అది ఇరాక్.. అక్కడ ప్రభుత్వానికి.. ఇరాక్ సిరియా దేశాల ఇస్లామిక్ స్టేట్ ఉగ్రవాదులకు మద్య గత కోన్నేళ్లుగా పోరు సాగుతోంది. ప్రభుత్వంతో పోరులో ఐఎస్ ఐఎస్ ఉగ్రవాదులు కీలక చమురు నిక్షేపాలున్న ప్రాంతాలను చేతబట్టుకున్ని.. ప్రపంచ అత్యంత సంపన్న ఉగ్రవాద సంస్థగా కూడా మారింది. ఇంత వరకు బాగానే వున్నా.. మత చందాసవాదం అతిగా వేళ్లూనుకున్న వీరిలో అందరినీ తమ మతంలోకి కలుపుకోవాలని.. ప్రపంచ వ్యాప్తంగా ఇతర మాతాలు వుండకూడదన్న దోరణిలో హింసాత్మక ఘటనలకు పాల్పడుతున్నారు.
ఎందుకు ఉగ్రవాద సంస్థకు ఆజ్యం పోశారన్న విషయాన్ని మర్చి.. పరమతస్థులను, ముస్లింలోని మైనార్టీ వర్గాలను టార్గెట్ గా చేసుకుని అకృత్యాలకు పాల్పడుతున్నారు,. ఇరాక్ లో ఈ సంస్థకు చెందిన ఉగ్రవాదులు సలుపుతున్న అఘాయిత్యాలు సభ్యసమాజం తీవ్ర దిగ్భ్రాంతి చెందేలా వున్నాయని సమాచారం. మతం గోప్పదనాన్ని చాటి.. తమ మతంలోకి ఆహ్వనించేవారిని చూసాం కానీ మతం మాటున మారణహోమం సృష్టిస్తున్న వీరి తీరు అత్యంత భయానకం. పరమతస్థులను వీరు అధీనంలోకి తీసుకుని వారిని బానిసలుగా మర్చుకుంటూ మరోమారు రాతి యుగం వైపు అడుగులు వేస్తున్నారు.
ఇటీవల వీరి నుంచి బంధ విముక్తులైన వారు.. వారనుభవించిన నరకాన్ని మీడియాకు తెలిపారు. 14, 15 ఏళ్ల వయస్సుండే పరమత అమ్మాయిలపై అనునిత్యం అత్యాచారాలు జరిపే వారు. బహిరంగంగానే వారిపై జరుగుతున్న అత్యాచారాల ఎదుర్కోన్న అమ్మాయిలు.. ఇదేనా నరకం అనేలా బాధ పడ్డారు. జీవం వున్న బోమ్మల మాదిరిగా తాము వారి అకృత్యాలను సహించాల్సి వచ్చిందని, వారు చిత్రహింసలు చెప్పనలవి కావని అబాగినులు విలపిస్తూ చెప్పారు. కొందరు అమ్మాయిలు తమపై జరుగుతున్న ఘోర కలిని భరించలేక ఆత్మహత్యలు కూడా చేసుకున్నారని వివరించారు.
గత ఏడాది అగస్టు మాసంలో ఇరాక్ లోని సింజర్ ప్రాంతాన్ని తమ కబంధ హస్తాలలోకి తీసుకున్న ఐఎస్ఐఎస్ ఉగ్రవాదులు.. ఆక్కడున్న యాజిది మహిళలను, పిల్లలను తమ బంధీలుగా చేసుకుని ఎనమిది నెలల తరువాత కొందరి విడుదల చేశారు. తమపై ఉగ్రవాదులు అత్యాచారాలకు తెగబడటంతో పాటు తమకు నచ్చిన వారికి బహుమానంగా కూడా ఇచ్చేవారని, అక్కడ కూడా తాము మానసికంగా, శారీరకంగా అనేక బాధలు పడాల్సి వచ్చిందని బాధితులు తెలిపారు.
జి. మనోహర్
(And get your daily news straight to your inbox)
Aug 22 | అమెరికా అందరికీ ఒక డ్రీమ్. మరీ ముఖ్యంగా ఇంజనీరింగ్ పూర్తి చేసిన మన దేశవాసులకు అందులోనూ తెలుగువారికి అగ్రరాజ్యంలోకి అడుగుపెట్టి.. అక్కడ ఉద్యోగం సంపాదించి, స్థిరపడాలన్నది చాలామంది అభిలాష. ఇప్పటికే ఈ ఆశలు ఉన్నవారు... Read more
Oct 08 | అసలే నవరాత్రి వేడుకలు.. అంతా ఉత్సాహంగా ఉన్నారు.. వీధి మధ్యలో గర్భా నృత్యం చేయడానికి ఏర్పాట్లు చేశారు. యువతులు, మహిళలతోపాటు పురుషులూ బాగా రెడీ అయి వచ్చేశారు. కానీ డ్యాన్స్ మొదలుపెట్టగానే కరెంటు పోయింది.... Read more
Oct 08 | తిరుమలలో భక్త జన సందోహం పెరిగింది. దసరా పండగ తరువాత పండగ సెలవులు ముగింపు దశకు చేరకుంటున్న తరుణంలో శ్రీవారి దర్శనం కోసం భక్తులో పోటెత్తారు. సెలవులతో కూడిన వారాంతం కావడంతో భక్తులు పెద్ద... Read more
Oct 08 | దేశవ్యాప్తంగా వాహనాల రిజిస్ట్రేషన్ కు ఒకటే సిరీస్ అయిన బీహెచ్ విషయంలో కేంద్ర రవాణా శాఖ నిబంధనలను సడలించనుంది. దేశవ్యాప్తంగా ప్రతీ రాష్ట్రానికి విడిగా ఒక రిజిస్ట్రేషన్ విధానం నడుస్తోంది. తెలంగాణ అయితే టీఎస్... Read more
Oct 07 | ప్రముఖ ప్రవచనకర్త గరికపాటి నరసింహరావు ఇటీవల మెగాస్టార్ చిరంజీవిపై చేసిన వ్యాఖ్యలు దుమారాన్ని రేపుతున్నాయి. మెగాఫాన్స్ మహాపండితుడు గరికపాటిపై నెట్టింట్లో ట్రోల్ చేస్తున్నారు. ఇక దీనికి మెగాబ్రదర్ నాగబాబు చేసిన ట్వీట్ కూడా తోడు... Read more