మధ్యప్రదేశ్లోని బింద్ ప్రాంతంలో దారుణం చోటుచేసుకుంది. రెండు గ్యాంగుల మధ్య చోటుచేసుకున్న ఘర్షణల్లో ఓ గ్యాంగ్ కు చెందిన ముగ్గురు సభ్యలు మరో గ్యాంగ్ కు చెందిన వ్యక్తిని కాల్చి చంపారు. మధ్యప్రదేశ్ లోని భిండ్ జిల్లా ప్రభుత్వ ఆస్పత్రిలో ఈ ఘటన చోటుచేసుకుంది. ఈ ఘటన అక్కడి సిసీటీవీ ఫూటేజీల్లో రికార్డు అవ్వడం.. వాటినీ మీడియా సేకరించడంతో వ్యక్తి దారుణ హత్య సంచలనంగా మారింది. కాల్చిన వ్యక్తి నిక్కరు, బనీను ధరించి బక్క పలచగా ఉండగా.. కాల్పులకు గురైన వ్యక్తి టీషర్టు, జీన్సు ప్యాంటు ధరించి కాస్త బొద్దుగా ఉన్నాడు. నిరాయుధుడైన వ్యక్తి సాయుధుడైన వ్యక్తి నుంచి తప్పించుకునే క్రమంలో భిండ్ ప్రభుత్వాసుప్రతిలోకి వచ్చాడు. కాగా అద్దాల తలుపుల వెనక్కి వెళ్లి దాక్కున్నాడు. సాయుదుభై వ్యక్తిని నిలువరించేందుకు వీలుగా అద్దాల తులుపులను మూసివేశాడు.
దీంతో కోపోద్రిక్తుడైన సాయుధుడు అద్దంలోంచి అతని గుండెల మీద కాల్చాడు.దాంతో జీన్సు ప్యాంటు వ్యక్తి అక్కడికక్కడే రక్తపు మడుగులో కుప్పకూలిపోయాడు. ముందు వెనక్కి వెళ్లిపోయిన ఆగంతకుడు.. అనుమానంతో మళ్లీ వచ్చి, మరోసారి తలుపులు తెరిచి, వీపు మీద మరో రౌండు తుపాకితో కాల్చాడు. అతడు చనిపోయిన విషయాన్ని నిర్ధారించుకున్న తరువాత గాని అక్కడి నుంచి వెళ్లిపోలేదు. అయితే సీసీటీవీ ఫూటేజీని పరిశీలించిన పోలీసులు క్షతగాత్రడైన ఓ నిందితుడిని అదుపులోకి తీసుకుని గ్వాలియర్ ఆస్పత్రిలో చేర్చించి చికిత్స అందిస్తున్నారు. కాగా మరో ఇద్దరు నిందితులు పరారీలో వున్నారని, పోలీసులు తెలిపారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు. నిందితుల కోసం ప్రత్యేక టీమ్ లను ఏర్పాటు చేసినట్లు తెలిపారు.
జి. మనోహర్
(And get your daily news straight to your inbox)
Aug 22 | అమెరికా అందరికీ ఒక డ్రీమ్. మరీ ముఖ్యంగా ఇంజనీరింగ్ పూర్తి చేసిన మన దేశవాసులకు అందులోనూ తెలుగువారికి అగ్రరాజ్యంలోకి అడుగుపెట్టి.. అక్కడ ఉద్యోగం సంపాదించి, స్థిరపడాలన్నది చాలామంది అభిలాష. ఇప్పటికే ఈ ఆశలు ఉన్నవారు... Read more
Oct 08 | అసలే నవరాత్రి వేడుకలు.. అంతా ఉత్సాహంగా ఉన్నారు.. వీధి మధ్యలో గర్భా నృత్యం చేయడానికి ఏర్పాట్లు చేశారు. యువతులు, మహిళలతోపాటు పురుషులూ బాగా రెడీ అయి వచ్చేశారు. కానీ డ్యాన్స్ మొదలుపెట్టగానే కరెంటు పోయింది.... Read more
Oct 08 | తిరుమలలో భక్త జన సందోహం పెరిగింది. దసరా పండగ తరువాత పండగ సెలవులు ముగింపు దశకు చేరకుంటున్న తరుణంలో శ్రీవారి దర్శనం కోసం భక్తులో పోటెత్తారు. సెలవులతో కూడిన వారాంతం కావడంతో భక్తులు పెద్ద... Read more
Oct 08 | దేశవ్యాప్తంగా వాహనాల రిజిస్ట్రేషన్ కు ఒకటే సిరీస్ అయిన బీహెచ్ విషయంలో కేంద్ర రవాణా శాఖ నిబంధనలను సడలించనుంది. దేశవ్యాప్తంగా ప్రతీ రాష్ట్రానికి విడిగా ఒక రిజిస్ట్రేషన్ విధానం నడుస్తోంది. తెలంగాణ అయితే టీఎస్... Read more
Oct 07 | ప్రముఖ ప్రవచనకర్త గరికపాటి నరసింహరావు ఇటీవల మెగాస్టార్ చిరంజీవిపై చేసిన వ్యాఖ్యలు దుమారాన్ని రేపుతున్నాయి. మెగాఫాన్స్ మహాపండితుడు గరికపాటిపై నెట్టింట్లో ట్రోల్ చేస్తున్నారు. ఇక దీనికి మెగాబ్రదర్ నాగబాబు చేసిన ట్వీట్ కూడా తోడు... Read more