నేపాల్ తో పాటుగా చైనా, అఫ్ఠనిస్తాన్ సహా భారత్ ను సైతం భూ ప్రకంపనలు వణికించాయి. ఉత్తర భారతం మళ్లీ భయం గుప్పెట్లోకి జారుకుంది. ఢిల్లీ, బీహార్, బెంగాల్, ఉత్తరప్రదేశ్, ఝార్ఖండ్లలో మంగళవారం మధ్యాహ్నం సంభవించిన భూ ప్రకంపనలు ధాటికి ప్రజలు చిగురుటాకులా వణికిపోయారు. అరచేతిలో ప్రాణాలు పెట్టుకుని ఇళ్లనుంచి రోడ్ల మీదకు పరుగులు తీశారు. భూమి కంపించడం ప్రారంభం కావడంతోనే ఢిల్లీలో పై అంతస్తులలో నివసిస్తున్న ప్రజలు పరుగు పరుగున క్రిందికి వచ్చారు. కార్యాలయాలలో పనిచేస్తున్న ఉద్యోగులు కూడా భయకంపితులై బయటకు పరుగులు తీశారు. బీహార్లో భూకంప తీవ్రతకు 12 మంది మృతి చెందినట్లు తెలియవచ్చింది.
అఫ్ఘనిస్తాన్ కేంద్రంగా మంగళవారం ఈ భూ ప్రకంపనం చోటుచేసుకున్నట్టు ప్రాథమిక సమాచారం. భూమి ఉపరితలం నుంచి 19 కిలోమీటర్ల లోతులో భూమి కంపించినట్టు భూప్రకంపన అధ్యయన కేంద్ర నిపుణులు చెబుతున్నారు. కొన్ని చోట్ల భూమి 7.2 గా, మరికొన్నిచోట్ల 6.9 గా రిక్టర్ స్కేలుపై నమోదైంది. నేపాల్లో భూకంపం సంభవించిన కొద్ది రోజులకే మళ్లీ ఈ సంఘటన జరగడంతో దేశవ్యాప్తంగా ప్రజలు ఆందోళన చెందుతున్నారు. నేపాల్ దుర్ఘటన చోటుచేసుకున్నప్పటి నుంచి అప్పుడప్పుడు భారతవని వ్యాప్తంగా భూ ప్రకపంనలు చోటుచేసుకుంటున్నాయి.
ఈ పరిస్థితులలో ఏ క్షణాన ఏమవుతుందోనని ప్రజలు భయాందోళన చెందుతున్నారు. ఇవాళ సుమారుగా 60 సెకండ్ల పాటు భూప్రకంపనం సంభవించాయని ప్రత్యక్ష సాక్షులు చెబుతున్నారు. ఢిల్లీలో భూకంపం సంభవించిన నేపధ్యంలో సుప్రీం కోర్టులో ఈరోజు విచారణలు నిలిపివేశారు. అటు ఇటీవల సంభవించిన భూకంపం ధాటికి సుమారుగా 60 మందిని పొగోట్టుకున్న బీహార్ ఇవాళ మరోమారు పదిహేడు మంది ప్రాణాలను కొల్పయింది. ఢిల్లీ సహా ఉత్తరాది రాష్ట్రాల్లో భూమి తీవ్రంగా ప్రకంపించిందని, అపార నష్టం సూచనలు ఉన్నాయని ఢిల్లీ డిజాస్టర్ మేనేజ్మెంట్ కమిటీ తెలిపింది.
