మరో బాలీవుడ్ నటి అనుమానాస్పద స్థితిలో మృతి చెందారు. 2013లో బాలీవుడ్ లో తేరంగ్రేటం చేసిన నటి శిఖా జోషి.. తన బిఏ పాస్ చిత్రంతో బాలీవుడ్ ప్రేక్షకులకు సుపరిచితం అయ్యారు. దేశా ఆర్థిక రాజధాని ముంబైలోని వెర్సోవా ప్రాంతంలో తన అపార్టుమెంటులో కంఠం తెగిన స్థితిలో రక్తపు మడుగులో శవమై పడివున్నారు. ఈ అపార్టుమెంటులో మరో మహిళతో కలిసి నివసిస్తున్న అమె.. తనంతట తాను ఆత్మహత్య చేసుకుందా లేక ఎవరైనా హత్యచేశారా..? అన్న కోణంలో పోలీసులు కేసును నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.
శనివారం నాడు ఆమె స్నేహితురాలు స్నానపు గది తలుపులు వేసి ఉండటం గమనించింది. తలుపులు తెరవాలని శిఖాజోషికి సూచించింది. రెండు నిమిషాల్లో తలుపు తీస్తానని చెప్పిన సదరు నటి ఎంతకూ తలుపు తీయలేదు. దీంతో అనుమానం వచ్చిన ఆమె పోలీసులకు తెలిపారు. లోపలకు వెళ్లి చూడగా ఆమె గొంతులోకి కత్తి దిగి, రక్తపు మడుగులో కనిపించింది. ఆనుమానాస్పద మృతిగా పోలీసులు కేసు నమోదు చేసుకున్నారు. కాగా శిఖా జోషి తనకు తాను బాత్ రూంలో లాక్ చేసుకుందని, ఆమె వద్ద అప్పుడు కత్తి ఉందని పోలీసులు చెప్పారు.
ఆ తర్వాత ఆమె రూమ్మేట్ బాత్ రూం గదిని తట్టారు. బయటకు రావాలని ఆమెకు సూచించింది. కత్తి వెంట తీసుకు వెళ్లిన విషయం తెలిసి.. వెంట కత్తి ఎందుకు తీసుకు వెళ్లావని సదరు స్నేహితురాలు ప్రశ్నించింది. అయితే, ఆ తర్వాత పోలీసులకు సమాచారం ఇచ్చింది. బాత్ రూం గది తెరిచేసరికి రక్తపు మడుగులో పడి ఉంది. ఆమెను వెంటనే ఆసుపత్రికి తరలించారు. అప్పటికే ఆమె మృతి చెందినట్లు వైద్యులు చెప్పారు. శిఖా జోషి మెడ పైన మూడు గాయాలు ఉన్నట్లుగా పోలీసులు గుర్తించారని తెలుస్తోంది.
జి మనోహర్
(And get your daily news straight to your inbox)
Aug 22 | అమెరికా అందరికీ ఒక డ్రీమ్. మరీ ముఖ్యంగా ఇంజనీరింగ్ పూర్తి చేసిన మన దేశవాసులకు అందులోనూ తెలుగువారికి అగ్రరాజ్యంలోకి అడుగుపెట్టి.. అక్కడ ఉద్యోగం సంపాదించి, స్థిరపడాలన్నది చాలామంది అభిలాష. ఇప్పటికే ఈ ఆశలు ఉన్నవారు... Read more
Oct 08 | అసలే నవరాత్రి వేడుకలు.. అంతా ఉత్సాహంగా ఉన్నారు.. వీధి మధ్యలో గర్భా నృత్యం చేయడానికి ఏర్పాట్లు చేశారు. యువతులు, మహిళలతోపాటు పురుషులూ బాగా రెడీ అయి వచ్చేశారు. కానీ డ్యాన్స్ మొదలుపెట్టగానే కరెంటు పోయింది.... Read more
Oct 08 | తిరుమలలో భక్త జన సందోహం పెరిగింది. దసరా పండగ తరువాత పండగ సెలవులు ముగింపు దశకు చేరకుంటున్న తరుణంలో శ్రీవారి దర్శనం కోసం భక్తులో పోటెత్తారు. సెలవులతో కూడిన వారాంతం కావడంతో భక్తులు పెద్ద... Read more
Oct 08 | దేశవ్యాప్తంగా వాహనాల రిజిస్ట్రేషన్ కు ఒకటే సిరీస్ అయిన బీహెచ్ విషయంలో కేంద్ర రవాణా శాఖ నిబంధనలను సడలించనుంది. దేశవ్యాప్తంగా ప్రతీ రాష్ట్రానికి విడిగా ఒక రిజిస్ట్రేషన్ విధానం నడుస్తోంది. తెలంగాణ అయితే టీఎస్... Read more
Oct 07 | ప్రముఖ ప్రవచనకర్త గరికపాటి నరసింహరావు ఇటీవల మెగాస్టార్ చిరంజీవిపై చేసిన వ్యాఖ్యలు దుమారాన్ని రేపుతున్నాయి. మెగాఫాన్స్ మహాపండితుడు గరికపాటిపై నెట్టింట్లో ట్రోల్ చేస్తున్నారు. ఇక దీనికి మెగాబ్రదర్ నాగబాబు చేసిన ట్వీట్ కూడా తోడు... Read more