దేశాన్ని కుదిపేసిన 16 ఏళ్ల పంజాబ్ బాలిక హత్యోదంతం మరో నిర్భయ ఘటనగా పెను సంచలనంగా మారుతున్నా.. ఆ రాష్ట్ర మంత్రులు, అధికార అకాలీదళ్ పార్టీ నేతలు మాత్రం ఇంకితం లేకుండా మాట్లాడుతున్నారు. ప్రతిఫక్షంగా వున్నప్పుడు ప్రతీ చిన్న ఘటనపై స్పందించిన ప్రతిపక్షాలు.. అధికారంలో వున్నప్పుడు మాత్రం సామాజిక సృహను కూడా కోల్పోయి మాట్లాడుతున్నారు. పంజాబ్ లోని మోగాలో బాలిక, ఆమె తల్లిపై లైంగిక వేదింపులు, కదులుతున్న బస్సునుంచి కిందికి తోసివేసిన ఘటనను ప్రమాదఘటననని, దైవ సంకల్పం ఆ రాష్ట్ర మంత్రి అభివర్ణించారు.
నిత్యం ప్రమాదాలు జరుతూనే ఉంటాయి. బస్సులు, లారీలు, ఆటోలు.. అంతెందుకు.. విమానాలు కూడా కూలిపోతుంటాయని. ఇదికూడా అలాంటిదే.. ఆ అమ్మాయి మరణం దైవనిర్ణయమని బాధ్యతరహితంగా పంజాబ్ రాష్ట్ర విద్యామంత్రి సుర్జీత్ సింగ్ రఖ్రా వ్యాఖ్యలు చేశారు. ఇలా అని ఆయన తన స్వామి భక్తిని చాటుకుని తన మంత్రి పదవిని పథిలం చేసుకున్నారే తప్ప.. సామాజిక సృహతో ఆలోచించి మాట్లాడలేదు. ఇందుకు కారణం బస్సు సాక్షాత్తు పంజాబ్ ముఖ్యమంత్రి, అకాళీదళ్ అధినేత ప్రకాష్ సింగ్ బాదల్ కు కుటీంబికులకు చెందిన ఆర్బిట్ ఏవియేషన్ కు చెందినది కాబట్టి.
ఇక అక్కడే వున్న అధికార పార్టీ అకాలీదళ్ కే చెందిన మరో ఎమ్మెల్యే. ఈ విషయమై స్పందిస్తూ.. 'యాక్సిడెంట్లు చాలా జరుగుతూ ఉంటాయి. బాధితులకు ఇవ్వాల్సిన నష్టపరిహారమేదో ఇచ్చేస్తే సరి. కోర్టుకు వెళ్లకుండా ఆ సెటిల్మెంట్ చేసుకుంటే సరిపోద్దిగా' అని పైశాచిక చర్యను సమర్థించే ప్రయత్నం చేశారు. వీళ్లా నేతలు..? దేశ ప్రజల తలరాతలు మార్చే బాగ్యవిధాలు..? వీరికేనా మనం అధికారం కట్టబెట్టింది..? అదే తమ పార్టీ ప్రతిపక్షంలో వుంటే ఇలాంటి ఘటనలపై వారు ఇలాగే స్పందిస్తారా..? తమ బంధువుల అమ్మాయిలకో, సంబంధికులకో ఇలా ఘటనే ఎదురైతే వారు ఇలానే స్పందిస్తారా..? అత్యాచార యత్నాన్ని, లైంగిక వేదింపుల ఘటనలను ప్రమాద ఘటనలుగా మర్చి ప్రజలను తప్పుదోవ పట్టించగలరా..? అది వారి విజ్ఞతకే వదిలేయాలి.
