టైటిల్ చదవగానే ఏదో స్పెల్లింగ్ మిస్టేక్ అనుకుంటున్నారేమో అస్సలు కాదు. అక్షరాల నూటికి నూరు శాతం వాస్తవం. ప్రధాని నరేంద్ర మోదీ వల్లల ఓ లేడీ ఆఫీసర్ ఇబ్బందుల పాలవుతోంది. పాపం అమ్మడు పరిస్థితి డిఫరెంట్ గా మారింది. అప్పటి దాకా సాఫీగా సాగిన జీవితం మోదీ చేసిన ఓఫోన్ కాల్ ఇబ్బందులు పెడుతోందట. ఇంతకీ విషయం ఏంటంటే అనగనగా ఓ లేడీ పోలీస్ ఆఫీసర్. ఎంతో నిజాయితీ గత వ్యక్తి ఆమె పేరు నమితా సాహు. సినిమాల్లో చూపించినట్లు ఒంటరిగా రౌడీలు, గుండాల తుగ్గురేక్కొడుతూ లోకల్ రౌడీలకు, గుండాలకు నిద్ర లేకుండా చేసేది. ఈ లేడీ ఆఫీసర్ ను అక్కడి వారు లేడీ సింగం అని కూడా పిలుస్తుంటారు. అయితే తర్వాత తర్వాత పరిస్థితి మారిపోయింది. ఒక్క ఫోన్ కాల్ ఆమె జీవితాన్ని మార్చింది. ఇంతకీ నరేంద్ర మోదీకి, నమిత కు ఏంటీ సంబందం అన్న విషయాలు తెలుసుకోవాలంటే స్టోరీ చదవాల్సిందే.
భోపాల్ లో సబ్ ఇన్పెక్టర్ గా పని చేస్తోంది నమితా సాహు. లోకల్ గా లేడీ సింగం అని పేరున్న నమిత రౌడీలకు సింహ స్వప్నంలా మారింది. అయితే ప్రధానిగా నరేంద్ర మోదీ ప్రమాణ స్వీకారం తర్వాత.. మరి మోదీకి ఈ లేడీ సింగం గురించి ఎలా తెలిసిందో కానీ ఆమెతో ఓ సారి ఫోన్ లో మాట్లాడాలని అనుకున్నారు. అంతే ప్రధాని ఆఫీస్ నుండి ఆమెకు, మీడియాకు సమాచారం అందింది. దాంతో ఆ ఆపీసర్ గురించి మీడియాలో వార్తలు వచ్చాయి. మోదీ తో మాట్లాడటం గురించి పక్కన బెట్టి మీడియా పుణ్యమా అని అమ్మడుకు పాపులారిటీ బాగా వచ్చింది. దాంతో ఎక్కడికి వెళ్లినా ఒకటే గోళ.. ఆటోగ్రాఫ్ లు, , ఫోటోలు అంటూ అందరూ హడావిడి చేస్తున్నారట. అంతేకాకుండా తనపై ఆపీసర్లు కూడా తన మీద జలస్ ఉన్నారని, దాంతో తన డ్యుటీ సరిగ్గా చెయ్యాలేకపోతున్నానని తెగ బాధపడుతోంది నమిత. పాపం సదుద్దేశంతో మోదీ ఫోన్ చేసినా ఆ లేడి సింగానికి మాత్రం కష్టాలు వచ్చిపడ్డాయ్. మంచి చెయ్యబోతే చెడు ఎదురైనట్లు ఉంది నమిత, మోదీల వ్యవహారం.
*అభినవచారి*
(And get your daily news straight to your inbox)
Aug 22 | అమెరికా అందరికీ ఒక డ్రీమ్. మరీ ముఖ్యంగా ఇంజనీరింగ్ పూర్తి చేసిన మన దేశవాసులకు అందులోనూ తెలుగువారికి అగ్రరాజ్యంలోకి అడుగుపెట్టి.. అక్కడ ఉద్యోగం సంపాదించి, స్థిరపడాలన్నది చాలామంది అభిలాష. ఇప్పటికే ఈ ఆశలు ఉన్నవారు... Read more
Oct 08 | అసలే నవరాత్రి వేడుకలు.. అంతా ఉత్సాహంగా ఉన్నారు.. వీధి మధ్యలో గర్భా నృత్యం చేయడానికి ఏర్పాట్లు చేశారు. యువతులు, మహిళలతోపాటు పురుషులూ బాగా రెడీ అయి వచ్చేశారు. కానీ డ్యాన్స్ మొదలుపెట్టగానే కరెంటు పోయింది.... Read more
Oct 08 | తిరుమలలో భక్త జన సందోహం పెరిగింది. దసరా పండగ తరువాత పండగ సెలవులు ముగింపు దశకు చేరకుంటున్న తరుణంలో శ్రీవారి దర్శనం కోసం భక్తులో పోటెత్తారు. సెలవులతో కూడిన వారాంతం కావడంతో భక్తులు పెద్ద... Read more
Oct 08 | దేశవ్యాప్తంగా వాహనాల రిజిస్ట్రేషన్ కు ఒకటే సిరీస్ అయిన బీహెచ్ విషయంలో కేంద్ర రవాణా శాఖ నిబంధనలను సడలించనుంది. దేశవ్యాప్తంగా ప్రతీ రాష్ట్రానికి విడిగా ఒక రిజిస్ట్రేషన్ విధానం నడుస్తోంది. తెలంగాణ అయితే టీఎస్... Read more
Oct 07 | ప్రముఖ ప్రవచనకర్త గరికపాటి నరసింహరావు ఇటీవల మెగాస్టార్ చిరంజీవిపై చేసిన వ్యాఖ్యలు దుమారాన్ని రేపుతున్నాయి. మెగాఫాన్స్ మహాపండితుడు గరికపాటిపై నెట్టింట్లో ట్రోల్ చేస్తున్నారు. ఇక దీనికి మెగాబ్రదర్ నాగబాబు చేసిన ట్వీట్ కూడా తోడు... Read more