ISIS ఉగ్రవాదుల అరాచకం ప్రపంచవ్యాప్తంగా తెలిసిందే! మతతత్వ వ్యామోహంలో పడి చిన్నారులను సైతం అత్యంత దారుణంగా చంపుతున్న ఈ టెర్రరిస్టులు.. తమ ఉగ్రవాద సంస్థకు అన్నిదేశాల్లో వ్యాపించేలా ప్రణాళికలు మరింత వేగంగా పెంచుతున్నట్లు తెలుస్తోంది. ఇప్పటికే ఆఫ్ఘనిస్థాన్, పాకిస్థాన్ లో వీరి కార్యకలాపాలు వున్నాయి. అయితే.. గతంతో పోల్చుకుంటే ప్రస్తుతం ఈ ఉగ్రవాదుల కార్యకలాపాలు మరింత విస్తృతం అవుతున్నాయని.. ముఖ్యంగా సరిహద్దు ప్రాంతాల్లో వేగవంతం అవుతున్నాయని తెలిసింది. ఈ మేరకు సమాచారాన్ని రీసెర్చ్ అండ్ అనాలిసిస్ వింగ్ (రా) వెల్లడించింది.
పాక్, ఆఫ్ఘన్ సరిహద్దు ప్రాంతాల్లో ISIS ఉగ్రవాదుల కార్యకలాపాలు మరింత ఎక్కువగా పెరుగుతున్నాయని.. అవి భారత భద్రతకు ముప్పుగా పరిణమించే ప్రమాదం వుందని ‘రా’ అభిప్రాయపడింది. ఇరాక్ లో రెండవ అతిపెద్ద నగరంగా పేరున్న మోసుల్ నే అధీనంలోకి తీసుకున్న తర్వాత.. ISIS ఇతర దేశాల్లోనూ నెమ్మదిగా విస్తరిస్తోందని ఆ సంస్థ తెలిపింది. గతనెలలో ఆఫ్ఘన్ లో జరిగిన ఆత్మాహుతి దాడితో వారి జాడలు మరింత ఎక్కువగా పెరిగినట్లు స్పష్టంగా తెలుస్తోందని ‘రా’ తెలుపుతోంది. ఇదే విషయాన్ని ప్రధాని కార్యాలయానికి నివేదిక ద్వారా తెలిపిన ‘రా’.. ఈ వ్యవహారంలో ముందు జాగ్రత్తలు తీసుకుంటే మంచిదని సూచించింది.
ఇప్పటికే పాక్ ప్రేరేపిత ఉగ్రవాదంతో భారత్ ఎన్నో ఇబ్బందులను ఎదుర్కొంటున్న విషయం తెలిసిందే! ఇటువంటి సమయంలో ISIS కార్యకలాపాలు భారత్ లో జొరబడితే.. మరెన్నో మారణహోమాలు జరిగే అవకాశముందని ‘రా’ అభిప్రాయం వ్యక్తం చేసింది. అందుకే.. ఈ విషయంలో చాలా చాకచక్యంగా వ్యవహరించాల్సిందిగా ప్రధాని కార్యాలయానికి ఆ సంస్థ నివేదిక పంపింది.
AS
(And get your daily news straight to your inbox)
Aug 22 | అమెరికా అందరికీ ఒక డ్రీమ్. మరీ ముఖ్యంగా ఇంజనీరింగ్ పూర్తి చేసిన మన దేశవాసులకు అందులోనూ తెలుగువారికి అగ్రరాజ్యంలోకి అడుగుపెట్టి.. అక్కడ ఉద్యోగం సంపాదించి, స్థిరపడాలన్నది చాలామంది అభిలాష. ఇప్పటికే ఈ ఆశలు ఉన్నవారు... Read more
Oct 08 | అసలే నవరాత్రి వేడుకలు.. అంతా ఉత్సాహంగా ఉన్నారు.. వీధి మధ్యలో గర్భా నృత్యం చేయడానికి ఏర్పాట్లు చేశారు. యువతులు, మహిళలతోపాటు పురుషులూ బాగా రెడీ అయి వచ్చేశారు. కానీ డ్యాన్స్ మొదలుపెట్టగానే కరెంటు పోయింది.... Read more
Oct 08 | తిరుమలలో భక్త జన సందోహం పెరిగింది. దసరా పండగ తరువాత పండగ సెలవులు ముగింపు దశకు చేరకుంటున్న తరుణంలో శ్రీవారి దర్శనం కోసం భక్తులో పోటెత్తారు. సెలవులతో కూడిన వారాంతం కావడంతో భక్తులు పెద్ద... Read more
Oct 08 | దేశవ్యాప్తంగా వాహనాల రిజిస్ట్రేషన్ కు ఒకటే సిరీస్ అయిన బీహెచ్ విషయంలో కేంద్ర రవాణా శాఖ నిబంధనలను సడలించనుంది. దేశవ్యాప్తంగా ప్రతీ రాష్ట్రానికి విడిగా ఒక రిజిస్ట్రేషన్ విధానం నడుస్తోంది. తెలంగాణ అయితే టీఎస్... Read more
Oct 07 | ప్రముఖ ప్రవచనకర్త గరికపాటి నరసింహరావు ఇటీవల మెగాస్టార్ చిరంజీవిపై చేసిన వ్యాఖ్యలు దుమారాన్ని రేపుతున్నాయి. మెగాఫాన్స్ మహాపండితుడు గరికపాటిపై నెట్టింట్లో ట్రోల్ చేస్తున్నారు. ఇక దీనికి మెగాబ్రదర్ నాగబాబు చేసిన ట్వీట్ కూడా తోడు... Read more