వంద పీనుగలను తిన్న రాబందు ఒక్క గాలి వానకు కూలక తప్పదు. ఇప్పుడు సత్యం కేసులో రామలింగరాజు పరిస్థితి కూడా ఇలానే ఉంది. దేశంలో టాప్ కంపెనీగా ఎదిగింది అనుకున్న సత్యం.. పునాదులతో సహా కదిలిపోయింది. సత్యాన్ని నమ్మిన వారు లబోదిబోమంటూ నెత్తినోరు కొట్టుకున్నారు. అయితే తాజాగా సిబిఐ కోర్ట్ సత్యం కేసులో రామలింగరాజుతొ సహా మరో తొమ్మిది మందిని దోషులుగా తేల్చింది. సత్యం కంప్యూటర్స్ కుంభకోణం కేసు తుదితీర్పు వెల్లడించిన తర్వాత సీబీఐ ప్రత్యేక కోర్టు న్యాయమూర్తి ...దోషులతో విడి విడిగా మాట్లాడారు. ఈ సందర్భంగా రామలింగరాజు అరగంట పాటు సుదీర్ఘంగా న్యాయమూర్తితో తన కేసు పరిస్థితిని విన్నవించుకున్నారు. తనను క్షమించాలని కోరుతూ ఆయన న్యాయమూర్తికి నాలుగు పేజీల లేఖను సమర్పించారు. ఉద్దేశపూర్వకంగా తాను ఎలాంటి తప్పు చేయలేదని రామలింగరాజు ఈ సందర్భంగా న్యాయమూర్తికి తెలిపినట్లు సమాచారం.
ఉమ్మడి తెలుగు రాష్ట్రంలో తాను ఎన్నో సేవలు చేశానని రామలింగరాజు వెల్లడించారు. అత్యవసర చికిత్సను అందించే 108 వాహనాలు, గ్రామాల్లో వారికి వైద్య సేవలు అందించే 104 వాహనాలు, భైర్రాజు ఫౌండేషన్ , నాంది ఫౌండేషన్ల ద్వారా సమాజానికి ఎంతో సేవ చేశానని రామలింగరాజు న్యాయమూర్తి ముందు చెప్పుకొచ్చారు. తాను చేసిన సేవా కార్యక్రమాలను పక్క రాష్ట్రాలు కూడా అమలు చేశాయని ఆయన తెలిపారు. తాను ఎన్నో సామాజిక కార్యక్రమాలు చేశానని, కాబట్టి శిక్ష తగ్గించాలని రామలింగరాజు కోరారు. వయోవృద్దులైన తన తల్లిదండ్రులను చూసుకునే బాధ్యత తన మీద ఉందని కాబట్టి శిక్ష ను తగ్గించాలని రామలింగరాజు న్యాయమూర్తిని కోరారు.
- అభినవచారి
(And get your daily news straight to your inbox)
Aug 22 | అమెరికా అందరికీ ఒక డ్రీమ్. మరీ ముఖ్యంగా ఇంజనీరింగ్ పూర్తి చేసిన మన దేశవాసులకు అందులోనూ తెలుగువారికి అగ్రరాజ్యంలోకి అడుగుపెట్టి.. అక్కడ ఉద్యోగం సంపాదించి, స్థిరపడాలన్నది చాలామంది అభిలాష. ఇప్పటికే ఈ ఆశలు ఉన్నవారు... Read more
Oct 08 | అసలే నవరాత్రి వేడుకలు.. అంతా ఉత్సాహంగా ఉన్నారు.. వీధి మధ్యలో గర్భా నృత్యం చేయడానికి ఏర్పాట్లు చేశారు. యువతులు, మహిళలతోపాటు పురుషులూ బాగా రెడీ అయి వచ్చేశారు. కానీ డ్యాన్స్ మొదలుపెట్టగానే కరెంటు పోయింది.... Read more
Oct 08 | తిరుమలలో భక్త జన సందోహం పెరిగింది. దసరా పండగ తరువాత పండగ సెలవులు ముగింపు దశకు చేరకుంటున్న తరుణంలో శ్రీవారి దర్శనం కోసం భక్తులో పోటెత్తారు. సెలవులతో కూడిన వారాంతం కావడంతో భక్తులు పెద్ద... Read more
Oct 08 | దేశవ్యాప్తంగా వాహనాల రిజిస్ట్రేషన్ కు ఒకటే సిరీస్ అయిన బీహెచ్ విషయంలో కేంద్ర రవాణా శాఖ నిబంధనలను సడలించనుంది. దేశవ్యాప్తంగా ప్రతీ రాష్ట్రానికి విడిగా ఒక రిజిస్ట్రేషన్ విధానం నడుస్తోంది. తెలంగాణ అయితే టీఎస్... Read more
Oct 07 | ప్రముఖ ప్రవచనకర్త గరికపాటి నరసింహరావు ఇటీవల మెగాస్టార్ చిరంజీవిపై చేసిన వ్యాఖ్యలు దుమారాన్ని రేపుతున్నాయి. మెగాఫాన్స్ మహాపండితుడు గరికపాటిపై నెట్టింట్లో ట్రోల్ చేస్తున్నారు. ఇక దీనికి మెగాబ్రదర్ నాగబాబు చేసిన ట్వీట్ కూడా తోడు... Read more