సహాయ చర్యలకు సిద్దంగా వుండాలని అదికారులకు ప్రధాని అదేశం
ఉత్తర భారతదేశాన్ని మరోసారి వణికించిన భూకంపం పై భారత ప్రధాని నరేంద్ర మోదీ ఎప్పటికప్పుడు తాజా సమాచారాన్ని తెలుసుకుంటున్నారు. భూకంపం వార్తల నేపథ్యంలో ఆయన అత్యవసర సమావేశాన్ని ఏర్పాటుచేశారు. తక్షణమే సహాయ, పునరావాస చర్యలు చేపట్టాల్సిందిగా సంబంధిత అధికారులకు ఆదేశాలు జారీచేశారు. ఢిల్లీలో పెద్ద ఎత్తున భూమి కంపించిందని, అపార నష్టం సంభవించే అవకాశాలున్నాయని ఢిల్లీ డిజాస్టర్ మేనేజ్ మెంట్ అధికారులు అంచనా వేస్తున్నారు. కాగా కేంద్ర హోం శాఖ మంత్రి రాజ్ నాథ్ సింగ్ భూ ప్రకంపనలపై ప్రధాని మోదీకి వివరించారు.
అనంతరం ఢిల్లీలో మీడియాతో మాట్లాడిన మంత్రి నేపాల్కు ఎలాంటి సహాయాన్నయినా అందించడానికి భారత్ సిద్ధంగా ఉందని హామీ ఇచ్చారు. దేశంలోని సంభవించిన భూకంపం ప్రమాదంపై ఆందోళన చెందాల్సిన అవసరం లేదన్నారు. ఎన్డీఆర్ఎఫ్ దళాలను అప్రమత్తం చేశామని కేంద్రమంత్రి చెప్పారు. కఠ్మాండు విమానాశ్రయంలో ప్రయాణీకులు ఆందోళనతో పరుగులు పెట్టారు. మంగళవారం సంభవించిన భూకంపంలో ఇప్పటికి నేపాల్లో 30మంది మృత్యువాత పడినట్లు సమాచారం.
జి. మనోహర్
(And get your daily news straight to your inbox)
Aug 22 | అమెరికా అందరికీ ఒక డ్రీమ్. మరీ ముఖ్యంగా ఇంజనీరింగ్ పూర్తి చేసిన మన దేశవాసులకు అందులోనూ తెలుగువారికి అగ్రరాజ్యంలోకి అడుగుపెట్టి.. అక్కడ ఉద్యోగం సంపాదించి, స్థిరపడాలన్నది చాలామంది అభిలాష. ఇప్పటికే ఈ ఆశలు ఉన్నవారు... Read more
Oct 08 | అసలే నవరాత్రి వేడుకలు.. అంతా ఉత్సాహంగా ఉన్నారు.. వీధి మధ్యలో గర్భా నృత్యం చేయడానికి ఏర్పాట్లు చేశారు. యువతులు, మహిళలతోపాటు పురుషులూ బాగా రెడీ అయి వచ్చేశారు. కానీ డ్యాన్స్ మొదలుపెట్టగానే కరెంటు పోయింది.... Read more
Oct 08 | తిరుమలలో భక్త జన సందోహం పెరిగింది. దసరా పండగ తరువాత పండగ సెలవులు ముగింపు దశకు చేరకుంటున్న తరుణంలో శ్రీవారి దర్శనం కోసం భక్తులో పోటెత్తారు. సెలవులతో కూడిన వారాంతం కావడంతో భక్తులు పెద్ద... Read more
Oct 08 | దేశవ్యాప్తంగా వాహనాల రిజిస్ట్రేషన్ కు ఒకటే సిరీస్ అయిన బీహెచ్ విషయంలో కేంద్ర రవాణా శాఖ నిబంధనలను సడలించనుంది. దేశవ్యాప్తంగా ప్రతీ రాష్ట్రానికి విడిగా ఒక రిజిస్ట్రేషన్ విధానం నడుస్తోంది. తెలంగాణ అయితే టీఎస్... Read more
Oct 07 | ప్రముఖ ప్రవచనకర్త గరికపాటి నరసింహరావు ఇటీవల మెగాస్టార్ చిరంజీవిపై చేసిన వ్యాఖ్యలు దుమారాన్ని రేపుతున్నాయి. మెగాఫాన్స్ మహాపండితుడు గరికపాటిపై నెట్టింట్లో ట్రోల్ చేస్తున్నారు. ఇక దీనికి మెగాబ్రదర్ నాగబాబు చేసిన ట్వీట్ కూడా తోడు... Read more