డబ్బులు రాజకీయాలను శాసిస్తున్నాయంటే దానికి చంద్రబాబే కారణమని తెలంగాణ ఉప ముఖ్యమంత్రి కడియం శ్రీహరి అన్నారు. రాజకీయాలను కలుషితం చేయడం బాబుకు వెన్నతో పెట్టిన విద్య అని చెప్పారు. రేవంత్ రెడ్డి అరెస్టుపై స్పందించిన ఆయన.. రాష్ట్రవతరణకు ముందు ఆ తరువాత కూడా అడుగడునా ప్రతీ రోజు తెలంగాణను అన్ని విధాలుగా దెబ్బకొట్టాలని చంద్రబాబు కుట్రలు చేస్తూనే ఉన్నారని ఆరోపించారు. టీఆర్ఎస్ అభ్యర్థులను ఓడించాలనే కుట్రతో తాజాగా ఆయన అనుంగు శిష్యుడు రేవంత్ రెడ్డిని రంగంలోకి దించాడని, పాపం ఆయన ప్రయత్నం బెడిసి కొట్టి ఏసీబి అధికారులు పట్టుబడ్డాడని తెలిపారు. తెలంగాణలో ఇక చంద్రబాబు ప్రయోగాలు నడవవని ఆ ప్రయోగాలు మానుకుంటే మంచిదని హితవు పలికారు. ఎర్రబెల్లి దయాకర్ రావు ఏ ముఖం పెట్టుకుని డీజీపీని కలిసేందుకు వెళ్లారో తనకు అర్ధం కావడం లేదని చెప్పారు. అసలు పోలీసులకు ఎర్రబెల్లినే సమాచారం అందించి రేవంత్ రెడ్డిని అరెస్టు చేయించారేమోనని తనకు అనుమానం కలుగుతోందని చెప్పారు.
టీడీపీ ఎమ్మెల్యేలను తెలంగాణలోని అధికార పార్టీ గొర్రెల్లా పశువుల్లా కొంటుందని మహానాడులో ఆరోపణలు చేసిన టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు ఇప్పుడేం సమాధానం చెప్తారని టీఆర్ఎస్ నేత తలసాని శ్రీనివాస్ యాదవ్ ప్రశ్నించారు. దొంగే.. దొంగ దొంగ అన్నట్లు ఉందని చెప్పారు. ఎమ్మెల్యే స్టీఫెన్కు లంఛం ఇస్తుండగా అవినీతి నిరోధకశాఖ పోలీసులు టీడీపీ నేత రేవంత్ రెడ్డిని అరెస్టుపై స్పందించారు. ప్రజస్వామ్యం సిగ్గుతో తలదించుకునేలా టీడీపీ వ్యవహారం ఉందని చెప్పారు. చంద్రబాబు కంటే నీచుడెవరూ ఉండరని, ఎర్రబెల్లి ఏక్ నెంబర్ దొంగ అని తలసాని తీవ్రంగా మండిపడ్డారు. రేవంత్ రెడ్డి విషయంలో అధికారపార్టీ కుట్ర చేసిందని టీడీపీ చేస్తున్న ఆరోపణలు ఆయన కొట్టిపారేశారు. క్యాంపులో ఉన్న రేవంత్ రెడ్డి బయటకు ఎందుకు వెళ్లారని ప్రశ్నించారు.
జి. మనోహర్
(And get your daily news straight to your inbox)
Aug 22 | అమెరికా అందరికీ ఒక డ్రీమ్. మరీ ముఖ్యంగా ఇంజనీరింగ్ పూర్తి చేసిన మన దేశవాసులకు అందులోనూ తెలుగువారికి అగ్రరాజ్యంలోకి అడుగుపెట్టి.. అక్కడ ఉద్యోగం సంపాదించి, స్థిరపడాలన్నది చాలామంది అభిలాష. ఇప్పటికే ఈ ఆశలు ఉన్నవారు... Read more
Oct 08 | అసలే నవరాత్రి వేడుకలు.. అంతా ఉత్సాహంగా ఉన్నారు.. వీధి మధ్యలో గర్భా నృత్యం చేయడానికి ఏర్పాట్లు చేశారు. యువతులు, మహిళలతోపాటు పురుషులూ బాగా రెడీ అయి వచ్చేశారు. కానీ డ్యాన్స్ మొదలుపెట్టగానే కరెంటు పోయింది.... Read more
Oct 08 | తిరుమలలో భక్త జన సందోహం పెరిగింది. దసరా పండగ తరువాత పండగ సెలవులు ముగింపు దశకు చేరకుంటున్న తరుణంలో శ్రీవారి దర్శనం కోసం భక్తులో పోటెత్తారు. సెలవులతో కూడిన వారాంతం కావడంతో భక్తులు పెద్ద... Read more
Oct 08 | దేశవ్యాప్తంగా వాహనాల రిజిస్ట్రేషన్ కు ఒకటే సిరీస్ అయిన బీహెచ్ విషయంలో కేంద్ర రవాణా శాఖ నిబంధనలను సడలించనుంది. దేశవ్యాప్తంగా ప్రతీ రాష్ట్రానికి విడిగా ఒక రిజిస్ట్రేషన్ విధానం నడుస్తోంది. తెలంగాణ అయితే టీఎస్... Read more
Oct 07 | ప్రముఖ ప్రవచనకర్త గరికపాటి నరసింహరావు ఇటీవల మెగాస్టార్ చిరంజీవిపై చేసిన వ్యాఖ్యలు దుమారాన్ని రేపుతున్నాయి. మెగాఫాన్స్ మహాపండితుడు గరికపాటిపై నెట్టింట్లో ట్రోల్ చేస్తున్నారు. ఇక దీనికి మెగాబ్రదర్ నాగబాబు చేసిన ట్వీట్ కూడా తోడు... Read more