సత్యం కుంభకోణంలో సిబిఐ కోర్టు తన తుది తీర్పును వెల్లడించింది. ఎంతో కాలంగా పెండింగ్ లో ఉన్న సత్యం కుభకోణంలో దోషులకు కూడా కోర్ట్ శిక్ష ఖరారు చేసింది. సత్యం కంప్యూటర్స్ అధినేత రామలింగ రాజుకు ఏడు సంవత్సరాల సాధారణ జైలు శిక్ష, 5.50 కోట్ల జరిమానా విధించింది. రామరాజు, రామలింగ రాజులు మినహా మిగిలిన వారికి మాత్రం కేవలం 25 లక్షల జరిమానాను విధించింది కోర్ట్ . 2009 జనవరి 7న సత్యం కంభకోణం వెలుగు చూసిన సంగతి తెలిసిందే. 14 వేల కోట్ల కుంభకోణంలో మొత్తం 216 మంది సాక్షులను విచారించారు. 33 నెలల పాటు జైలులో ఉన్నాడు ప్రధాన నిందితుడు రామలింగ రాజు. సత్యం షేర్ వ్యాల్యూ ను కావాలని ఎక్కువ చేసి చూపించి, ఇన్వెస్టర్లను మోసం చేశారు రామలింగరాజు. దాదాపు 14వేల కోట్ల రూపాయల భారీ స్కాంలో సత్యం రామలింగరాజు ప్రధాన నిందితుడిగా కోర్ట్ పేర్కొంది.
రామలింగ రాజు, రామరాజు లకు చెరో 5.5 కోట్ల జరిమానా విధిస్తు కోర్ట్ తీర్పునిచ్చింది. సత్యం కేసులో 120పి, 409, 406, 467, 471, 477, 201 సెక్షన్ ల కింద శిక్ష ను వేసింది. ఒక్కో సెక్షన్ లో 10 నుండి 15 లక్షలు కలిపి 5.5 కోట్ల భారీ జరిమానాను విధించింది. కేసులో సాక్షులను తారుమారు చెయ్యడాన్ని కూడా కోర్టు పరిగణలోకి తీసుకుంది. అయితే ఏడు సంవత్సరాల శిక్ష పడటంతో రామలింగరాజుకు బెయిల్ దొరికే అవకాశాలు లేవు. అయితే సిబిఐ కోర్ట్ ఇచ్చిన తీర్పును సవాల్ చేస్తూ పై కోర్టుకు వెళ్లే అవకాశాలు కనిపిస్తున్నాయి. 2009 నుండి 2015 వరకు దాదాపు ఐదున్నర సంవత్సరాలు ఎన్నో మలుపులు తిరిగిన సత్యం కేసు చివరకు ఏడేళ్ల జైల్ శిక్ష తో పాటు భారీగా జరిమానా విధించింది. అయితే రామలింగరాజు తన శిక్షను తగ్గించాలని కోరినా కోర్టు మాత్రం పట్టించుకోలేదు. మాజీ సీఎఫ్వో వడ్లమాని శ్రీనివాస్, పీడబ్ల్యూసీ ఆడిటర్లు గోపాలకృష్ణన్, టీ శ్రీనివాస్, జీ రామకృష్ణ, డీ వెంకటపతిరాజు, సీహెచ్ శ్రీశైలం,ఆడిటర్ వీఎస్ ప్రభాకర్ గుప్తా లకు కూడా తల 25 లక్షల రూపాయల జరిమానా విధించారు. సత్యం కేసులో లక్షా 60 వేల పేజీల భారీ ఛార్జిషీట్ దాఖలైంది
- అభినవచారి
(And get your daily news straight to your inbox)
Aug 22 | అమెరికా అందరికీ ఒక డ్రీమ్. మరీ ముఖ్యంగా ఇంజనీరింగ్ పూర్తి చేసిన మన దేశవాసులకు అందులోనూ తెలుగువారికి అగ్రరాజ్యంలోకి అడుగుపెట్టి.. అక్కడ ఉద్యోగం సంపాదించి, స్థిరపడాలన్నది చాలామంది అభిలాష. ఇప్పటికే ఈ ఆశలు ఉన్నవారు... Read more
Oct 08 | అసలే నవరాత్రి వేడుకలు.. అంతా ఉత్సాహంగా ఉన్నారు.. వీధి మధ్యలో గర్భా నృత్యం చేయడానికి ఏర్పాట్లు చేశారు. యువతులు, మహిళలతోపాటు పురుషులూ బాగా రెడీ అయి వచ్చేశారు. కానీ డ్యాన్స్ మొదలుపెట్టగానే కరెంటు పోయింది.... Read more
Oct 08 | తిరుమలలో భక్త జన సందోహం పెరిగింది. దసరా పండగ తరువాత పండగ సెలవులు ముగింపు దశకు చేరకుంటున్న తరుణంలో శ్రీవారి దర్శనం కోసం భక్తులో పోటెత్తారు. సెలవులతో కూడిన వారాంతం కావడంతో భక్తులు పెద్ద... Read more
Oct 08 | దేశవ్యాప్తంగా వాహనాల రిజిస్ట్రేషన్ కు ఒకటే సిరీస్ అయిన బీహెచ్ విషయంలో కేంద్ర రవాణా శాఖ నిబంధనలను సడలించనుంది. దేశవ్యాప్తంగా ప్రతీ రాష్ట్రానికి విడిగా ఒక రిజిస్ట్రేషన్ విధానం నడుస్తోంది. తెలంగాణ అయితే టీఎస్... Read more
Oct 07 | ప్రముఖ ప్రవచనకర్త గరికపాటి నరసింహరావు ఇటీవల మెగాస్టార్ చిరంజీవిపై చేసిన వ్యాఖ్యలు దుమారాన్ని రేపుతున్నాయి. మెగాఫాన్స్ మహాపండితుడు గరికపాటిపై నెట్టింట్లో ట్రోల్ చేస్తున్నారు. ఇక దీనికి మెగాబ్రదర్ నాగబాబు చేసిన ట్వీట్ కూడా తోడు... Read more