బస్సు యజమాని ఎవరో తెలయదని ముక్తాయించిన పోలీసులు కూడా స్వామి భక్తిని చాటుకునేందుకు పోటీపడ్డారు. ఇక ఎఫ్ ఐఆర్ లో బస్సు యజమాని, పంజాబ్ ఉపముఖ్యమంత్రి సుఖ్బీర్ సింగ్ బాదల్ పేరును చేర్చనలేదు. దీనిపై బాధితురాలి తండ్రి మాట్లాడుతూ తనకు న్యాయం కావాలని డిమాండ్ చేశారు. సుఖ్బీర్ సింగ్ పేరును ఎఫ్ఐఆర్లో చేర్చగలిగేవారు.. ఈ ప్రపంచంలోనే లేరా?' అంటూ ఆవేదన వ్యక్తంచేశారు. కాగా లైంగికదాడి ఘటనలో మృతిచెందిన బాలిక దహన సంస్కారాలకు కుటుంబసభ్యులు నిరాకరించారు. రూ.50 లక్షల నష్టపరిహారం, కుటుంబంలో ఒకరికి ప్రభుత్వ ఉద్యోగంతోపాటు ఆర్బిల్ రవాణా సంస్థ అనుమతిని రద్దుచేయాలని బాలిక తల్లిదండ్రులు డిమాండ్ చేశారు.
అప్పటివరకు దహన సంస్కారాలు నిర్వహించబోమని, మృతదేహాన్ని ఆసుపత్రి మార్చురీలోనే ఉంచుతామని తేల్చిచెప్పారు. ప్రభుత్వం తీరును నిరసిస్తూ ఆప్, కాంగ్రెస్ పార్టీలు పెద్ద ఎత్తున నిరసనలకు పిలుపునిచ్చాయి. శనివారం పంజాబ్ వ్యాప్తంగా రైల్ రోకో చేపడుతున్నట్లు పంజాబ్ కాంగ్రెస్ పార్టీ ప్రకటించింది.లోక్సభలోనూ ఆమ్ ఆద్మీ పార్టీ, కాంగ్రెస్ సభ్యులు ఈ అంశాన్ని లేవనెత్తారు. ఘటనపై ఉన్నతస్థాయి దర్యాప్తు జరిపించాలని డిమాండ్ చేశాయి.
జి మనోహర్
(And get your daily news straight to your inbox)
Aug 22 | అమెరికా అందరికీ ఒక డ్రీమ్. మరీ ముఖ్యంగా ఇంజనీరింగ్ పూర్తి చేసిన మన దేశవాసులకు అందులోనూ తెలుగువారికి అగ్రరాజ్యంలోకి అడుగుపెట్టి.. అక్కడ ఉద్యోగం సంపాదించి, స్థిరపడాలన్నది చాలామంది అభిలాష. ఇప్పటికే ఈ ఆశలు ఉన్నవారు... Read more
Oct 08 | అసలే నవరాత్రి వేడుకలు.. అంతా ఉత్సాహంగా ఉన్నారు.. వీధి మధ్యలో గర్భా నృత్యం చేయడానికి ఏర్పాట్లు చేశారు. యువతులు, మహిళలతోపాటు పురుషులూ బాగా రెడీ అయి వచ్చేశారు. కానీ డ్యాన్స్ మొదలుపెట్టగానే కరెంటు పోయింది.... Read more
Oct 08 | తిరుమలలో భక్త జన సందోహం పెరిగింది. దసరా పండగ తరువాత పండగ సెలవులు ముగింపు దశకు చేరకుంటున్న తరుణంలో శ్రీవారి దర్శనం కోసం భక్తులో పోటెత్తారు. సెలవులతో కూడిన వారాంతం కావడంతో భక్తులు పెద్ద... Read more
Oct 08 | దేశవ్యాప్తంగా వాహనాల రిజిస్ట్రేషన్ కు ఒకటే సిరీస్ అయిన బీహెచ్ విషయంలో కేంద్ర రవాణా శాఖ నిబంధనలను సడలించనుంది. దేశవ్యాప్తంగా ప్రతీ రాష్ట్రానికి విడిగా ఒక రిజిస్ట్రేషన్ విధానం నడుస్తోంది. తెలంగాణ అయితే టీఎస్... Read more
Oct 07 | ప్రముఖ ప్రవచనకర్త గరికపాటి నరసింహరావు ఇటీవల మెగాస్టార్ చిరంజీవిపై చేసిన వ్యాఖ్యలు దుమారాన్ని రేపుతున్నాయి. మెగాఫాన్స్ మహాపండితుడు గరికపాటిపై నెట్టింట్లో ట్రోల్ చేస్తున్నారు. ఇక దీనికి మెగాబ్రదర్ నాగబాబు చేసిన ట్వీట్ కూడా తోడు... Read more