు... Read more