శుభముహూర్తానికి సమయం ఆసన్నమైంది. దేశ సర్వోన్నత న్యాయస్థానంలో అపీలుపై కొంత నైరాశ్యం మదిలో వున్నా.. ప్రత్యర్థులకు దడిచి పదవిని చేపట్టలేదన్న ప్రతిపక్షాల విమర్శలను బలంగా ఎదుర్కోనేందుకే.. పడిలేచిన కెరటం మాదిగా అమె ముందుకు సాగాలని నిర్ణయం తీసుకుంది. ఏఐడీఎంకే ఎమ్మెల్యేలు ఎంతో ఆసక్తితో ఎదురుచూస్తున్న తరణం రానే వచ్చింది. అక్రమాస్థుల కేసుతో ముఖ్యమంత్రి పదవికితో పాటు పార్టీ పదవులకు దూరమైన అధినేత్రి ఐదవ సారి తమిళనాడు ముఖ్యమంత్రిగా ప్రమాణస్వీకారం చేయడానికి రంగం సిద్దమైంది. ఎవరి గురించి చెబుతున్నామో అర్థమైంది కదూ..!
ఇందుకోసం ఈనెల 22న ఉదయం ఏడు గంటలకు పార్టీ ప్రధాన కార్యాలయంతో పార్టీ ఎమ్మెల్యేలతో సమావేశాన్ని ఏర్పాటు చేసింది. ఈ సమావేశానికి ఎమ్మెల్యేలందరూ హాజరుకావాలని పార్టీ అధినేత్రి జయలలిత శుక్రవారం ఆదేశాలు జారీ చేశారు. ఇందుకు సంబంధించి ఆమె కార్యాలయం నుంచి ఓ ప్రకటన విడుదలైంది. అయితే సమావేశం ప్రధాన అజెండా ఏమిటనేదానిపై ప్రకటనలో ప్రస్తావించలేదు. దీంతో జయలలితను తిరిగి ముఖ్యమంత్రిగా ఎన్నుకోవడమే ఈ సమావేశం ప్రధాన ఉద్దేశమని రాజకీయవర్గాలు చర్చించుకుంటున్నాయి. ఈ నెల 23న శుభముహూర్తం వున్నందున, 22న పార్టీ ఎమ్మెల్యేలతో చర్చించిన పిదప అమె మళ్లీ ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేయనున్నారని పార్టీ వర్గాలు చెబుతున్నాయి.
కర్ణాటక హైకోర్టు తీర్పుతో ఆదాయానికి మించిన ఆస్తుల కేసునుంచి నిర్దోషిగా బయటపడటంతో సీఎం పీఠాన్ని అధిరోహించేందుకు జయకు ఉన్న అడ్డంకులన్నీ తొలిగిపోయాయి. అయితే హైకోర్టు తీర్పుపై కర్ణాటక ప్రభుత్వం సుప్రీంకోర్టుకు అప్పీలు చేయనున్నట్లు వార్తలు రావడం, స్పెషల్ పబ్లిక్ ప్రాసిక్యూటర్ బీవీ ఆచార్య కూడా ఆ వార్తలను నిర్ధారించడంతో సీఎం పదవి చేపట్టేవిషయంలో జయలలిత పునరాలోచనలో పడ్డట్లు తెలిసింది. వచ్చే శుక్రవారం (22న) జరిగే సమావేశం తరువాత జయ పదవీస్వీకారానికి సంబంధించిన అన్ని విషయాలపై స్పష్టతవచ్చే అవకాశం ఉంది.
జి. మనోహర్
(And get your daily news straight to your inbox)
Aug 22 | అమెరికా అందరికీ ఒక డ్రీమ్. మరీ ముఖ్యంగా ఇంజనీరింగ్ పూర్తి చేసిన మన దేశవాసులకు అందులోనూ తెలుగువారికి అగ్రరాజ్యంలోకి అడుగుపెట్టి.. అక్కడ ఉద్యోగం సంపాదించి, స్థిరపడాలన్నది చాలామంది అభిలాష. ఇప్పటికే ఈ ఆశలు ఉన్నవారు... Read more
Oct 08 | అసలే నవరాత్రి వేడుకలు.. అంతా ఉత్సాహంగా ఉన్నారు.. వీధి మధ్యలో గర్భా నృత్యం చేయడానికి ఏర్పాట్లు చేశారు. యువతులు, మహిళలతోపాటు పురుషులూ బాగా రెడీ అయి వచ్చేశారు. కానీ డ్యాన్స్ మొదలుపెట్టగానే కరెంటు పోయింది.... Read more
Oct 08 | తిరుమలలో భక్త జన సందోహం పెరిగింది. దసరా పండగ తరువాత పండగ సెలవులు ముగింపు దశకు చేరకుంటున్న తరుణంలో శ్రీవారి దర్శనం కోసం భక్తులో పోటెత్తారు. సెలవులతో కూడిన వారాంతం కావడంతో భక్తులు పెద్ద... Read more
Oct 08 | దేశవ్యాప్తంగా వాహనాల రిజిస్ట్రేషన్ కు ఒకటే సిరీస్ అయిన బీహెచ్ విషయంలో కేంద్ర రవాణా శాఖ నిబంధనలను సడలించనుంది. దేశవ్యాప్తంగా ప్రతీ రాష్ట్రానికి విడిగా ఒక రిజిస్ట్రేషన్ విధానం నడుస్తోంది. తెలంగాణ అయితే టీఎస్... Read more
Oct 07 | ప్రముఖ ప్రవచనకర్త గరికపాటి నరసింహరావు ఇటీవల మెగాస్టార్ చిరంజీవిపై చేసిన వ్యాఖ్యలు దుమారాన్ని రేపుతున్నాయి. మెగాఫాన్స్ మహాపండితుడు గరికపాటిపై నెట్టింట్లో ట్రోల్ చేస్తున్నారు. ఇక దీనికి మెగాబ్రదర్ నాగబాబు చేసిన ట్వీట్ కూడా తోడు... Read more